Sunday, April 19, 2015

శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేంటి?

శివునిని భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. ఆయనను అభిషేకించడానికి రకరకాల పదార్థాలను, ద్రవపదార్థాలను ఉపయోగిస్తారు. పూర్వం నుంచి మన హిందూ సంప్రదాయంలో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని పాటించడం వల్ల పూర్వపాపాలు అన్ని తొలగిపోయి, మంచి లాభాలను పొందుతారని పండితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

అంతేకాదు... ఏయే పదార్థాలతో శివునికి అభిషేకం చేస్తే.. ఆయా పదార్థాలకు సంబంధించిన మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం....

- నువ్వుల నూనెతో శివుడిని అభిషేకిస్తే... అపమృత్యువు నశిస్తుంది.

- ఆవుపాలతో శివునిని అభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వసౌఖ్యాలు ప్రసాదించబడుతాయి.

- గరిక నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల... నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతారు.

- మెత్తని చెక్కరతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో వున్న దు:ఖాలు నాశనం అయి, సంతోష జీవన విధానాన్ని పొందుతారు.

- చెరకు రసంతో శివునికి అభిషేకించడం వల్ల.. ధనవ్యవహారాలలో వున్న సమస్యలు ఒక్కసారిగి తొలగిపోయి... ధనవృద్ది కలుగుతుంది.

- ఆవు నేయితో శివునిని అభిషేకిస్తే.. నష్టాలన్నీ తొలగిపోయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

- నిత్యం పెరుగుతో శివునిని అభిషేకిస్తే.. మంచి ఆరోగ్యంతోపాటు బలం, యశస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment