Saturday, April 18, 2015

స్వర్ణదేవాలయం

మన భారతదేశంలో వున్న ఆధ్యాత్మిక దేవాలయాలలో మహాలక్ష్మి స్వర్ణదేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపురం ప్రాంతంలో, ఆకుపచ్చని కొండలమధ్య వెలసివున్న ‘‘మలైకొడి’’ అనే శ్రేణిలో వుంది. ఈ ఆలయం వెల్లూర్ నగరంలోని దక్షిణ భాగాన చివరలో వుంది. ఈ ఆలయ నిర్మాణం 2007లో జరిగింది.

శ్రీ నందగోపాల్, శ్రీమతి జ్యోతిఅమ్మ దంపతులకు పుట్టిన శ్రీశక్తి అమ్మ పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. శక్తి అమ్మ జన్మించినప్పుడు అందరూ ఆమెను దైవ సమానంగా భావించారు. దీనికి తగిన సాక్ష్యాలు కూడా వున్నాయి.

శక్తి అమ్మ జన్మించినప్పుడు ఆమె నుదుటి మీద ఒక ప్రత్యేకమైన కాంతి (నామం) కనిపించేది. అదేవిధంగా ఆమె ఛాతికి ఇరువైపులా విష్ణుచక్రం లాంటి చిహ్నం, నత్తగుల్ల లాంటి చిహ్నాలు స్పష్టంగా కనిపించేవి. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను దైవంగా భావించారు. చాలా సందర్భాలలో ఈ అమ్మాయి (శక్తి అమ్మ) స్కూలులో కాకుండా, దేవాలయాలో కనిపించేదని చెబుతున్నారు.

కథ :

ఒక పవిత్రమైనరోజు... పదహారేళ్ల ఒక అమ్మాయి స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. కిటికీ వైపు కూర్చున్న ఆ అబ్బాయి ఆకాశంవైపు చూడడం జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా ఆ అబ్బాయి శరీరంలోనుండి ఒక కాంతివంతమైన శక్తిరూపంలో అమ్మవారి నారాయణి చిత్రం ఆకాశంలో ఏర్పాటయింది. ఆమె కుడిచేతిలో మరసింహ్, కుడిచేతిలో విష్ణుచక్రం పట్టుకునివుంది. అలాగే తన మూడవ చేతిలో ఒక లోటస్ ఫ్లవర్ వుండి, నాలుగవ చేతిలో దీవిస్తున్నట్లుగా కనిపించింది. అలా ఆ విధంగా మొత్తం రూపం ఏర్పడిన తరువాత ఒక్కసారిగా దృశ్యం మాయమైపోయింది. ఈ విధంగా ఎంతో ఆధ్యాత్మికమైన శక్తి అమ్మ ఆ అబ్బాయి శరీరంలో కొలువుండడంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు.

ఆ ఆలయ ప్రధాన లక్షణం ఏమిటంటే.. శ్రీమహాలక్ష్మి ఆలయ ‘విమానం’, ‘అర్ధ మండపం’ వంద ఎకరాల భూమిలో శ్రీ నారాయణ పీడం ఆధారంగా నిర్మించబడింది. శ్రీ శక్తి అమ్మను నారాయణి అమ్మగా కూడా పిలుస్తారు.

ఈ ఆలయం మొత్తం బంగారపు పూతతో నిర్మించబడింది. ప్రతి ఒక్క చిన్న విషయంలో ఈ ఆలయ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు వహించారు. సన్నని బంగారపు రేకులను, రాగి రేకులను ప్రత్యేక కళాకారులచే ఇందులో అమర్చారు.

ఈ మొత్తం ఆలయ నిర్మాణం 1.8 కిలోమీటర్ల పరిమాణంలో ఒక విష్ణు చక్రంలా, పచ్చని ప్రాంత మధ్య భాగంలో నిర్మించడం జరిగింది.

No comments:

Post a Comment