Saturday, April 18, 2015

హిమలింగేశ్వరుడి దేవాలయం

శివునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలానే కొలువున్నాయి. ఈయన క్షేత్రాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క కథను వివరిస్తుంది.

భారతదేశంలో ఉత్తరంవైపు వున్న అమరనాథ్ పర్వతాలలోని అమర్ నాథ్ గుహలు హిందువులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం. ఈ అమర్ నాథ్ గుహలోపల ఒక మంచు శివలింగంలా కనిపించే ఆకృతిని కలిగి వుంటుంది. ఇది వేసవి కాలమయిన మే నుండి ఆగస్టు వరకు వృద్ధి చెంది.. ఆ తరువాత కరుగుతుంది.

పురాణాల ప్రకారం... శివుడు తన భార్య అయిన పార్వతీదేవికీ జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించారు.

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు పార్వతీదేవి, ఈశ్వరుడితో... ‘‘నాథా! మీరు కంఠంలో వేసుకునే ఆ పుర్రెమాలగురించి నాకు వినాలని వుంది’’ అని అడిగింది.

అప్పుడు ఈశ్వరుడు... ‘‘పార్వతీ! నువ్వు జన్మించిన ప్రతిసారి నేను ఈ పుర్రెలమాలలో ఇంకొకటి అదనంగా చేర్చుకుని ధరిస్తుంటాను’’ అని బదులిచ్చాడు.

పార్వతీదేవి... ‘‘నేనే మరణించి, తిరిగి జన్మిస్తూనే వుంటాను. కానీ నువ్వు మాత్రం అలాగే శాశ్వతంగా అమరుడిగా వుంటున్నావు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగింది.

ఈశ్వరుడు... ‘‘పార్వతీ! ఇది ఎంతో రహస్యమైంది. కాబట్టి ఏ ఒక్క ప్రాణిలేని ప్రదేశంలో నీకు వివరంగా చెప్పాలి’’ అని చెప్పి... ఏ ప్రాణజీవి లేని అమరనాథ్ గుహ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు.

ఇలా ఈ విధంగా శివుడు పహల్ గాం వద్ద నందిని వుండమని ఉపదేశించి, చందన్ వారి చంద్రుడిని వదిలివెళ్లాడు. అలాగే పాములను, గణేషుడిని, పంచభూతాలను ఆకాశంలో తమతమ ప్రదేశాలలో వదిలేసి ఈ అమరనాథ్ గుహలకు చేరుకున్నాడు.

ఆ ప్రదేశంలో వున్న అన్యప్రాణులను ఇతర ప్రదేశాలకు పంపి, తన అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడే పైనున్న ఒక పావురాల జంట గుడ్లరూపంలో ఈ అమరత్వ రహస్యాన్ని విని.. అవి కూడా అమరులు అయ్యాయని కథనం.

రెండవ కథ :

పూర్వం ఒకనాడు బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి వుండేవాడు. అతనికి ఒకరోజు ఒక సన్యాసి బొగ్గులతో నిండి వున్న సంచిని ఇచ్చాడు. ఆ గొర్రెల కాపరి సంచిన తీసుకుని ఇంటికి వెళ్లి చూస్తే.. అందులో వున్న బొగ్గులన్నీ బంగారు నాణేలుగా మారాయి.

బూటా మాలిక్ ఆ సన్యాసికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తే... అప్పటికే సన్యాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ.. అక్కడ ఆ కాపరికి ఒక మంచు ఆకృతిలో వున్న శివలింగం కనిపించింది.

ఈ విధంగా మంచు లింగం ఆకారంలో వున్న శివుడు.. పురాతన కాలం నుంచి ప్రస్తుతకాలంలో వున్న ప్రజలకు దర్శనం ఇస్తూ వస్తున్నాడు.

గుహ విశేషాలు :

అమరనాథ గుహలు ఉత్తర భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమరనాథ పర్వతాలలో వున్నాయి. జమ్మూకాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ నుంచి దాదాపు 114 కిలోమీటర్ల దూరంలో, 3888 మీటర్ల ఎత్తులో వుంది.

మే నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ ఆలయం సుమారు 45 రోజులవరకు తెరిచివుంటుంది. దాదాపు 4 లక్షలమంది వరకు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారని అంచనా.

హిందువుల మాసాలలో పుణ్యమాసమైన శ్రావణమాసంలో వుంటుంది.

No comments:

Post a Comment