Saturday, April 18, 2015

పుణ్యక్షేత్రమైన వారణాసి

భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. బ్రిటీష్ పరిపాలకులు దీనిని బెనారస్ అనే పేరుతో పిలుచుకునేవారు.

ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేసుకోవడం వల్ల... మనం పుట్టుకనుండి చేసిన సర్వపాపాలు నశించి, పుణ్యులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు.. ఇక్కడ మరణించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వశిస్తారు. ఈ వారణాసి ప్రాంతంలో అన్యమతాలవారు, ఎక్కువ జనావాసం గల నగరాలలో ఒకటి.

ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఈ వారణాసి ప్రాంతంలో వుంది. ఈ నగరంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు దర్శనం ఇస్తాయి. ఈ ప్రాంతంలోనే బౌద్ధునికి సంబంధించిన సారనాత్ క్షేత్రం కూడా వుంది. కాబట్టి ఇక్కడ బౌద్ధులు, జౌనులు తరచూ సందర్శించడానికి వస్తుంటారు. ఇక్కడ హిందూ దేవాలయాలు చాలానే కొలువున్నాయి.

చరిత్ర :

పౌరాణిక గాధల సారాంశం ప్రకారం..... సుమారు 5000 సంవత్సరాల క్రితం వారణాసి నగరాన్ని శివుడు స్థాపించాడు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఏడు మహానగరాలలో ఈ వారణాసి ఒకటి. ఈ నగరానికి సంబంధించి ఋగ్వేదం, రామాయణం, స్కాంద పురాణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో కూడా అన్ని విషయాలు వివరించబడ్డాయి. 18వ శతాబ్దంలో ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఏర్పడిన తరువాత బ్రిటీష్ వారు దీనిని ఒక వాణిజ్యం కేంద్రంగా మలుచుకున్నారు.

పురాణ కథనాలు :

కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు. ఆరంభకాల పూరాతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్ధంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

వారణాసి... ఒక పవిత్ర క్షేత్రం :

వారణాసిలో అన్యమతాలవారికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఎన్నో కొలువున్నాయి. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎంతో విశిష్టమైన శివలింగం ఇక్కడుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి లక్షలమంది పైగా యాత్రికులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానాలు చేసుకోవడం వల్ల సకలపాపాలు తొలగిపోవడమే కాకుండా, పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం.

బుద్ధుడు కూడా తను ప్రయాణించిన యాత్రస్థలాలలో కాశీనగరం గురించి బోధించాడు. వారణాసి ప్రాంతానికి సమీపంలో బుద్ధుని సారనాథ్ క్షేత్రం వుంది. అలాగే జైనులకు 23వ తీర్థంకుడైన పార్శ్వనాధుని జన్మస్థలం కూడా వారణాసియే కాబట్టి... జైనులు కూడా ఇక్కడ తరుచూ సందర్శించడానికి వస్తుంటారు.

ముస్లిములకు సంబంధించిన ఇస్లామిక్ సంస్కృతి కూడా ఇక్కడ ప్రగాఢంగా వ్యాపించి వుంది. పూర్వంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు కూడా ఏర్పడ్డాయి.

అలాగే ఇక్కడ హిందువులకు సంబంధించిన అనేకరకాల పుణ్యక్షేత్రాలు, మందిరాలు చాలానే కొలువున్నాయి. అందులో అన్నపూర్ణామందిరం, విశాలాక్షిమందిరం, శాంక్తా మందిరం, దుర్గా మందిరం, సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, భారతమాత ఆలయం, బిర్లా మందిరం, కాలభైరవ మందిరం, కవళీ మాత ఇలా ఒక్కొక్క మందిరానికి సంబంధించి ఒక్కొక్క చరిత్ర వుంది. ముస్లిములకు సంబంధించిన మసీదులు ఇక్కడ చాలానే కొలువున్నాయి.

ముఖ్య శివ లింగాలు :

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

    విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

    మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

    ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్

    కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్

    త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్

    కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

    ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

    అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

    ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

    ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

    పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

    హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

    వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

    కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

    నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

    ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

    కాశేశ్వరుడు - త్రిలోచన్

    శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

    శుక్రేశ్వరుడు - కాళికా గలీ

మతపరమైన ఉత్సవాలు :

మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.

తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చ్ మాసాల మద్య నిర్వహించబడతాయి.

సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చ్-ఏప్రెల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి మరియు ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.

రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం మరియు పడవలలో ఉండి చూస్తుంటారు.

గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణమినాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

ఇంతటి పవిత్రమైన ఆ పుణ్యక్షేత్ర నగరంలో ఇంకా సందర్శించడానికి చాలానే వున్నాయి. ఆర్థికపరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది కూడా.

No comments:

Post a Comment