Sunday, April 19, 2015

పంచాయతాన పూజ అంటే ఏమిటి?

పూర్వం నుండి హిందువులు సంప్రదాయాలు, ఆచారాల ప్రచారం ప్రతిఒక్కరు తమ ఇళ్లలో పూజామందిరాలను అలంకరించుకుంటారు. ప్రస్తుతకాలంలో అయితే కొంతమంది బంగారపు విగ్రహాలను కూడా గృహాలలో అలంకరించుకుంటున్నారు. తమ ఇష్టదైవాలకు సంబంధించిన దేవతల ఫోటోలను, విగ్రహాలను అలంకరించుకుంటారు.

అయితే హిందూ సంప్రాదాయాల ప్రకారం.. అందరూ కులాలకు అతీతంగా పూజా మందిరాలలో ఐదుగురు దేవతల (పంచదేవతలు) విగ్రహాలను వుంచి పూజించుకోవాలి. సూర్యుడు, గణేశుడు, పార్వతిదేవి, శివుడు, విష్ణువు మొదలైనవారు పంచదేవతలు. వీరిని పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించుకోవచ్చు.

ప్రాచీనకాలం నుండి హిందూ ఆచారాల రీత్యా ఈ పంచదేవతలను పూజించడం ఎంతో శ్రేయస్కరమని మహాఋషులు, పండితులు తెలిపారు. అన్ని పూజా కార్యక్రమాలలో, శుభకార్యాలలో, దోష నివారణలో, కుటుంబసభ్యులు సంతోషంగా తమ జీవితాన్ని గడపడానికి ఈ దేవతలను పూజించడం ఎంతో మంచి చేకూరుతుందని ప్రగాఢ నమ్మకం.

ప్రతిరోజూ ఆచారాల ప్రకారం ఉదయాన్నే లేచి, తలంటుస్నానాలు చేసుకుని, శుభ్రమైన బట్టలను ధరించి పూజా కార్యక్రమాలను మొదలుపెట్టుకోవాలి.

ఈ ఐదుగురు దేవతల విగ్రహాలను చిన్నవిగా, తమ గుప్పిట్లో సరిపోయేంత పరిమాణంలో తయారుచేసుకుని.. ఒక పళ్లెంలో వుంచి పూర్వాభిముఖంగా కూర్చుని పూజాకార్యక్రమాలను నిర్వహించుకోవాలి.

కేవలం పంచ ఉపచార పూజ... అంటే దేవతల పేర్లయిన గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేధ్యం సమర్పయామి అని చెప్పి ఐదునిముషాలలోనే పూజను ముగించుకోవచ్చు.

No comments:

Post a Comment