Sunday, April 19, 2015

జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయో తెలుసా?

హిందూ ధర్మం ప్రకారం పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు 108 పూస‌లుండే జ‌ప‌మాల‌ను సాధారణంగా ప్రతిఒక్కరు ఉప‌యోగిస్తుంటారు. అయితే.. జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయోనన్న విషయం ఎప్పుడైనా గ్రహించారా..? పూసలు అదే 108 సంఖ్యలో వుండటానికి కొన్ని ఆసక్తికర విషయాలు పురాణ పుస్తకాల్లో తెలుపబడి వున్నాయి.

మొదటి కథ : శాస్త్రీయప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడన్నమాట! ఈ లెక్క ప్రకారం ఒక మనిషి దేవుడి స్మరణలోభాగంగా జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108ను నిర్ధారించార‌ని చెబుతారు.

రెండో కథ : మొత్తం 12 రాశులున్న విషయం అందరికీ తెలిసిందే! అలాగే ఈ రాశుల‌తో తొమ్మిది గ్రహాలున్నాయి. మనిషి జాతకం ఈ రెండింటితో ముడిపడి వుంటుంది కాబట్టి.. రాశుల సంఖ్యను గ్రహాల‌తో గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌.

మూడో కథ : జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్షత్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్షత్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. ఇలా అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు.

ఇక హిందూ ధ‌ర్మశాస్త్రం ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అందరి నమ్మకం. దానికి అనుగుణంగా జపమాలలో 108 పూస‌ల‌ను నిర్ధారించడం జరిగిందని జ్యోతిష్యులు చెబుతుంటారు.

హిందూ ధర్మం ప్రకారం పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు 108 పూస‌లుండే జ‌ప‌మాల‌ను సాధారణంగా ప్రతిఒక్కరు ఉప‌యోగిస్తుంటారు. అయితే.. జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయోనన్న విషయం ఎప్పుడైనా గ్రహించారా..? పూసలు అదే 108 సంఖ్యలో వుండటానికి కొన్ని ఆసక్తికర విషయాలు పురాణ పుస్తకాల్లో తెలుపబడి వున్నాయి.  
మొదటి కథ : శాస్త్రీయప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడన్నమాట! ఈ లెక్క ప్రకారం ఒక మనిషి దేవుడి స్మరణలోభాగంగా జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108ను నిర్ధారించార‌ని చెబుతారు.
రెండో కథ : మొత్తం 12 రాశులున్న విషయం అందరికీ తెలిసిందే! అలాగే ఈ రాశుల‌తో తొమ్మిది గ్రహాలున్నాయి. మనిషి జాతకం ఈ రెండింటితో ముడిపడి వుంటుంది కాబట్టి.. రాశుల సంఖ్యను గ్రహాల‌తో గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌.
మూడో కథ : జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్షత్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్షత్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. ఇలా అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు.
ఇక హిందూ ధ‌ర్మశాస్త్రం ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అందరి నమ్మకం. దానికి అనుగుణంగా జపమాలలో 108 పూస‌ల‌ను నిర్ధారించడం జరిగిందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
- See more at: http://www.teluguwishesh.com/spirituality/677-dharma-sandehalu/62783-the-secret-behind-108-beads-in-rosary-according-to-hindu-dharma.html#sthash.F5lXDcYD.dpuf

No comments:

Post a Comment