Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 14


కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో, ‘‘ఔను, నాథా! ఈ రోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీ మీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాల న్నంత మమత నాకు కనిపించింది!'' అన్నది. ‘‘ఆ కన్యకామణి మమత సరే. మరి, నీ సంగతి చెప్పలేదు!'' అన్నాడు కృష్ణుడు. ‘‘మీ లోపల ఒక అణువునై ఇమిడి ఉండి పోవడమే నాకు కావలసిందల్లా!
 
మీరు ఎవరి గుప్పెట్లో ఉన్నా నేను మీలోనే ఉంటాను గదా!'' అన్నది రుక్మిణి. ‘‘రుక్మిణీ! ఎంతో గొప్ప భావాన్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు! అందుకే నిన్ను కోరి కోరి ఎత్తుకు వచ్చాను!'' అన్నాడు కృష్ణుడు. ‘‘నాకు నిజమని తోచింది చెబుతున్నాను. నాకంటే సత్యభామదే గొప్ప మమత, బల మైనది! ఆ మమతలో, అనంతమైన ప్రకృతి శక్తి అంతా ఉంది. స్వామీ! నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే!''
 
అని చెబుతున్న రుక్మిణిని వారించి, కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, ‘‘రుక్మిణీ, వేదాంతం మాట్లాడకు!'' అన్నాడు. రుక్మిణి మందహాసం చేస్తూ ఊరుకున్నది. కొద్ది దినాలు గడిచాెూ లేదో, ‘‘కృష్ణుడు శ్యమంతకమణిని అపహరించాడు!'' అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆ విధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దుఃఖంతో పిచ్చివాడై వీధి వీధులా తిరిగి అరుస్తూ విశేష ప్రచారం చేశాడు.

తన మీద మోపబడ్డ అభాండానికి చింతించి ప్రెూజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చు కొని, ‘‘విఘ్నేశ్వరా! ఇదంతా నీ లీల. తరువాత నీ ద…ు!''అని కొంతసేపు మనసులో ధ్యానించి, శ్యమంతకమణిని అన్వేషించడానికి అరణ్యా ల్లోకి వెళ్ళాడు. జరిగినదేమంటే: సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడనే రాజుకిచ్చి వివాహం చేసే నిర్ణ…ూనికొచ్చి, తన తమ్ముడు ప్రసేనజిత్తును, శతధన్వుడితో మాటా మంతీ చేసి రమ్మని పంపాడు.
 
ప్రసేనుడు శ్యమంతకమణిని ధరించి అరణ్య మార్గంలో వెళ్తూండగా ఒక సింహం మణి చేత ఆకర్షింప బడి అతణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవం తుడు చంపి, మణిని తీసుకుపోయి, తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో, దిగ్భ్రాంతికి గురైన సత్రాజిత్తు, ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహ రించా డని చాటాడు.
 
సత్యభామను పెళ్లాడ్డానికి ఉవ్విళ్ళూరు తున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరిచి పగతీర్చుకోడానికి సా…ుపడతా మంటూ కబురు పెట్టారు. మణిని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు, అరణ్యంలో ఒక చోట చచ్చిపడి ఉన్న ప్రసే నుడినీ, సింహాన్నీ, జాంబవంతుడి అడుగు జాడలనూ చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు.
 
గుహలో నవ …ువ్వనవతి, సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగ ఎగరవేసి పట్టుకొంటూ ఆడుకొంటున్నది. జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబ వంతుడికి దొరికిన అనాధ రాజపుత్రిక. అతడామెను తన గుహకు తీసుకు వచ్చి ముద్దుల కూతురుగా పెంచుకొచ్చాడు. మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకొన్నాడు.
 
జాంబవతి చేతిని విడిపించుకోవడానికి ప్ర…ుత్నించకుండా తల వాల్చి సిగ్గుదొంతరలతో క్రీగంట కృష్ణుణ్ణి చూస్తున్న సమ…ుంలో జాంబవంతుడు గుహకు వచ్చి, కృష్ణుడిపై లంఘించాడు. ఇద్ద రికీ పన్నెండు రోజులపాటు గొప్ప …ుుద్ధం జరిగింది. కృష్ణుడు పిడికిటితో దిమ్మతిరి గేలా జాంబవంతుడి గుండెమీద బలంగా పొడిచాడు. ఆ బలమైన పోటుతో రాముడే కృష్ణుడుగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు.

జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, ‘‘కృష్ణా! నా కుమార్తె జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే!'' అంటూ శ్యమం తకమణినీ, జాంబవతినీ కృష్ణుడికి భక్తితో సమర్పించాడు. జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి, సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగిన దంతా చెప్పాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో, ‘‘కృష్ణా! సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనేవిధంగా నేను నింద నీపై మోపి మహాప రాధం చేశాను.
 
నన్ను నీ ఇష్టమొచ్చినట్టు దండించు!'' అన్నాడు. కృష్ణుడు సత్రాజిత్తుతో, ‘‘నీ పశ్చాత్తాపమే నీకు దండన!'' అన్నాడు. అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా, మన్ననగా శ్యమంతకమణినీ, సత్యభామనూ కృష్ణుడి ఎదుట ఉంచి స్వీక రించమని వేడుకొన్నాడు. కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ, శ్యమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకో మని తిరిగి ఇచ్చివేశాడు.
 
అప్పుడు సత్యభామ, కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగి పొర్లుతుండగా, ‘‘చూశావా, నాన్నా! నేను గొప్పదాన్నో, మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా!'' అన్నట్లు సగ ర్వంగా సత్రాజిత్తును చూసి, ‘‘నాన్నా! అంతా ఆ విఘ్నేశ్వరుడి ద…ు. ఒకప్పుడు విఘ్నేశ్వ రుడి మహత్తును గుర్తించలేని వాడివై ఏమో అన్నావు. నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకొన్నదాన్ని.
 
నా అభీష్టం నెరవేరింది!'' అంటూ విఘ్నేశ్వరుణ్ణి మనసారా ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనిపించి, ‘‘భగవంతుడు తనకు అత్యంత ప్రి…ుమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు. సత్యమే అతని సొత్తు!'' అనేఅర్థం స్ఫురించేలాగ, ‘‘సత్యభామా పరిణ…ుంతో కృష్ణుడు సత్యాపతిగా పేరు పడతాడు!'' అని చెప్పాడు.
 
సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మ్రొక్కి, ‘‘నా అపచారాన్ని మన్నించు దేవా!'' అంటూ లెంపలు వేసుకొన్నాడు. కృష్ణుడు, ‘‘విఘ్నేశా! అంతా నీ లీల. నీ ద…ువలన అపవాదు తొలగించుకొని మణి కంటే అమూల్యమయిన సత్యభామామణిని సంపాదించాను!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘శ్యమంతకమణి కథ విన్నవారికి అపనిందలు అంటవు,'' అని చెపుతూ అంతర్థానమ…్యూడు.

సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తన అదృష్టానికి పొంగిపోతూ, కృష్ణుడితో సత్య భామ వివాహాన్ని మహా వైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకొన్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో, ‘‘కృష్ణా! నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో …ుుద్ధం చే…ూలని అభిలాషను వ్యక్తం చేశాను. నీవంటి అల్లుడిని పొందిన జనకమహారాజు అదృష్టానికి అసూ…ుపడుతున్నానని కూడా అన్నాను.
 
ఆ రెండు కోరికలూ ఈ అవతారంలో ఇప్పుడు తీర్చావు. నేను ధన్యుణ్ణి, జీవన్ము క్తుణ్ణి!'' అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపో…ూడు. కొంతకాలం తరువాత శతధన్వుడు కసితో సత్రాజిత్తును చంపి మణిని తీసుకుని కృత వర్మ, అక్రూరులు తోడుగా పారిపో…ూడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధన్వుడిని …ుుద్ధంలో సంహరించాడు. అక్రూర కృత వర్మలు మణితో పారిపో…ూరు.
 
వారిని వెదకి పట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి, తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు. కృష్ణుడు మిత్రవింద, కాళింద, భద్ర, నాగ్నజితి, లక్షణ అనేవారిని కూడా వివాహం చేసుకొన్నాడు. ఎనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతి ఏటా వినా…ుకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు. శ్యమంతకమణి ప్రభావం వల్ల సత్యభామ అంతఃపురం అంతులేని బంగారంతో నిండి పోయింది.
 
ఆ బంగారంతో సత్యభామ రత్న రాసులనూ, అమూల్యాభరణాలనూ, చీని చీనాంబరాలనూ కోకొల్లలుగా తన ఇంట నింపు కొంది. అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతు రాలననే సంపద్గర్వంతో పాటు, తానే అందరి లోకీ అధికురాలననీ, కృష్ణుడికి ఇష్టభార్యననే అహంభావం ఆమెలో క్రమక్రమంగా పెరిగింది. కృష్ణుడి అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు.
 
నారదుడు ఒకనాడు తన మహతివీణను వాయించుతూ మహదానందంతో గగన మార్గంలో ప…ుని స్తూండగా పరిహాసం చేస్తూన్నట్లుగా పకపక మంటూ నవ్వు వినిపించింది. నారదుడు నివ్వెరపోయి, ‘‘ఎవరా నవ్వేది? ఎందుకు నవ్వుతున్నావు?'' అంటూ నలు దెసలా చూశాడు. ‘‘నారదా! ఇంకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణావాదానికి నీవు నీలో పొంగి పోతూంటే నవ్వు వచ్చింది!'' అని అశరీరవాణి పలికింది.

నారదుడు, ‘‘ఎవరివద్ద ఇంకా నేర్చు కోవాలి?'' అని అనుకుంటూండగా విఘ్నే శ్వరుడు సాక్షాత్కరించి, ‘‘జాంబవతి వద్ద వీణావాద్యంలోని మెళుకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో!'' అని చెప్పాడు. ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్ర హంతో జాంబవతి వల్ల వీణావాద్యంలోని మెళు కువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతః పురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతని కిచ్చాడు.
 
కృష్ణుడు దాన్ని రుక్మిణికిచ్చాడు. అది విని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడ వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి, నందన వనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకు వచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ కృష్ణుడికి తనపై గురి తగ్గి పోతూన్నదేమోననే దిగులు పట్టుకొన్నది సత్య భామకు.
 
కృష్ణుడిని తన చెప్పుచేతల్లో తన మందిరంలో ఉండిపోేులాగ చేసుకోవాలన్న తాపత్ర…ుం పెంచుకొన్నది. నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి, పుణ్యకవ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనం లోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత ని…ుమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకెత్తు బంగార మిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు. సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగా రాన్ని కృష్ణతులాభారంలో పెట్టింది. శ్యమం తకమణిని కూడా వేసింది. కాని కృష్ణుడు కొంచెమైనా తూగలేదు.

అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి, రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకొనే మార్గం చెప్పమని వేడింది. రుక్మిణి, ‘‘చెల్లీ! కృష్ణుడితో సరితూగ గల సంపద భక్తి ఒక్కటే! భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును!'' అని చెప్పి, సత్యభామకు చిన్న తులసి ఆకు ఇచ్చింది. సత్యభామ ఆ తులసీదళాన్ని కన్నులకద్దు కొని, భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది.
 
కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసీదళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని, కృష్ణుణ్ణి సత్యభామ పరం చేసి వెళ్ళిపో…ూడు. కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానో ద…ుం అయింది. ఐశ్వర్యం మీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తి భావం కలిగింది. మణివలన లభించిన బంగా రాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా …ూత్రి కులకూ, బాటసారులకూ భోజన వసతి సౌక ర్యాలుగల ధర్మశాలలనేకం, దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది.
 
ఆ ధర్మశాలలు సత్రాజిత్తు పేరు స్ఫురించేలాగ సత్రములు అని పిలువబడ్డాయి. అటుపిమ్మట కొంతకాలానికి కృష్ణ బల రాముల చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు, సత్యభామ శ్యమం తకమణిని సుభద్రకు అరణంగా పెట్టింది. ఆ విధంగా శ్యమంతకమణి పాండవులను చేరింది. మణి కూర్చిన బంగారం ధర్మరాజు రాజ సూ…ు…ూగం చే…ుడానికి బాగా ఉపెూగ పడింది.
 
తరువాత ధర్మరాజు జూదమాడి తనతో బాటు తమ్ములనూ, ద్రౌపదినీ, రాజ్యాన్నీ ఓడి పో…ూడు. రాజసూ…ు …ూగం చూసి దుర్యో ధనుడికి కన్ను కుట్టింది. ద్రౌపదిని పరాభవిం చాలనే దుశ్చింత రేపింది. పాండవుల పురోహి తు డైన ధౌమ్యుడు తొలినుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శ్యమంతకమణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు.
 
మణి భూగర్భంలో నిక్షప్త పడిపోయింది. పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూండగా, ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి, రాజ్య ప్రాప్తికి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశవ్రతాన్ని చేసి, తరవాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు.

No comments:

Post a Comment