Friday, September 7, 2012

రామాయణం - బాలకాండ 4


రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళి జనక మహరాజు యజ్ఞం చేస్తున్న చోటికి చేరాడు . యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలున్నాయి. విశ్వామిత్రుడు కాడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు .

ఈ లోపల జనకమహరాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది . ఆయన తన పురోహీతుడైన శతానందుడితో సహా వచ్చి విశ్వామిత్రుడుకి అర్ఘ్యపాద్యా లిచ్చి పూజించాడు. జనక మహరాజు విశ్వాముత్రుడితో తన యజ్ఙంపూర్తి కావటానికి ఇంకా పన్నెండు రోజులున్నవని చెప్పి , రామలక్ష్మణులను చూసి, " ఈ రాజపుత్రులెవరు? ఎవరి కుమారులు" అని అడిగాడు. విశ్వామిత్రుడు జన కుడికి రామలక్ష్మణులను పరిచయం చేసి, " మీ వద్ద ఉండే వింటిని ఎక్కుపె ట్టటం సాధ్యమవుతుందేమో చూడడానికి, ఈ రాకుమారులు ముఖ్యంగా ఇక్క డికి వచ్చారు," అని తెలియపరిచాడు.

జనకుడి వద్ద పురోహితుడుగా ఉంటున్న శతానందుడు అహల్యా గౌతముల పెద్ద కుమారుడు.రాముడి వల్ల తన తల్లికి శాపవిమోచనం జరిగిందనీ, తన తల్లిని శపించి వెళ్ళిపోయిన తంద్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడనీ విని శతానం దుడు ఎంతో సంతోషించాడు.అతను రాముడి కేసి తిరిగి, " రామా, ఈ విశ్వా మిత్ర మహముని అనుగ్రహం సంపాదించటం వల్ల నీవు ధన్యుడవయ్యావు. ఈ మహనీయుడి విచిత్రగాధ చెబుతాను విను," అంటూ,విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు:


బ్రహ్మదేవుడికి కుశుడనే కుమారుడు పుట్టాడు.  ఆయనకు కుశనాభుడు పుట్టాడు. కుశనాభుడి కొడుకైన గాధికి విశ్వామిత్రుడు కొడుకైపుట్టి, చాలా కాలం రాజ్యం చేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షౌహిణి సేవను వెంట బెట్టుకుని పర్యటన చేస్తూ వసిష్ట మహిముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సు లో నిమగ్నులై ఉండే ఋషులతో అ ఆశ్రమం రెండో బ్రహ్మలో కంలాగా ఉన్నది.

తన అశ్రమంలోకి వచ్చిన విశ్వామిత్రుడికి వసిష్ఠుడు అతిథీ సత్కారాలు చేశాడు. ఇద్దరూ కుశలప్రశ్నలు చేసుకున్నారు. కొంచెంసేపు ఇష్టాగోష్ఠి జరిగాక వసిష్ఠుడు తన అతిథికీ ఆయన పరివారానికి విందు చేస్తానన్నాడు. " తమ దర్శనమే నాకు గొప్ప విందు. వేరే విందు లెందుకు?" అంటూ విశ్వామిత్రుడు బయలుదేరబోయాడు. కాని వసిష్ఠుడాయనను బలవంతాన ఆపి, శబల అనే తన కామధేనువును పిలిచి, భక్ష్యభోజ్యలేహ్య చోష్య పానీయాలోతో అందరికీ షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయమన్నాడు. శబల అలాగే చేసింది. విశ్వా మిత్రుడీ విందుకు ఎంతో ఆనందించి, " మహర్షీ, నాకు శబలను ఇప్పించండి. దీనికి మారుగా లక్షగోవులను ఇచ్చుకుంటాను. శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి గనక, న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి," అన్నాడు.

"మహారాజా, లక్షగోవులు కాదు, నూరుకోట్ల గోవుల నిచ్చినా నేను శబల నివ్వను. ఇదే నాకున్న ధనం. మా ఆశ్రమం యావత్తూ దీనిపైనే ఆధారపడి ఉన్నది," అన్నాడు వసిష్ఠుడు.
విశ్వామిత్రుడు వసిష్ఠుడికి అడిగినంత బంగార మిస్తానన్నాడు. రత్నరాసులి స్తానన్నాడు. శబలను ఎలాగైనా తన కివ్వమన్నాడు. వసిష్ఠుడు నిరాకరిం చాడు. అప్పుడు విశ్వామిత్రుడు శబలను బలాత్కారంగా తీసుకుపోవటానికి ఉద్యమించాడు. శబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మి, రంకెలు వేస్తూ, కన్నీరుకారుస్తూ వచ్చి వసిష్ఠుడి కాళ్ళపై బడి, "ఏమిటీ అన్యాయం?" అన్నది. వసిష్ఠుడు శబలతో, "విశ్వామిత్రుడు అక్షౌహిణిసేనతో వచ్చిన బలశాలి. నాకాబలం లేదు. నేనేం చేసేది?" అని అడిగాడు.


 "తమ తపశ్శక్తి ముందు ఈ విశ్వామిత్రుడి బలం ఏమిటి? ఈ సేనలను సర్వ నాసనం చేయగల బలాలను, నేనే సృష్టిస్తాను, నాకు అనుమతి నివ్వండి," అన్నది కామధేనువు.కామధేనువు రంకెలు వేస్తూంటే పప్లవులూ, మ్లేచ్చులూ అనంతంగా పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చెయ్యసాగారు. విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రమోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులనూ, కాంభోజులనూ, హరీతులనూ, కిరాతులనూ సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టు పెట్టేస్తున్నారు. ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు నూరుమంది ఆయుధాలతో వసిష్ఠుడిపైకి వెళ్ళారు.

ఆయన ఒక్కసారి హుంకారం చేసేసరికి నూరుగురూ భస్మమై పోయారు. తన సేన అంతా పోయింది, నూరుగురు కొడుకులు క్షణంలో చచ్చారు. విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి, చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారం వేసి, హిమాలయానికి వెళ్ళీ అక్కడ శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.కొంత కాలానికి శివుడు ప్రత్యక్షమై ఏమివరం కావాలో కోరుకోమన్నాడు.

దేవతలూ, గంధర్వులూ,యక్షులూ, రాక్షసులూ అధిదేవతలుగా గల అస్త్రాలన్నీ తనకు వశం కావాలనీ, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతలా మలకం కావాలనీ విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్థానమైనాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో వసిష్ఠుణ్ణి నిర్మూలించదలిచి విశ్వామిత్రుడు వసిష్ఠాశ్రమం ప్రవేశించి, తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లాచెదరుగా పరిగెత్తారు. పక్షులూ, మృగాలూ పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది.

వసిష్ఠుడు ఆగ్రహావేశంతో తన బ్రహ్మదండం ఎత్తి విశ్వామిత్రుడి కెదురు    వచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వసిష్ఠుడి బ్రహ్మదం డాన్ని తగలగానే అది కాస్తా చల్లారిపోయింది.

విశ్వామిత్రుడు కొన్నివందల అస్త్రాలను ప్రయోగించాడు. కాని వసిష్ఠుడి బ్రహ్మదండం అన్నిటినీ దిగమింగేసింది. వసిష్ఠుడి బ్రహ్మదండం నుంచీ, ఆయన శరీరం నుంచీ జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వసిష్ఠుణ్ణీ సమీపించి, "ఓ మహర్షీ, విశ్వామిత్రుణ్ణి జయించావు. ఇక శాంతించు!" అని వేడారు.


"బ్రహ్మతేజోబలం ముందు క్షత్రియ బలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మ త్వం సంపాదిస్తాను," అనుకుని విశ్వామిత్రుడు భార్యాసమేతంగా దక్షిణదిశకు వెళ్ళి, అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు హవి ష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారధుడు అనే నలుగురు కొడుకులు కలిగారు. కొంతకాలానికి బ్రహ్మప్రత్యక్షమై విశ్వామిత్రుడితో," నీ తపస్సు చేత నీకు రాజర్షిలోకాలు స్వాధీనమైనాయి. ఇక ముందు అందరిచేతా నీవు రాజర్షివని పిలవబడతావు," అని చెప్పాడు. రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకు బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్ళీ తపస్సు సాగించాడు.

ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు అనే వాడు బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఈ కోరికను తన కులగురువైన వసిష్ఠుడితో చెబితే, అది అసాధ్యమని ఆయన అన్నాడు. దక్షిణాన ఉంటున్న వసిష్ఠకుమారులు తనకు శాయపడతారేమోనని త్రిశంకు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశం కును వచ్చినదారి పట్టమన్నారు. అంతటితో బుద్దిరాక త్రిశంకు వాళ్ళను దెప్పి, మరెవరినైనా ఆశ్రయిస్తానన్నాడు. వసిష్ఠుడి నూరుగురు కొడుకులు మండి పడి, చండాలుడివి కమ్మని అతణ్ణీ శపించారు.

శాపం చేత త్రిశంకు నల్లటి ఆకారమూ, నల్లటి బట్టలూ, ఇనప సొమ్ములూ కలిగిన వడై వసిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుణ్ణి అశ్రయించాడు. విశ్వా మిత్రుడు త్రిశంకు చెప్పినదంతా విని, "నిన్ను ఈ ఆకారంతోటే స్వర్గానికి పంపుతాను, " అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి, అందుకు ఋషుల నందరినీ పిలుచుని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకుని అందరూ వచ్చారు గాని, మహోదయుడనే వాడూ, వసిష్ఠుడి కొడుకులూ రాలేదు. రాని వరిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు. యజ్ఞం ఆరంభమయింది. కాని హవిస్సులు తీసుకోవటానికి దేవతలు రాలేదు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుతో, "నే నింతకాలం తపస్సు చేసిసంపాదించిన శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపుతాను," అన్నాడు.


మునులందరూ చూస్తుండగానే, త్రిశంకు తన శరీరంతోనే పైకి లేచి స్వర్గానికి వెల్లి పోయాడు. అయితే అక్కడున్న ఇంద్రాది దేవతలు త్రిశంకును స్వర్గానికి రానివ్వక, అతన్ని కిందికి తోసేశారు. త్రిశంకు తలకిందుగా పడిపోతూ, " మహాత్మా, రక్షించు!" అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణ దిక్కున మరొక సప్తర్షి మండలాన్నీ, కొత్త నక్షత్రాలనూ సృష్టించి,"ఇంకొక స్వర్గాన్నీ, కొత్త దేవతలనూ కూడా సృష్టిస్తాను, " అన్నాడు. అప్పుడు దేవతలూ, ఋషులూ భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, "మహానుభావా, శాపగ్రస్తుడైన త్రిశంకును స్వర్గంలో ఎలా ఉంచటం?" అని అడిగారు.

" ఇతణ్ణీ బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. అది జరిగితీరాలి," అన్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలకిందులై శాశ్వతంగా ఉండి పోయేటట్టూ, విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్టూ ఏర్పాటు జరిగింది.

తరవాత విశ్వామిత్రుడు దక్షిణాన్ని వదిలి పెట్టి, పడమరగా ఉన్న పుష్కరమనే పెద్ద తపోవనానికి వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఈ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభింగా, ఇంద్రుడు యజ్ఞపశువును ఎత్తుకుపోయాడు. అప్పుడు రాజపురోహితుడు యజ్ఞప శువును ఎలాగైనా సంపాదించాలనీ, అది దొరక్కపోతే నరపశువును బలి ఇవ్వవలిసి ఉంటుందనీ రాజుతోచెప్పాడు. యజ్ఞపశువు దొరక్కపోవటంచేత అంబరీషుడు నరపశువు కోసం బయలుదేరాడు.


భృగుతుంద మనే కొండ ప్ర్రాంతంలో ఋచీకుడనే ముని తన భార్యా బిడ్డలతో ఉంటున్నాడు. అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ చెప్పి, "లక్షగో వులిస్తాను, మీ కొడుకులలో ఒకణ్ణి యజ్ఞపశువుగా ఇవ్వండి," అని ప్రార్థిం చాడు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు ఋచీకుడు. ఆఖరువాణ్ణీ ఇవ్వనన్నది ఋచీకుడి భార్య. శునస్సేపుడనే వాడు రెండోవాడు. వాడు రాజుతో, "మా అమ్మా, నాన్నా నన్ను అమ్మటానికి సిద్దంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు. నన్ను మీ వెంట యజ్ఞపశువుగా తీసుకుపోండి," అన్నాడు. అంబరీ షుడు శునశ్శేపుణ్ణి వెంటబెట్టుకుని మిట్టమధ్యాన్నానికి ఎండదెబ్బ తిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు. శునశ్శేపుడు విశ్వామిత్రుణ్ణి చూస్తూనే ఆయన పాదాలపై పడి, తన కథ చెప్పుకుని, తనను కాపాడమని ఏడ్చాడు.

విశ్వామిత్రుడు వాణ్ణీ చూసి జాలిపడి తన నలుగురు కొడుకులతో, "వీడికి బదులుగా మీరు యజ్ఞపశువులై వీణ్ణి కాపాడండి," అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్యపెట్టక ఆయన మాట నిరాకరించారు. విశ్వామిత్రుడు మండిపడి తన కొడుకులను కూడా వసిష్ఠుడి కొడుకులను శపించినట్టే శపించాడు. తరవాత విశ్వామిత్రుడు శునశ్శేపుడికి రెండు మంత్రాలు ఉపదేశించి, "నిన్ను యజ్ఞప శువును చేసి యూపస్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహొ త్రుడు నీకు సుముఖుడవుతాడు," అని చెప్పాడు.
అలాగే జరిగిందికూడా. అంబరీషుడి యజ్ఞంలో శునశ్శేపుడికి ఎర్రగంధం పూసి, ఎర్రబట్టలు కట్టి, దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు వాడు తన మనసులో రెండు మంత్రాలు జపించుకున్నాడు. ఇంద్రుడు వాడికి ప్రత్యక్షమై దీర్ఘాయువునిచ్చాడు.






No comments:

Post a Comment