Friday, January 11, 2013

కర్పూర గుండం యెక్క ప్రత్యేకత

అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టి తీర్థయాత్రకు సన్నద్దులు అయినపుడే కర్పూరము ధారాళముగా సేకరించుకొని పోవుదురు. దారి మధ్యమున శబరిగిరి క్షేత్రమును చేరు వరకూ ప్రతి దినమూ ప్రాత: సంధ్యా సమయములందు ఇరుముడి కట్టుకు దీపారాధనములను జరుపుటకునూ(స్వామి వారికి కర్పూర దీపము మిక్కిలి ఇష్టమైన ఆరాధన) దారిలోని ఆలయాలలో వెలిగించుటకనూ ఉపయోగించినదిపోగా మిగిలిన కర్పూరమును స్వామివారి సన్నిధానమునందు గల )బలిరాయికి ప్రక్కనుయున్న) కర్పూర గుండము నందు వేసెదరు. మూడు నాలుగు దినములు రాత్రి పగలనక భక్తాదుల వేయు కర్పూరములోనే ఈ హోమ గుండము జాజ్వల్య మానముగా వెలుగును.   

No comments:

Post a Comment