Friday, January 11, 2013

స్త్రీలు పురుషులకు ఎడమ వైపుగా కూర్చోవాలా ?

మను ఋషులు ఇలా స్త్రీలు తమ భర్త పక్కన ఎడమ వైపుగా కూర్చోవాలని చెప్పడం జరిగింది. ఏదైనా శుభకార్యమో లేక వివాహంలోనో స్త్రీని భర్త ఎడమ వైపున కూర్చుండజేస్తారు. స్త్రీ కుడి శక్తిగా పురుషుడు మరియు పురుషుడి ఎడమ సామర్ధంగా స్త్రీ చరించాలని ఈ ఆచారం వెల్లడిచేస్తుందని చెప్పడం జరుగుతుంది.

కుడి భాగం శక్తికి, ఎడమ భాగం సమతౌల్యానికి సంబంధం కలిగి ఉన్నాయి. అర్థనారీశ్వర (శివ శక్తులు ఐక్యమై ఒకే శరీరాన్ని కలిగి ఉండుట) తత్వం ఈ విశ్వాసాన్ని బలపరుస్తుంది. అయితే ఈ విషయాన్ని గతంలో అనేక పరిశోధకులు ఆమోదించలేదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి.

పురుషుడి ఎడమ భాగం స్త్రీ తత్వాన్ని ప్రతిభింభిస్తుందన్ని కలిగి ఉంటుందని వెల్లడైంది. ఆ కారణంగా, ఈ విషయాన్ని ఏనాడో గ్రహించిన మన పెద్దలు స్త్రీ పురుషుని ఎడమ వైపు కూర్చోవాలని చెప్పడం జరిగింది. కావున దీన్ని ఆచరించి మన సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం.    

No comments:

Post a Comment