Friday, January 11, 2013

దేవుని పట్ల అర్చకుని భావన ఎట్లుండవలెను ?

 జయాఖ్య సంహిత ఇలా చెప్తూన్నది.  శ్లొ!! అహం స భగవాన్ విష్ణు: నారయణో హరి:! వాసుదేవో హ్యహం వా, పి భూతాం వాసో నిరంజన:!! భగవదర్చన చేసేవారు (అర్చకులు) తమ మనుసూ, మాటలనూ, క్రియలనూ, సర్వమునూ ఆ భగవంతుడే తనకు ప్రసాదించాడని భావిస్తూ, వాటిని తిరిగి ఆ దేవునికే సమర్పించి...

‘‘ సర్వం విష్ణు మయం జగత్’’ అనే స్థిరమైన భావంతో ‘‘నేను విష్ణు భగవానుడను! నారాయనుడను! నేను హరిని ! సర్వజీవుల యందూ నిండివుండిన వాసుదేవుడను నేనే! అని భావించి తీరాలి. (నాలోనే భగవంతుడున్నాడు! నేనే భగవంతుడిని! అని భావిస్తూ ధర్మాచరణ సాగిస్తూ జీవించే అర్చకులు ఈ రోజుల్లో ఎంతమంది. ఉన్నారూ...?!)  

No comments:

Post a Comment