Friday, January 11, 2013

స్త్రీల పుణ్యం ఎలా కరిగిపోతుంది...?

వ్రతాల ద్వారా, పుణ్యాల ద్వారా, పతి సేవల ద్వారా, దానాల ద్వారా, ధర్మాకార్యాల ద్వారా, ఇంకా భర్త చేసిన పుణ్యాల వల్లా స్త్రీలకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్లా, భర్తవల్లా, బిడ్డల వల్లా సుఖాలు కలుగుతాయి. ఎన్ని సత్ కార్యాలు చేసినా సుఖము లేదంటే పుణ్యం ఎప్పటికప్పుడు కరిగిపోతుందని అర్థం. దానికి కారణము రజోగుణము అనగా ఆగ్రహం. కోపము వల్ల ఎంత పుణ్యము ఆర్జించినా పుణ్యఫలమంతా తరిగిపోతుంది. 

దు:ఖాలకూ, బాధలకూ కారణమవుతుంది. ఆ కోపం వల్లే విశ్వామిత్రుడు తన పుణ్యాన్ని మొత్తం అనేక వృధా కార్యాలకి వశిష్టుడు వంటి ఎందరో శాంతమూర్తులపై వినియోగించాల్సి వచ్చింది. ఆవేశం అన్ని వేళలా తగడు. ఆవేశంతో పాటు అబద్దం... అసత్యవాక్కు ఎంతో పుణ్యాన్ని హరించి వేస్తుంది. అసత్యవాక్కు కంటే అబద్దాన్ని చెప్పించటం ద్వారా మొత్తం పుణ్యమే కరిగిపోతుంది. భర్తకు చెప్పే అబద్దం ద్వారా చెయ్యబోయే పుణ్య కార్యాల పుణ్యం కూడా హరించుకుపోతుంది.

No comments:

Post a Comment