Friday, January 11, 2013

ప్రాత:కాలంలో భూదేవతకు నమస్కరించాలి ఎందుకు

 భారతీయ శిష్టాచారం ప్రకారం మనకు ఉపకరించే వాటిపై సదా కృతజ్ఞతాభావం కలిగి ఉండమే ముఖ్యమైన మానవగుణం. అందుకే సందర్బానుసారముగా అప్పుడప్పుడు జడ వస్తువలైన డోలు, రోకలి, తిరుగలి, పొయ్యి, బావి వంటి వాటికి కూడా పూజలు చేస్తుంటారు.

 వీటికే చేసినపుడు మన పోషణకు అవసరమైన పండ్లు, ఆహారం,నీరు సర్వం భూమి నుండే లభిస్తున్నపుడు మనందరినీ మోస్తున్న తల్లులకు తల్లి అయిన భూమాతకు ప్రాత:కాలంలో నమస్కరించవద్దా ? తప్పక నమస్కరించి మన కృతజ్ఞతను తెలియజెప్పాలి.  

No comments:

Post a Comment