Friday, January 11, 2013

తిరుమల శ్రీవారికి శుక్రవారంనాడు అభిషేకం చేస్తారు ఎందుకు ?

అపోహ : ఏడుకొండల వానికి ప్రతి శుక్రవారమునాడు జరిగే అభిషేకం ఆ స్వామి యెక్క శక్తి స్వరూపాన్ని తెలియ పరుచటకేనని కొందరు అపోహ పడుతుంటారు.

వాస్తవం : నిజానికి శుక్రవార అభిషేకం స్వామి వక్ష స్థలం పై గల లక్ష్మీదేవిని ఉద్దేశించి నిర్వహించబడుతుందని సంప్రదాయం తెలిసిన పెద్దలు చెబుతున్నారు. శుక్రవారంనాడు లక్ష్మీదేవికి అభిషేకం చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా!

లక్ష్మీదేవికి అభిషేకం చేయడానికి స్వామి వారి వక్షస్థలాన్ని మాత్రమే తడిపి, సగం తడిపిన స్వామివారిని అలానే వదలివేయరాదు. కనుక లక్ష్మీతోపాటు లక్ష్మీ కాంతుడైన ఆ వెంకటేశ్వర స్వామికి కూడా శుక్రవారంనాడు అభిషేకం చేస్తున్నారు. అని గ్రహించాలి.   

No comments:

Post a Comment