Friday, January 11, 2013

మహాశివుని భస్మమెంతటి పుణ్యశక్తి కలది....

జంబూనదిని పొంది అక్కడి మట్టి బంగారమైనట్టూ, మానససరోవరాన్ని చేరి కాకులు హంసలైనట్టూ, అమృతాన్ని త్రాగితే దైవత్వము వచ్చినట్టూ, శంభుని భూషణమైన భస్మధారణ ద్వారా మహా పుణ్యశక్తి కలుగుతుంది. మంథర పర్వతంపై సనత్కుమారునికి మహాశివుడు భస్మ మహత్యాన్ని వివరిస్తూ, కాల్చిన గోమయమును ఐదు మంత్రాలతో అభిమంత్రించిన భస్మాన్ని లలాటమందూ, రెండు భుజములపై ధరించిన వారికి మహాపాతకాల నుంచి విముక్తి.

 పరుల ధనము అపహరించిన పాపమూ, చేయకూడని వారితో చేసిన సంపర్కపాపమూ, అసత్య దోషాలూ, పరస్త్రీ స్పర్శలవవల్ల కలిగిన పాపాలూ, ఉప పాతకుములూ తొలగిపోతాయి అని పరమేశ్వరుడే శెలవిచ్చాడు.  

No comments:

Post a Comment