Friday, January 11, 2013

జీవిత గమనంలో మనిషికి ఏది తోడుంటుంది ?

మానవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోయినట్లే అన్నది ఋషి వాక్కు. భారతీయ సంప్రదాయం ప్రకారం సద్దుణమే వెలకట్టడానికి వీలులేనంతటి సత్ సంపద. సద్గుణము ఒక్కసారిగా ఎవరికీరాదు. దాన్ని మనం సాగు చేయాలి. జాగ్రత్తగా పెంచి పోషించాలి.

 దుర్గుణమనే పురుగు పడితే సత్ సంగము లేక సత్ గ్రంథ పఠనము అనే మందును చల్లి సత్ సంగము లేక సత్ గ్రంథ పఠనము అనే మందును చల్లి దుర్గుణాన్ని తుదిముట్టించాలి. శ్రీరాముడిని ఇన్నివేల సంవత్సరాలుగా మానవులు మరిచిపోలేక పోవడానికి గల ప్రధానకారణము అతని వైభవోపేతమైన సద్గుణములే ! అందుకే శ్రీరాముడిని ‘సకల గుణాభి రాముడు’ అని కీర్తిస్తారు.

 మనం కూడా ఈ మంచి గుణాలను సాగుచేసుకుంటూ ఉండాలి. జన్మత: ప్రతి వ్యక్తికి కొన్నిమంచి గుణాలు మరియు చెడు గుణాలు వస్తాయి. పుష్పం విరభూస్తన్నపుడు సువాసన గుభాళించినట్లుగా, మనిషి పెరుగుతన్న కొద్దీ అతనిలోని గుణాలు ఒక్కొటిగా వ్యక్తమవుతుటాయి. ‘ అయ్యో! నాకు చెడు గుణం ఉంది’. అని బాఃధపడరాదు.    

No comments:

Post a Comment