Friday, January 11, 2013

కన్యలకు వివాహాది దోషాలు తొలగిపోవాలంటే...!

ఎర్రటి ఏడు ప్రమిదలతో దీపమెలిగించే కన్యలకు వివాహాది దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ ఆలయంలోనైనా ఏడు ప్రమిదల్లో శుక్రవారం లేదా మంగళవారం పూట నేతితో దీపమెలిగించే కన్యలకు మనస్సుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. ఇంకా మహిళలు సైతం ఇలా తొమ్మిదివారాలు దీపమెలిగిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.

 ఇంకా ఒక ప్రమిదతో దీపమెలిగిస్తే.. విద్యావకాశాలు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. రెండు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మూడు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. దీర్ఘ ఆయుర్దాయం చేరూకుతుంది. నాలుగు ప్రమిదలతో దీపమెలిగించే వారికి.. గృహం, వాహనాల కొనుగోలు వంటి శుభఫలితాలుంటాయి. ఐదు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

 ఆరు ప్రమిదలైతే.. మంచి స్నేహితులు, ఏడు ప్రమిదలైతే.. వివాహదోషాలు తొలగిపోతాయి. ఎనిమిది ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే.. శత్రుభయం వంటి తొలగిపోతుంది. తొమ్మిది ప్రమిదలైతే.. నవగ్రహదోషాలు హరింపబడుతాయి. పది ప్రమిదలైతే.. శత్రుభయం ఉండదు. 108 ప్రమిదలతో దీపమెలిగిస్తే... అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 508 ప్రమిదలతో దీపమెలిగించే వారికి వివాహ దోషాలు తొలగిపోయి, మంచి భవిష్యత్తు చేకూరుతుంది. 1008 ప్రమిదలైతే.. సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.  

No comments:

Post a Comment