Thursday, February 7, 2013

తెల్లని అన్నంతో శివలింగం నిర్మించి పూజలు చేస్తే..!?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.
- ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేయండి
- శీత సంబంధిత వ్యాధులు ఉంటే సోమవారం చేయండి
- రక్తానికి, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం చేయండి.
- బుద్ధికి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే బుధవారం చేయండి.
- అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉంటే గురువారం చేయండి.
- మూత్రకోశ రోగాలు, మూత్రపిండాల సమస్య, డయాలసిస్, మూత్రపిండాల్లో రాళ్లు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయండి.
- ఎముకల సమస్యలు, వెన్ను నొప్పి, నడుంనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయండి.
- మనసుకు, చిత్తానికి శాంతి కలిగేందుకు, శాంతి లభించేందుకు బుధవారం రోజు చేయండి.
- మంచి జ్ఞాపకశక్తి పొందేందుకు పుణ్యక్షేత్రాల్లో దర్శనం ముక్తి పొందేందుకు శనివారం రోజు చేయండి. చాలా మంచి జరుగుతుంది.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

No comments:

Post a Comment