Saturday, February 9, 2013

పర్ణ ప్రసాదమంటే ఏమిటో మీకు తెలుసా!?

పర్ణ అంటే ఆకులు అని అర్థం. తిరుమల దేవాలయం నుంచి పాపనాశిని ఆకాశగంగకు వెళ్లే మార్గంలో పరమ భక్త హాథిరాం బావాజీ సమాధి వుంది. దీన్ని హథీరాం మఠం అని అంటారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్ని అందిస్తారు. ప్రసాదాన్ని ఆకు రూపంలో ఇస్తారు. ఆకు అంటే సామాన్యమైన ఆకు అని అనుకోవద్దు. ఆ ఆకు సామాన్యమైంది కాదు. ఆ ఆకు సంజీవని చెట్టుది (సంజీవని ఆకు) ఈ సంజీవని ఆకును తింటే దేహంలోని అన్ని రోగాలు నాశనం అవుతాయి. వీటిలో రెండు రకాల ఆకులు ఉన్నాయి.

ఈ సంజీవిని ఆకును తింటే దేహంలోని అన్ని రోగాలు నయమవుతాయి. వీటిలో రెండు రకాల ఆకులు ఉన్నాయి.
1. సంజీవిని
2. అమృత సంజీవని
సంజీవిని చెట్టు పేరు విన్నంతలోనే మీకు రామాయణంలోని యుద్ధకాండ ప్రకరణంలో హనుమంతుడు సంజీవని అనే పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని బతికించిన వైనం గుర్తుకు వైనం వచ్చి తీరుతుంది.

ఈ సంజీవని చెట్టు ఆకులను తిని హాథీరాం మహరాజు (బావాజీ) జీవితం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నందున ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి సంజీవని ఆకును ఇస్తారు. అందుకే ఈ ప్రసాదానికి పర్ణ ప్రసాదమని పేరు. ఈ సంజీవని ఆకును ఎవరు తింటారో వారి రోగాలన్నీ తొలగిపోతాయి.

సంజీవని ఆకుకు, అమృత సంజీవని ఆకుకు ఉన్న తేడా ఏమిటి?
సంజీవని ఆకులానే అమృత సంజీవని ఆకు కూడా ఉంటుంది. అమృత సంజీవని ఆకును నోటిలో ఉంచుకుని పీల్చుకుంటే నోట్లో నీటి అంశం ఎక్కువ ఉంటుంది. ఈ నీరు అమృత సమానమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

అమృత సంజీవని ఆకును ఒక గుప్పిట అంత నీటితో శుభ్రపరిచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల్లోపు తింటే అసాధ్యమనుకున్న రోగాలైన క్యాన్సర్, గుండెనొప్పులు, ఆస్తమా, మధుమేహం తదితర వ్యాధులు నయం అయిన ఘటనలు చాలా ఉన్నాయి.

ఈ చెట్టు బెంగళూరులోని లాల్‌బాగ్, కబ్బన్ పార్క్ మల్లేశ్వరంలోని అటవీ విభాగం నర్సరీలో లభిస్తుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు. అనంతరం తమలపాకు భక్తులకు ప్రసాదం ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.

No comments:

Post a Comment