Saturday, February 9, 2013

వరలక్ష్మీ వ్రతం నాడు బిల్వ వృక్షాన్ని పూజిస్తే..!?

శ్రీమన్నారాయణుడిని మదిలో కొలువై ఉండే లక్ష్మీదేవి ముత్తైదువులు, పూర్ణ కుంభం, పసుపు, కుంకుమ, చందనం, తోరణాలు, అరటి చెట్టు, తమలపాకు, దీపాలు, అరచేయి, ఏనుగు, ఆవులో ఉంటుందని పురోహితులు అంటున్నారు.

అలాగే అందం, ధైర్యం, అణకువ, జ్ఞానం, ధర్మచింతన, కీర్తి, దైవభక్తి కలిగిన వ్యక్తుల్లోనూ లక్ష్మీదేవి కొలువై వుంటుంది. బిల్వ వృక్షం, ఉసిరి వృక్షం, తులసి, పసుపు చెట్లలోనూ లక్ష్మీదేవి నివాసముంటుంది.

లక్ష్మీదేవిని బిల్వ పత్రాలతో పాటు తామర పువ్వు, చామంతి పూవులతో అర్చించవచ్చు. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజున బిల్వ వృక్షాన్ని పూజించి ప్రదక్షణలు చేస్తే లక్ష్మీదేవిని అర్చించేందుకు సమానమని పండితులు అంటున్నారు.

No comments:

Post a Comment