Saturday, February 9, 2013

వసుపు గౌరీ వ్రతం ఎలా చేయాలో తెలుసా?

పసుపు గౌరీ వ్రత కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. నూరు పసుపు కొమ్ములతో వందరోజులు నోము పట్టే స్త్రీకి వంద సంవత్సరాలు ఐదవతనం ఉంటుంది. ఒక ఊరిలో వేద పండితుని కుమార్తె పసుపు గౌరీనోము పట్టింది. దానిలో నియమం తప్పడం వలన ఆమెకు పుట్టిన సంతానం చనిపోతారు.

అందువల్ల విచారంలో కుంగిపోయిన ఆమె వద్దకు పరమేశ్వరుడు వృద్ధుని రూపంలో వచ్చి అమ్మా నీవు పూర్వం పసుపుగౌరీ నోము పట్టి నియమం తప్పావు. అందువలనే నీ సంతానం నష్టమౌతుంది. అందుచేత నిష్టతో నోము పట్టమని చెబుతారు. దీంతో వేదపండితుని భార్య నియమతో ఈ నోము ఒక సంవత్సరం పట్టింది.

ఒక కేజీ పసుపు, ఒక కేజీ కుంకుమ, వెండి గౌరీ ప్రతిమ చేయించి దానికి ఒక సంవత్సరం పూజ చేసి సంవత్సరాంతమున ఒక ముత్తయిదువుకు జాకెట్ బట్ట దక్షిణ తాంబూలాలతో వాయనం ఇచ్చింది. దీంతో ఆమెకు సంతానం కలిగింది. 

No comments:

Post a Comment