Saturday, February 9, 2013

సూర్యనమస్కారంతో ఆరోగ్యభాగ్యాన్ని పొందండి!

ఆరోగ్యాన్ని కోరేవారు ప్రతినిత్యము సూర్యాతాప స్నానము చేసి తీరాలి. ఈ సూర్య స్నానాన్ని రుతువును అనుసరించి చేయాలి. గ్రీష్మరుతువులో ఉదయం 8 గంటల్లోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేయాలి. ఈ స్నానం 15 నిమిషాలు లేదా అరంగట వరకు చేయవచ్చు.

సూర్యోదయసమయంలో సూర్యనమస్కారాలు చేయాలి. సంప్రదాయం ప్రకారం సూర్యనమస్కారం చేయాలి. ప్రతినిత్యం ప్రాతఃస్నానము చేసిన తర్వాత సూర్యునికి ఎదురుగా నిలబడి పద్ధతులు బట్టి నమస్కరించాలి. ఈ నమస్కారాలు కనీసం 24 సార్లైనా చేయాలి. వీటి ద్వారా శరీరం పుష్టిగా ఉంటుంది. ఆరోగ్యభాగ్యాన్ని పొందవచ్చు. చిరకాలం జీవించవచ్చు.

కడుపునిండా తిని ఎండలో తిరగరాదు. పరగడపున ఎండలో తిరగడంతో ఏమాత్రం కీడుందడు. ఇక సూర్యకిరణాలు ప్రసరించే పండ్లలో కూరగాయల్లో ఆహారపదార్థాల్లో శరీరపుష్టి కలిగించే లక్షణాలుంటాయి.

సూర్యరశ్మి ప్రసరించడం వల్ల టీబీ, క్యాన్సర్, పోలియో మొదలగు జబ్బులను వ్యాపింపచేసే క్రిములు సహజంగా చనిపోతాయి. సూర్యరశ్మి పడే గదిలో ఎంతటి చలికాలమైనా రాత్రిపూట వేడిగా ఉంటుంది. అక్కడ నిద్రించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చును.

No comments:

Post a Comment