Saturday, February 9, 2013

లింగదానము నోము చేస్తే..!?

కార్తీకమాసం సోమవారంనాడు తలస్నానం చేసి పసుపు, కుంకుమలూ, కొబ్బరికాయ, తాంబూలం ఒక కేజీ బియ్యం, పప్పు చింతపండూ అన్నీ తీసికొని శివాలయంలో అభిషేకం చేయించాలి.

సహస్ర నామాలు పారాయణ గావించి తొమ్మిది దీపాలు వెలిగించి, పార్వతీదేవిపై మంచి భక్తిభావం కలిగి, పార్వతీ కళ్యాణం కథచెప్పి ఇంటిదగ్గర ఒక ముత్తయిదువుకు ఒక చీర-జాకెట్టు, పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలాలతో రెండు తేజీల బియ్యం, అరటి పళ్లు, వడపప్పు వాయనమివ్వాలి.

అలా కార్తీక సోమవారాలెన్ని పడిన అన్ని రోజులూ లింగదానం నోము నోచాలి. అక్షతలు వేసుకోవాలి. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరడంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment