Tuesday, August 21, 2012

శ్రీ మద్భగవద్గీత

ఉపనిషతుల సార మే 'శ్రీ శ్రీ మద్భగవద్గీత '. ఉపనిషతుల తరువాత ఉపనిషత్తు లంత టి ప్రమణ్యం గల గ్రంథం భగవద్గీత. మహాభారత మునందు 'శ్రీ మద్భగవద్గిత' కు విశిష్ట స్ధానమున్నది. యోగ మును గూర్చి ఈ గీత సుస్పష్టంగా తెలియజేసింది.

మహాభారత యుద్దంలో కర్తవ్య నిర్వహణ చేయుటలో విముఖడై మోహమును చెంది విచారించాచున్న పాండవ మధ్యముడైన 'అర్జునుని'కి శ్రీకృష్ణ పర మత్ముడు 'వేద ము' లో ని యోగ సార మునంత నూ తన ఉపదేశ ము ద్వారా అర్జునునితో పాటు సమస్త జనులకు తెలియజెసెను. ఈవిధంగా ఉపదేశింపబడిన' 'గీత' లో ని సారాంశ మును సర్వజనులు తెలుసుకొని అర్జునుని వలె ధన్యులయ్యెదరు.

శ్రీ కృష్ణుడు గీత ను ముఖ్యముగా కర్తవ్య విముఖులైన వారి కొరకు ఉపదేశించెను. అర్జునుడు పాండవులలో మూడవ వాడు. పాండవులకు కౌరవులకు ధర్మ యుద్ద ము కురుక్షేత్ర మును చోటు జరిగినది. ఆ యుద్ద మందు భి ష్ముడు, ద్రోణుడు మొదలైన మహా యోధులంద రూ కౌరవ సైన్యముగానుండిరి. వారంద రూ తన తండ్రులు, గురువులు, సోదరులు మొదలైన సంబంధ ములు కలవార గుట చూచి యుద్ద ము చేయుటకు అర్జునుడు సాహసించ లేక పోయెను. శ్రీకృష్ణుడు ఇతనికి రథ సారథ గా వుంది, అర్జునుని విషాద మునకు కారణమడుగ గా తాను యుద్దంలో అందరి నీ చంపవలసి వస్తుందని అందువల్ల తను మహాపాపం చేసిన వాడ నవుతాన ని విచారించెను. అర్జునుడు తనకు విజయయూ, రాజ్యసుఖయూ ఏదీ వద్ద నిధ నుర్భాణములను క్రింద పడ వే సెను. వెంటనే శ్రీకృష్ణ పర మాత్మ చూచి అర్జునుని యుద్దోన్ముఖుని చేయుటకు ప్రయత్నించెను.

'శ్రీ మద్భగవద్గీత ' అంత యూ శ్రీకృష్ణ భాగ వానుని నోటి నుండి వెలవడి నది. పెద్దె నిమిది అధ్యాయాలు గల ఈ 'గీత' లో' సాంఖ్య, యోగ' శాస్త్రములు నిండి యున్నవి. యుద్ద ము చెయవలయున ని అది తన ధర్మమని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పను. 'గీత' ద్వారా సర్వ ధర్మములను వాటి ని ఆచరించ వలసిన తీ రును పర మాత్మ యైన శ్రీకృష్ణుడు ఉపదెశించెను.

1 . అర్జున విషాద యోగము: ఈ యోగము అంత మును అర్జునుని శోకమును గూర్చి, విచార మును గూర్చి తెలుపబడినది. ధర్మక్షేత్ర మైన కురుక్షేత్ర మందు ధర్మమును గెలిపించుట కై జారి గెడి సంగ్రామంలో శోక సంతప్త హ్రుదయుడైన అర్జునునికి 'గీత' ను శ్రీకృష్ణుడు బోధించెను. శ్రీమద్భగవద్గిత ఒక ఉపనిషత్తు వంటిది. అర్జునుడు యుద్ద భూమి మధ్యమున విషాద చిత్తు డై వింటి ని, అమ్ములను వీ డి, రథమున కూలబడెను. ఇది 'అర్జున విషాద యోగము' అనబడును. ఇది బ్రహ్మవిద్యమందలి యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునున కు ఉపదేశించిన గీతా శాస్త్రము.

2 . సాంఖ్య యోగము : ఈ సాంఖ్య యోగము శ్రీమద్భగవద్గిత యందు ద్వితీ యాధ్యాయము. బ్రహ్మవిద్యలో ని యోగ శాస్త్ర మందలి సంఖ్యమును గూర్చి శ్రీకృష్ణుడు అర్జునున కు ఉపదేశించెను. దు:ఖిం పత గ నివారి గూర్చి దు:ఖించుట ఉచిత ముకదా ని, యదార్ధ జ్ఞానులు, మృతులైన వారిని గూర్చిగాని, సజీవుల కోర కైగాని శోకింపరు అని అతని శో కము దూరము చేయుటకు ప్రయత్నించెను.

3 . కర్మయోగము: ఈ అధ్యాయములో కర్మను గూర్చి వివరించెను. లోకములో కర్మ రెండు మార్గములు. ధ్యాన శీ లుర కు జ్ఞాన మార్గం, కార్య శీ లుర కు కర్మ మార్గము గా తన చెసృష్టి కి మొదటిలో చెప్పబడినది అని అర్జునునికి ఉపదేశించెను. ప్రాణులన్నీ అన్నము నుండి ఉత్పత్తి అగును. అన్నము వర్షము నుండి, వర్షము యజ్ఞమునుండి, యజ్ఞము వేద విహిత హొ మాది క కర్మమువలన జనించున ని చెప్పను. కావున చక్కగా అనుష్టింపబడిన పర ధర్మము కంటే సదో షముగా అనుష్టింపబడిన స్వధర్మ మే శ్రేష్ట ము అని చెప్పను. స్వధర్మమును చేయుటయందు మరణము సంభ వించినా ఫరవాలేదు కాని పర ధర్మమనె ది భయముతో కూడినది అని అర్జునుని స్వద ర్మాచరణకు ప్రోత్సహించెను.

4 . జ్ఞానయోగము :  ఈ యాగం గూర్చి శ్రీకృష్ణుడు మొదటిలో సూర్యునికి బోధించ గా అతడు తన పుత్రుడ గు మనువుకు అతడు ఇక్ష్వాకువుకు బోధింపబడుచూ వంశ పరంపర గా వచ్చి చాలాకాలం గడ చుట చేత సమసిపోయెను.

శ్లో|| పరి త్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కతామ్
ధర్మ సంస్ధా పనార్దాయ సంభ వామి యుగే యుగే||

ఎప్పుడెప్పుడు ఈ ధర్మము నశించి అధర్మము వృద్ద పొందునో ఆయా సమయములందు దుష్టుల శిక్షించి, శిష్టులైన వారిని రక్షించుటకు తాను స్వయంగా అవతరింతునని చెప్పను. కావున అజ్ఞాన మువల్ల కల్గిన సంశయమును పోగొట్టుకొని నిష్కామ యోగము నాశ్ర యించుము అని చెప్పెను.

5 . కర్మ సన్యాసయోగము: పంచ మధ్యాయ మైన కర్మ సన్యాస యోగంలో సన్యాసమును గూర్చి ఈ విధంగా చెప్పెను. కర్మ సన్యాసము, కర్మా చరణము రెండూ మోక్ష  సాధనములే. అయితే ఇందులో కర్మను సన్యసించుట కన్నా కర్మా చరణమే శ్రేష్ట మైనది. రాగ, ద్వేషరహితు డైనవాడు ఎల్ల ప్పుడూ సన్యాసియే ఈ ద్వంద్వ ములను అతిక్ర మించిన వాడు సంసార బంధ ను నుంచి విముక్తుడవుతాడు అని తెలియజే సేను. ఈ విధంగా విద్యావిన య సంపద గల బ్రహ్మనునియందును, గోవును, శునకమును, శునక మాంసము వండుకొని తినువాని యందును ఆత్మ జ్ఞానులు సమదృష్టి కలవార గుదురు అని సమాన తాను అలవరచుకో మని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించెను.

6 . ఆత్మ సంయమయోగము:  ఈ అరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగములో శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ విధంగా ఉపదే శిస్తున్నాడు. అర్జునా! సన్యా సమని దేని నందరురో దానినే కర్మ యోగము అని తెలుసుకోనము. ఈ విధమైన సన్మ్యాసములో సంకల్పత్యాగ ము చే యనివాడు యోగి కాలేదు అని చెప్పెను. అన గా జ్ఞాన యోగము పొంద గోరిన మునులకు ఫలత్యగా పూర్వకర్మ సాధనముగానున్నది. జ్ఞానము కలిగిన తరువాత కర్మ నివృత్తి యే సాధన మని తెలుసుకొనుము. కర్మలను వదలిన కొలది ఆయాసము లేకుండుటచే, ఇంద్రి యముల జయించిన వాడై చిత్తము (మనస్సు) ఏకాగ్రత కలవాడ గును అని అర్ధము. ఆత్మను నిగ్రహమైన ఇంద్రి యములచేత తెలుసుకొను మని శ్రీకృష్ణుడు చెప్పెను.  

7 . విజ్ఞాన యోగము : ఈ యోగంలో జ్ఞానమును ఎలా సాధించాలనే విషయాన్ని శ్రీ కృష్ణుడు ఇందులో విశద పరచెను. ఎలా సాధించిన జ్ఞానం వేల కొలది మందిలో ఎవరో ఒక్కరే ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించినా వారిలో ఒక్కడు మాత్రమే నిజమైన జ్ఞానము తెలుసు కొను చున్నాదని చెప్పెను. ఇలా చెప్పి ఈ ప్రపంచం సర్వానికి తనే కారణమని వివరించెను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ది, అహంకారము అనె ఎనిమిది విధాలైన భేదాలుగా తన మాయగా దీనిని గుర్తించ మని బోధించెను. ' శ్రీ కృష్ణుడు " భగవంతుడు ' తన విరా ట్స్వా రూపమున గూర్చి అర్జునునికి తెలియ జెప్పెను. సత్త్వ, రజ, తమో గుణాలతో ఉన్న తన మాయ తనను శరణు జొచ్చిన వారికీ మాత్రమే సాధ్యమగు నని భోధించెను. అనేక జన్మలు గడిచిన పిమ్మట సర్వమూ వాసు దేవుడే అను బుద్ది తో అను భూతిని, జ్ఞానమును పొంది పర మాత్ముని ఆశ్ర యించ గలరని తెలిపెను.      

8 . అక్షర పర బ్రహ్మ యోగము: ఈ అష్టమ అధ్యయ౦లో అర్జునుడు ఈ విధముగా ప్రశించెను. బ్రహ్మ మన నేది? ఆధ్యాత్మ అనగా ఏమి? అది భూత, అధి దైవములనగా ఏవి? భగవానుడు ఈ విధంగా చెప్పెను. బ్రహ్మ లోక సహితముగా సర్వ లోకములు పునర్జన్మ తో కుడినవే?. కానీ తనను తెలుసు కొని తనను పొందిన వణికి ఇక పునర్జన్మ ఉండదు. ఈ రెండు మార్గములు ఎరిగిన వాడు యోగి ఎవ్వడు మూఢ త నొందడు. కావున అర్జునా! నీవు సర్వదా యోగము నందు సుస్థి రుడ వై యుండుము అని చెప్పెను.

9 రాజ విద్య రాజగు హ్య యోగము: యుగాంత మందు సర్వ భూత ములును ప్రకృతిలో కి మరల పోవును. మరొక కల్పాది యందు వానిని మరల నేను సృ జించు చున్నాను అని వివరించెను. నీవు ఈ బుద్ది తో సర్వము నన్నుగా ఎరింగి తి వేని నన్ను పొంద గలవు అని అర్జునునికి ' రాజ విద్య ' ను గూర్చి చెప్పెను.

10 విభూతి యోగము: దశమ అధ్యాయము అయిన విభూతి యోగములో సర్వమూ తానె వ్యాపించు వానిగను, సర్వమూ తన దిగను తన విభూతులను గూర్చి శ్రీ కృష్ణుడు ఇందు విశ దీ కరించెను. వేదములలో సామము దేవతలలో దేవేంద్రుడు , ఇంద్రియ ముల యందు మనస్సు, ప్రాణులలో బుద్ది తానుగా తెల్పినాడు. అలాగే సర్వ భూతములకు మూల కారణము ఏదియో తెల్పి తానే లేనిచో,  స్థావర జంగ మదులలో, ఏది ఉండ జాలదని చెప్పెను. ఇలా అతని ' దివ్య విభూతులు' అనంత ములని వివరించెను.

11 . విశ్వ రూప సందర్శన యోగము: ఏకాద శాధ్యా యమైన ఈ విశ్వ రూప సందర్శన యోగంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు అడుగగా తన విశ్వ రూపమును చూపించెను. అర్జునుడు దివ్య మైన, సర్వ దేవతలను, సర్వ లోకాలను శ్రీ కృష్ణుని  విశ్వ రూపమందు చూచి భీతి చెంది ఉప సంహరింపు మని వేడు కొనెను. ఈ రూపంలో కురు క్షేత్ర సంగ్రామ౦ లో మరణించు యోధులు, విరులందరూ, ఆయనలో లిన మగుట అర్జునుడు చూసెను. ఇది అంతా శ్రీ కృష్ణుడు మహిమగ ఎంచి అతనిని శాంతించ మని వేడు కొనెను.

12 . భక్తీయోగము: ద్వాద శోధ్యాయమైన భక్తీ యోగము ములో విశ్వరూపము చూచి భయము చెందిన అర్జునుని కోరిక మన్నించి శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ఉపసంహరించి, ఈవిధముగా ఉండుమని ఇట్లు ఉపదేశించెను. శత్రు మిత్రులయడ, సన్మాన, తిరస్కారములు యెడల ఒకే తీ రుండువాడు, శీతల, ఉష్ణ, సుఖదు:ఖముల యెడల సమభావం కలవాడు, ముక్త సంగుడు, నిందాస్తు తులను సమముగా ఎంచువాడు, మౌన శీలుడు, లభించిన దానితో తృప్తి పొందువాడు, నివాసము లేనివాడు, సుస్ధిర చిత్తుడు, భక్తీ పూర్ణుడు - ఇలాంటి వాడు తనకు ప్రియమణి చెప్పెను.

13 . క్షేత్ర క్షేత్ర జ్ఞ విభాగ యోగము: ఇందులో అర్జునుడు ఈవిధంగా ప్రశ్నించెను. 'ప్రకృతి -పురుషులు', 'క్షేత్ర-క్షేత్ర జ్ఞులు', 'జ్ఞాన -జ్ఞే యములు' మొదలగున వి గూర్చి అడుగ గా పర మాత్ముడు ఇలా చెప్పదోడంగేను. సర్వ భూత ములను సమముగా చూచు వాడె పర మేశ్వరుని చూచు యదార్ధ దర్మి ఒకే సూర్యుడు ఈ లోకం మంత యూ ఎట్లు ప్రకాశింప జెయునో, అట్లే 'క్షేత్రము 'న నుండు ఆత్మ 'క్షేత్రము' నెల్ల ప్రకాశింప జేయును.

14 . గుణత్ర యవిభాగ యోగము: ఇందులో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. జ్ఞాన ములన్నింటి లో కి ఉత్త మముగ పర మజ్ఞాన మును దే నిని తెలుసుకొని మునులంద రూ శరీర సంబంధ వియోచన అనంతరము పర మసిద్ద్ నొందిరో దానిని అంత యూ యోగీ శ్వరుడైన కృషుడు ఈ అధ్యాయ మందు తెలిపెను. సత్త్వ, రజో, త మో గుణాల గూర్చి విశ దీ కరించెను.

15 . పురుషోత్తమ మప్రాప్తి యోగము: ఈ అధ్యాయ మందు శ్రేష్ట మైన మాయ యొక్క అంశ జనిత మే బ్రహ్మయే మూలముగా, నికృష్ణ మైన మద, అహంకార ములే కొమ్మలుగా గల 'అశ్వత్ధ వృక్ష ము' అనెడి సంసార వృక్షము అనాది అయినది అంటే, బహుకాలమునాటి ది అని పెద్దలు చెప్పుదురు. అలాంటి వృక్షమునకు వేదములు ఆకులు. అట్టి వృక్ష రూపము ఎవరైతె తెలుసుకొంటారో అట్టి వారే వేదార్ధ ములను తెలిసిన వారు అనబడ తారు.
ఏడు లో క ములకును మీద నుండెడి చతుర్ముఖుడు మొదలగా గలుగుట చేత, సంసార మనెడి యశ్వత్ధ మును ఊర్ధ్వమూలముగాను, భూమి మీద నుండెడి మనుష్యులు పశువులు మొదలయిన విము, చెట్లు మొదలయిన స్ధావర ములంత ముగా కలుగుట చేత యా సంసార మనెడి యశ్వత్ధ ము అధ శ్శఖమనియు, మంచి జ్ఞానము కలుగు వర కును ప్రవాహ రూపముగా నుండుటచే తెమ్పులే నిదై యుండును గాన నవ్యయమనియు, వెద ములలో చెప్పబడిన కామ్యకర్మములచేత నీ సంసార ము వృద్ద్ పొందును గాన దీ నికి వెద ములు అకులనియు సంసార వృక్షమును తెగ కొట్టు ఉపాయమును వేదార్ధ ములనెరింగి న వడ ని ఈ అధ్యయము నందు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పను.

16 . దైవాసుర సంపద్వి యోగము : ఈ అధ్యాయములో దేవతల యొక్క గుణములు, రాక్షసులకు ఉండెది గుణముల గూర్చి వివరించెను. ఆత్మ వినాశకరము ములైన వి మూడు నరక ద్వార ములు కలవు. అవి కామము, క్రోధము, లో భయు. కావున ఈ మూడింటి ని విడ నడవలెను. (నరక) ద్వార ములగు ఈ మూడింటి ని దాటినా వాడు ఆత్మ శ్రేయోదాయక ఆచరణమొనర్చి మోక్షము పొందును.

17 . శ్రద్దాత్ర యవిభాగ యోగము: ఈ యోగము మందు శ్రీకృష్ణుడు అర్జునున కు ఈ విధముగా చెప్పుచున్నాడు. మూడు విధముల శ్రద్ద జీవులలో ఉండును. సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములైన శ్రద్ద గలవారు ఆవిధమైన కర్మలనె ఆచరించుచున్నారు. సాత్త్వికులు (సత్త్వి గుణము కలవారు) ప్రేత ములను, భూత గణములను అర్చింతురు. ఈవిధముగా వీరి 'గుణగణము'ల గూర్చి విశ దీ కరించెను. శ్రద్ద లేకుండ వేల్పబడిన యజ్ఞము, ఈయబడిన దానము, చేయబడిన క్రియ, ఒనర్పబడిన తపస్సు 'అసత్' శబ్ద ముచే సూచింపబడును. అది ఇహమందు, పర మందు నిష్ప యోజనము ఏవిధముగ శ్రద్ద మూడు విధాలని వివరించి చెప్పను.

18 . మోక్ష సన్యా స యోగము:  ఈ యోగ మందు సర్వ ధర్మములను పరి త్య జించి నన్నోక్క నినే శరణు పొందుము. నేను నిన్ను సమస్త పాపములనుండి దాటించేదను చింతింప కుము. నేను చెప్పినట్లు వింటే ని సమస్త పాపములు తొలగించి మోక్షము ప్రసాదిస్తాను. నీవు చింతలు వదలి పెట్టు అని శ్రీ కృష్ణుడు అర్జునునికి మోక్షము గూర్చిన చింతను కూడా నాకు వదలుము అని ఉపదేశించెను.

శ్లో }} సర్వ ధర్మా న్ప రి త్య జ్య మమేకం శరణం వ్రజ
అహంత్వా సర్వ పాపే భ్యో మోక్షము ష్యామి మశూచ:}}

శ్రీ కృష్ణుడు ఈ గీతో పదేశామును అర్జునుడు శ్రద్ద గావిని, అచ్యుతా! ని కృప చేత నా మూఢ తన శించినది, ధైరయము, అలవడినది. సంశయములు తోలిగినవి. ని మాటను పాటించె ద నని' ధను ర్భ నములు ' ధరించి యుద్దము చేయుటకు సిద్ద మయ్యెను.  

ఈ ' గీతా సంవాదనము' శ్రీ కృష్ణార్జు నుల మధ్య జరిగినది. యోగిశ్వరుడగు శ్రీ కృష్ణుడు, ధనుర్దా రి యగు అర్జునుడు ఎక్కడ వుంటే అక్కడ సంపద, విజయము, స్థిరమగు  రాజ నీతియు ఉండును. ఇది శ్రీ మద్భ గ వద్గి తలో బ్రహ్మ విద్యయు, యోగా శాస్త్ర ములను కూడిన శ్రీ కృష్ణా ర్జున స౦ వాదమును మహా భారత మందు సంజయుడు ధృత రాష్ట్రుని కి వినిపించెను. శ్రీ మద్భ గ వద్గి తలో నిత్యమూ ఒక్క శ్లోక మైన నూ పాటించిన నూ, విన్ననూ అనంత మైన పుణ్య ఫలము కలుగును. భగవత్ సాన్నిధ్య ము చేకురును.

No comments:

Post a Comment