Friday, May 23, 2014

శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా
ఋతువులను ,దేహారోగ్యాన్ని బట్టి మన
పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు - పానకం కూడా అంతే.
శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని
దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే
గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు,
ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా
పనిచేస్తాయని చెబుతారు. పానకం విష్ణువుకి
ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు.
పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది.
జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక.
పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న
ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని
అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.
పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.అందుకని
ఒక్క శ్రీరామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో
వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

No comments:

Post a Comment