Wednesday, May 21, 2014

శ్రీ మార్గశిర మహా లక్ష్మీ వ్రతము

విఘ్నేశ్వర ప్రార్ధన

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణంచతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నో పశాంతయే ||

ఆచమ్య || ఓం భూర్భువః సువరోమ్, మమ ఉపాత్త సమస్త దుర తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, శుభాభ్యాంశుభే, శోభ నేముహూర్తే, అద్య బ్రహ్మణః ద్వీతీయ పర్దార్దే, శ్వేతవరాహల్పే, వైవ స్వత మన్వంతరే, కలియుగే ప్రధ మపాదే, జంబూ ద్పీపే, భరత వర్షే, భరత ఖండే, అస్మిన్ వర్త మాన, వ్యవ హారిక చాంద్ర మాన, సంవత్సరే, ఆయనే బుతౌ, పక్షౌ, తిధౌ, శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణ, ఏనం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిధౌ శ్రీమతి ( పేరు) గోత్ర స్యనామ ధోయస్య అస్మాకం సుకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయురారో గ్యైశ్వర్యాభి వృద్ద్యర్ధం ధర్మార్ద కామ మోక్ష చతుర్విధ ఫలపురుశార్ధ సిద్యర్ధం సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్ధం వారే వారే ప్రయుక్త గురువారే లక్ష్మి ముద్దశ్య లక్ష్మీ ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశో పచార పూజాం కరిష్యే, శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం సిద్ధి వినాయక పూజాం కరిష్యే ||
విష్ణు: కంటే రుద్ర స్సమాశ్రితాః, మోలే త్రత స్థితో బ్రహ్మా, మధ్యే మాతృ గణాస్మ్రతాః, కుక్షౌతు సాగరా స్సర్వెస్సప్త ద్వీపా సుంధరాః(కలశ పూజచేసి) మహాలక్ష్మీ ప్రాణ ప్రతిష్టాపనం, కరిష్యే (లక్ష్మీదేవి ప్రాణ ప్రతిష్టాపన జేసి పూజ ఆరంభించ వలెను)

శ్రీ మహాలక్ష్మి పూజా ప్రారంభం
శ్లో || పద్మా సనే పద్మకరే సర్వ లోకైక పూజితా
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే
సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే ||
శ్రీ లక్ష్మీ దేవతాం ధ్యాయామితా||
పద్మాసన మందు కూర్చున్నగానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు సర్పజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు నయన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము. పాలసముద్ర మందు పుట్టి ననీ వెల్లప్పుడును మాగృహ మందు శాశ్వతముగా ఉండుము (అని మనసులో ధ్యానించివలెను)

శ్లో || సర్వమంగళ మాజ్గల్యే విష్ణువక్ష సధ లాలయే,
ఆవాహయామి దేవీత్యాం సుప్రీతా భవ సర్వదా,
శ్రీ లక్ష్మి దేవతా మవాహయామి.
తా || సకల శుభ కార్య ములందు విఘ్నములు లేకుండా శుభములు కలుగ జేయు దానా! విష్ణువక్ష స్థలమందు నివసించు ఓ లక్ష్మీ దేవీ! నిన్ను ఆవాహన చేయుచున్నాను.గాన, నా మీద దయకలిగి ఉండ వేడెదను.

శ్లో || సూర్యాయుత నిభస్పూర్తే స్పురద్రత్న విభూషితే
సంహా సన మిదం దేవీ స్వీయతాం సుర పూజితే
శ్రీ లక్ష్మి దేవతాయై నమః రత్నసింహీసనం సమర్పయామి.

తా|| సూర్యా కాంతివలె ప్రకాశించు దానా! నానారత్న ములతో పొదగ బడి ధగ ధగ మెరయుచున్న బంగారు ఆసన మిది గో వెస్తున్నాను. సర్వలోక వాసులచే పూజింపబడే లక్ష్మీ దేవీ! దయచేసి ఇంగు కూర్చోనుము.

శ్లో || శుద్దోద కంచ వాత్ర స్థంగన్ద పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.
తా || ఓ లక్ష్మీ దేవీ ! పరిశుభ్ర మైన జలముతో గంధం పుష్పములు, సువాసన ద్రవ్యములు కలిపనీకు అర్ఘ్యం నిచ్చుచున్నాను. నన్ననుగ్రహించుము.

శ్లో || సువాసిత జలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి.
తా || దేవత లందరి చేతను కీర్తింప బడిన దానా! అన్ని నదులనుండి గొన వచ్చిన సుగంధ ఉద కంతో నీకు పాద్యం యిచ్చుచున్నాను. అందుకొనుము.

శ్లో || సువర్ణ కలశానీ తం చంద నాగరు సంయుతం
గృహేణాచ మనం దేవీ మయాదత్తం శుభ ప్రదే,
శ్రీలక్ష్మీ దేవతాయై నమః ఆచ మనీయం సమర్పయామి
తా|| సకల శుభములు కలుగ జేయుదానా! బంగారు గిన్నెలో సుగంధ ద్రవ్యములు కూర్చి ఆచ మనీయము సమర్పించు చున్నాను స్వీకరింపుము.

శ్లో || పయోదధి ఘ్రతో పేతర శర్కరా మధు సంయుతం
పంచా మృత స్నాన మిదం గృహాణీ కమలాలయే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః పంచా మృత స్నానం సమర్పయామి.
తా|| శ్రీ లక్ష్మీ దేవి! పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారా కలిపి పంచామృత ముతో నిన్ను స్నానము చెయించుచున్నాను. నస్ననుగ్రహింపుము.


శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితః
శుద్దో దక స్నాన మిదం గృహాణ విధు సోదరీ,
శ్రీ లక్ష్మీ దేవతాయైనమః స్నానం సమర్పయామి.
శ్రీ లక్ష్మీ దేవతాయైనమః శుద్దో దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.
తా|| పాల సముద్ర మున పుట్టిన ఓ లక్ష్మీ దేవీ! నీవు స్నానము చేయుటకు శంకరుని తలనుండి వచ్చిన గంగాజలమును తెచ్చినాను. ఈ పవిత్ర జలముతో స్నానము చేయుము.

శ్లో || సురార్చి తాంఘ్రిగ యుగళే దూకూలవ సన ప్రియే
వస్త్ర యుగ్మం ప్రదాస్వామి గృహణ హరివల్ల భె
శ్రీ లక్ష్మీ దేవతా యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి
తా|| సుర లచే సదా పూజింపబడు సుకుమార పాదముల గలదాన! తెల్లని పట్టుచీర కట్టుకున్న ఓ దేవి! నీకు పట్టుబట్టలు కట్ట బెట్టెదను స్వీకరింపుము.

శ్లో || కేయూర కంకణైర్ధ వ్యైర్షార నూపుర మేఖలాః
విభూషణానద్య మూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ లక్ష్మీ దేవతా యైనమః ఆభరణాని సమర్పయామి.
తా|| మునీశ్వరు లందరిచేత వ్రళంసించబడిన ఓ లక్ష్మీ నీకు బంగారు కడియాలు, వంకీలు, అందెలు, దండలు సకలా భరణములు ఇచ్చుచున్నాను. వీటి నిధరింపుడు.

శ్లో || హేతప్త మకృతం దేవీ బ్రహ్మవిష్ణు శివకృతం
ఉపవీత మిదం గృహాణత్వం శుభ ప్రదే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి.
తా || ఓ దేవీ! బంగార పుత్రాడుతో ముత్యాలు గ్రుచ్చిన ఈ యజ్జో పవీతమును ధరింపుము.

శ్లో || కర్పూరాగ రుక స్తూరీ రోచ నాది భిరన్వితం,
గగ ధందాస్యామ్య వాందేవీ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః గంధాన్దార యామి.
తా || ఓం సింధు పుత్రికా! కర్పూరము, అగరు, కస్తూరీ వంటి సువాసున వస్తువులు కలిపినా ఈ గంధము స్వీకరింపుము.

శ్లో || అక్ష తాన్ ధవళాన్ ది వ్యాన్ శాలీ యంస్తండులాన్ శుభాన్
హరిద్రా కుంకు మోసేతాన్ గృహాయాబ్ది సుపుత్రికే
శ్రీ లక్ష్మీ దేవతా యైనమః అక్ష తాన్ సమర్పయామి,
తా || క్షీ రాబ్ధి పుత్రికా! పసుపు, కుంకుమ కలిపిన అక్ష తలము సమర్పించు చున్నాను స్వీకరించుము.

శ్లో || మల్లికా జాజికుసు మైశ్చంపకైర్వకుల్తే రపి,
శత పత్రైశ్చజకల్షారై: పూజయామి నారి ప్రియే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి పూజయామి.
తా|| ఓనారాయణ ప్రియే! మల్లెలు, మొల్లలు, జాజి, సంపెంగ, తామర, కలువ పూలతో నిన్ను భక్తి శ్రద్దలతో పూజించుచున్నాను. ఈ పూజను గైకొని ఆనందించుము.

మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ద్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం అసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః ఓం మహాలక్ష్మి దేవ్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
మహాలక్ష్మీ పూజా కల్ప లక్ష్మి అష్టోత్తర శత నామావళి : సంపూర్ణం
నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

శ్రీ మహాలక్ష్మీ వ్రతము దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం, ధూపం గాస్యామితే దేవి శ్రీ లక్ష్మీ గృహాణత్వం, ధూపం సమర్పయామి ఘ్రతాన్త వర్తి సంయుక్త మంధ కార వినాశకం, దీపం దాస్యామితే దేవి గృహాణ ముది తాభవ, దీపం సమర్పయామి. నైవేద్యం షడ్ర సోపేతం దధ మధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలో పేతం గృహాణ హరి వల్లభె, నైవేద్యం సమర్పయామి. మన సార సుగంధే నమిశ్రితం పుష్పవాసితం, పానీ యంగృ హ్యతాం దేవీ శీతలం సుమనో హరం, పానీయం సమర్పయామి, పూగీ ఫల సమాయుక్తం, నాగ వల్లి దలైర్యుతం, కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి, నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణు వల్లభే, నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరె సర్పలో కైక పూజితే, నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా,
మంత్ర పుష్పం సమర్పయామి. యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోక జననీ నమేస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే శ్రీలక్ష్మీ నమో నమః శ్రీ లక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి. కమలాయై నమః ప్రధమ గ్రంధ పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంధం పూజయామి. లోక మాత్రే నమః తృతీయ గ్రంధర పూజయామి, విశ్వజన న్యైనమః షష్టమ గ్రంధం పూజయామి, హరి వల్లబాయై నమః నవమ గ్రంధం పూజయామి తొర బందన మంత్రః || బధ్నామిద క్షీణ హస్తే నమ సూత్రం శుభప్రదం. పుత్ర పౌత్రాభి వృద్దంచ సౌభాగ్యం దేహిమేరమే|| ఈ మంత్రము పటనము చేయుచు తోరము కట్టుకోవలసింది || వాయస విధః|| ఏనం పూజ్య కళ్యాణీం లక్ష్మీం స్వశక్తతః దాతవ్యం ద్వాద శారూపం వాయనం హిద్విజాలయే. వాయన దాన మంత్రం ఇందిరా ప్రతి గృహ్నతు ఇందిరా వైద ధాతిచ, ఇందిరా తార కోభాభ్యా మింది రాయై నమోనమః" పూజా విధానము సంపూర్ణము లక్ష్మీ పురాణము కధా ప్రారంభము పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచార మునకు బయలు దేరినారు. వారట్లు భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు, ఆసమయంలో ఆగ్రామవాసులు బ్రాహ్మణ వైశ్యక్ష
త్రియ శూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంలో అలికి లక్ష్మీ దేవి పాదములు ముగ్గులు పెట్టిరి. స్త్రీలంద రూతలంటు స్నానములు చేసి క్రొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజచేయు చుండిరి. ఆరోజు గురువార మగుటచే అన్ని జాతులవారు కడు నిష్టతో లక్ష్మీదేవిని గానంచేయుచు పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్దలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునిశతో " మహర్షి ! బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తున్నారు కదా మీరు చేస్తున్న వ్రత మేది? వివరించ కోరుచున్నాను" అని పలుకగా పరాశముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగిరి. " నారద! యీ దినము గురువారము గదా! గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అనెదరు. సంవత్సరంలోని పన్నెండు మాసములలో మార్గశిర మాసం శ్రేష్ట మైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మివారం(గురువారం) లక్ష్మీ దేవికీ చాల యిష్ట మైన రోజు. శుక్ల పక్ష దశమీ గురువారం అయిన యెడల ఆ దినము సుద శావ్రత మనెదరు. ఈ వ్రతం శ్రీమహాలక్ష్మీ దేవికి మిక్కిలి ఇష్టమైనది." అని పరాశరముని బోధంపగా- బ్రాహ్మ మానస పుత్రుడగు నారదుడది ఆలకించి " మహనీయా! మున్నుయూ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలములు పొంది నారు! ఆ చరిత్రముకూడ వివరింపు " డని వేడగా పరాశరుడిట్లు చెప్పదొడంగెను. " నారదా, నీవ దృష్ట మంతుడవు. పూర్వంయీ లక్ష్మీవ్రత మాచరించిన ఒక భక్తుని చరిత్రను తెలియజేయుదును శ్రద్దగా ఆలకించి ఆనందింపుము" అని చెప్పసాగేను.
ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునకు సేవలు చేస్తు నాధా! యీదినం నా వ్రతం ఆచరించు గురువారం గాన మీరు ఆజ్ఞ యిచ్చినచో నగరంలో సంచ రించి వత్తును " అని ప్రార్దంచెను. లక్ష్మీ కోర్కెను మన్నించి విష్ణువు ముసలి అటులే పోయిరమ్మనెను.లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ స్త్రీరూపం ధరించి ఒక యింటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో " ఓ అవ్వా! ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రతదినము కదా! ఇల్లు గోమయముతో అలికి ముగ్గులు పెట్టలేదేమి? అని ప్రశ్నించెను. అంత ఆ యవ్వ " అమ్మా! ఆ వ్రతము ఎట్లు చేయవలెను. ఎవరిని పూజ చేయవలెను? వివరించుతల్లి! అని అనగా, లక్ష్మిదేవి మంద హాసముతో " అవ్వా! వ్రతం చేసేవి ధానము చెప్పెదను వినుము. మార్గశిర మాసములో మొదటి లక్ష్మీవారము అనగా గురువారమునాడు ప్రాతః కాలమునే నిద్రలేచి గోమయంతో ఇల్లూ వాకిలీ అలికి లక్ష్మిదేవి పాదములు గల ముగ్గులు పెట్ట వలయును, క్రొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండ బెట్ట వలెను దానిని వివిధ రకాల బొమ్మల తోను, ముగ్గుల తోను వస్త్రములు కట్టుకొని శుచిగావుండి ఒక బల్ల కడిగి, దానిమీద క్రొత్త ధాన్యము ( ఎరుపు, నలుపు, తెలుపు రంగులవి ) కొద్దగా వేయవలెను. మరి కొంచెము క్రొత్త కొలత పాత్రలో వేయవలెను. ఆ పాత్ర పైన మూడు పోక చెక్కలు పసుపు నీటితో కడిగి వుంచవలెను. తెల్ల ధాన్యము ఈ నెలు తీసుకొనివచ్చివాటిని జడ వలె అల్లి మనసులోని కోరిక తలచుకొని వాటిని జటవలె వుంచాలి దాని పై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు వుంచవలెను. లక్ష్మీదేవిని తలచుకొని పువ్వులు, గంధము, ధూప దీపములు సమర్పించవలెను. మొట్ట మొదట పాలు నైవేద్యముచేసి, అన్నము పిండి వంటలు, కూరలతో నైవేద్యం పెట్టవలెను. ఇది ఒక పద్దతి ఇక రెండొ పద్ధతి సుద శావ్రతము. అదెట్లు అనగా మార్గ శిర మాసంలోని శుక్ల దశమీ గురువారమునాడు యీ వ్రతమును చేయవలెను. ఆ దినము ఉదయమున నిద్ర లేచి గోమయమంతో యిల్లు అలికి, వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు లక్ష్మీదేవి పాదములాంటి ముగ్గులు పెట్ట వలెను. తదుపరి స్నానము చేసి ఆసనమును శుభ్రము చేసి ముగ్గులు గీసి, ఇంటిలో తూర్పు దిశగావుంచి, లక్ష్మీదేవి పూజ నిమిత్తము పోక చెక్కను పసుపు నీళ్ళతో శుభ్రముగా కడిగి దానిని పంచామృతముతోను, శుద్దోదకముతొను, స్నానము చేయించి, ఆసనము పై వుంచి గంధము వ్రాసి, పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ పది ముళ్ళు వేయవలెను. ఐది నాడులు గల దర్భ గడ్జిలో దానిని కప్పవలెను. లక్ష్మీ చిత్రమును వ్రతడోరియాలు వుంచి ధూపం వేయవలెను. తరువాత నైవెద్యం నిమిత్తం వండిన పదార్ధ ములన్నిటినీ సమర్పించవలెను. ముఖ్యముగా పచ్చిబియ్యంకొంత నాన బెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయవలెను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్ధాలు అన్నీ పది రకముల వరకూ వుంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలెను. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచవలెను. అట్లు పంచని యెడల వారికి లక్ష్మీ కటాక్షము లేక సిరి కలుగదు . గురువారమునాడు నూనెతో వంటను గాని, పిండి వంటలుగాని చేయ కూడదు. గురువారము పూజచేయు వారాలు చేప - మాంసం తినకూడదు. తలకు నూనే వ్రాసుకో కూడదు అంతియేకాదు. ప్రత్తితో ఒత్తులు చేసినా, ఆనపకాయ గాని - నీచు కూరలుగాని తినినా మంచం పై పండుకొనినా, రాత్రులు పెరుగన్నం తినినా లక్ష్మీ ఇంటనుండదు ఇంగా దరిద్రులగుదురు. గురువారము నాడు, ప్రాతః కాలమున లేచి, పొయ్యిలోని కాలిన బూడిద తీయక పోయినా, వీధీ వాకిలి తుడవక పోయినా, యింట లక్ష్మి నిలవదు. గురువారము నాడు ఏ స్త్రీ శుచియైన తెల్లని వస్త్రము కట్టుకొనునో వారి యింట లక్ష్మి ప్రసన్నమగును. ఏ స్త్రీ గురువారము నాడు పిల్లలను తిట్టుట కొట్టుట చెయునో ఇల్లు వాకిలి శుభ్రము చేయదే, వంట సామానులు అంట్లుతో మదో సాయం సమయమున గుమ్మము దగ్గర సంధ్యదీపము వుంచదో ఆ స్త్రీ యింట ఒక్కక్షణ మైనను లక్ష్మీ వుండక పోగా ధన హాని సంతాన హాని కలుగ జేయును. అటులనే గురువారం రోజున ఉడకని పదార్ధములు తినుట అమిత నిద్ర, అమావాస్యా సంక్రాంతి తిధులలో అశుభ్రముగావుండి విహరించుట అత్త మామలను సేవింపక కస్సుబుస్సులాడుట చేయు స్త్రీలయింట లక్ష్మీదేవీ పాదము నిలవదు. ఇంకను భోజన మునకు ముందూ తరువాతా కాళ్ళు చేతులు ముఖమూ ఏ స్త్రీ కడుగు కొనదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడు నప్పుడు చీటికి మాటికీ నవ్వు చుండునో, ఏ స్త్రీ బూడిద గుమ్మడి కాయను కొయునో అలాంటి స్త్రీలు నీచ బుద్ది గలవారలై అన్న వస్త్రములకు దూరమై పోదురు. ఏ వనిత గురువారము నాడు ధర్మములు చేయక పూజలు చేయక పురుష సాంగత్యమునే సదా కోరునో ఆమె పాప కుపమునకు పోవుటయేగాక బ్రతికి నన్ని రోజులూ తిండికి మొఖము వాయును. గురువారము అమావాస్య- సంక్రాంతి తీధీ యందు నిషిద్ద పదార్ధములను ఏ స్త్రీ భుజించునో ఆమె అవసాన గాలమున అనెక బాధలు పడి చనిపోయిన తర్వాత యమ కింకరులతో నానా బాధలు పడును. జ్ఞానవంతు లైన స్త్రీ ఆ మూడు దినమునతో భక్తిలో దైవ సేవలు ఒక పూట భోజమును, కలిగి నంత లో దాన ధర్మములు చేసిన యెడల అట్టి నారీ మణికి ధన ధాన్యములు కలుగుటయేగాక పుత్ర సంతానము, సంతానాభి వృద్ది కలుగును. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్య కృత్యములను బట్టి సిరి సంపదలు కలుగును. స్త్రీ ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముఖము కడుగు కొనవలెను. అట్లు కడుగు కొనిన స్త్రీ ముఖము చూచినను పాత కములు కలుగుటయే గాక, ఏ కార్యము తలపెట్టినను జయము కలుగదు. స్త్రీ భుజించునప్పుడు దక్షిణం వైపు ముఖము పెట్టుకొని ఏ పదార్ద మూ భజుంచ కూడదు. దీపము లేని చీకటి ఇంట భుజించ కూడదు. చీకటి పడిన తరువాత నూనె వ్రాసుకొనుట చేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరగడం - భర్త ఆజ్ఞ లేనిదే తనే యిష్ట మొచ్చినట్లు తిరగడం - భర్త మాటలు వినక ఎదురు చెప్పడం - దైవ కార్యములందు, దేవ బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసము లేక యుండుట చేయనో, దాన ధర్మములు చేయదో - అట్టి వనిత గృహము రుద్ర భూమితో సమానము గానెంచి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త అనుజ్ఞ ప్రకారం నడుచు కొనవలెను. అతిధి సత్కరములు జరుపుచు అత్త మామల సేవలు విడువకుండ ఆచరించుచు, తన బిడ్డా అనే వివక్షత చూపక అందరికీ సమానంగా వడ్డించ వలెను. భర్త సుఖమే తన సుఖమని భర్త కష్టమే తన కష్టమనే భావముతో మెలగినచె లక్ష్మిదేవి సంతోషించి కలకాలము ఆ యింట నుండ గలదు. నారదా! ఈవిధంగా మహాలక్ష్మీ ఆ వృద్ద బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతము ఆచరించి విధానము చెప్పి, ప్రతివీధికి ప్రతియింటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడ నిదుర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరిబోసుకొని వంటి మీద సట్ట సరిగాలేక గుర్రుపెట్టి నిద్ర పోతున్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూచి అసహ్యించుకొని ఒక మాలపల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూలా ఒకానొక బీద హరి జన స్త్రీ ఉండెను. ఆమె ప్రతి దినము ప్రాతః కాలము లేచి గోమయము తెచ్చి యిల్లు వాకిలి శుభ్రము చేసుకొని, బియ్యపు పిండితో మగ్గులు పెట్టి లక్ష్మి పాదముచెత దీపములు పెట్టి బియ్యం వుంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి, పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచుండెను. లక్ష్మీదేవి వెళ్ళు సరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందున మహాలక్ష్మీ సంతసించినది. ఆ పరిశుభ్ర స్థలమున తన రెండు పాదములుంచి ఆమెతో " ఓ భక్తు లారా ! నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి సంత సించితిని. నీ కేమి కావలయునో రుకొనుము" అని అనగా శ్రీమహాలక్ష్మీ సాక్షాత్ దర్శనము చూడగానే ఆమెనోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక యినది. మరల లక్ష్మిదేవి ఇలా అన్నది. నీవు బ్రతికి నాన్నళ్లు అష్ట ఐశ్వర్యములతొ తులతూగుదువు. జన్మాంతరమున నీవు వైకుంట మునకు వచ్చెదవు గాక! నా వ్రతమును చేయుచుండుము. నీకు శ్రీహరి అనుగ్రహము కూడ కలుగును " అని చెప్పెను. మహాలక్ష్మీ చెప్పిన ప్రకారముగా ఆ హరి జన స్త్రీ కడునిష్టతో ధ్యానము చేయు చుండెను. లక్ష్మీదేవి పాదముల యందే మనస్సులగ్నము చేసి యున్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి, ఆమెవున్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి నాలుగుమూలలా ధన రాశులున్నవి. దాని వలన ఆమె భాగ్యవంతురాలగుటచే గాక అయిదుగురు పుత్రులును కలిగిరి. ఓ నారదా! ఇది వినుము. ఆ హరి జన స్త్రీకీ లక్ష్మీదేవి వలన ఐశ్వర్యమును కలిగి నదంతయు బలరాయుడు తనే దివ్య దృష్టి వలన తెలుసుకొని మహా కోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి" లక్ష్మిదేవి మాల పల్లెకుపోయి అంటరానిమాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చినందున
మహానేరము చేసినది గాన లక్ష్మిని నీ మందరిము లోనికి రానీయ " వద్దని చెప్పినాడు. అంతలో గ్రామసంచారము చేసుకొని లక్ష్మీదేవి విష్ణుమందిరము లోనికీ ప్రవేశించు చుండగా బలరాముడు ద్వారమున అడ్డముగా నిలబడి లోనికి రావద్దని శాసించెను.ఆ సమయములో అతని కండ్లు శరీరము ఎర్రబడి పోయెను. పళ్లు పటపట కొరుకుచుండెను. " శ్రీ హరీ! నీవు ఈమె ముఖము చూడ వద్ద" నెను. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మీని విడిచి పెట్టుటకు హరి ఒప్పుకొనెను. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించివున్న బంగారునగను తీసివేసి పట్టుచీర విడచి, చిరిగిపోయిన వస్త్రములు ధరించి, ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరి చారికలు ఎంత బ్రతిమాలి ననూ," మరల వచ్చెద" నని చెప్పి వెడలి పోయెను. బలరాముడు, శ్రీహరి - మందిరము లోపల ప్రతిగదినీ చూశారు. ఆ మందిరములోని ఏ గది చూచినని వెలవెల పోయివున్నది. ధనాగారంలో ధనములేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్ధములులెవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి.ఆఖరికి త్రాగడానికి పాత్ర కాని, నీరుకాని లేకపోయి నందున దాహముతో ఉపవాసముండి నిద్ర పోయినారు. మరునాడు ప్రాతః కాలమున ముఖము కడుగు కొనుటకైనను నీరు దొరకలేదు. ఇక వారి కేమియు తోచలేదు.పిచ్చి ఎత్తి నట్లయింది. అంత బలరాముడు, అంత బలరాముడు, జగన్నాధుడగు విష్ణుమూర్తితో " తమ్ముడూ! మనము నిన్నటి దినమున ఆహారం తీసుకోలేదు చాలా నీరస పడి పోయియున్నాము. ఈ దిన మైనను తిండి తినక పోతె ఎలాబ్రతకగలం? అన్నీ కొరత గానున్న విగాన మనము బిచ్చమెత్తి అయినా ప్రాణములను నిలబెట్టుకోవాలి. గనక
ఇద్దరము బయలుదేరు దమురమ్ము" అని అనగా, జగన్నాధుడు అంగీకరించి యుద్ధరూ సాధు వేషములు వేసుకొని భిక్షాటనకు బయలు దేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగనను వారు కపట సన్నాసులు, చోరులని ఒక్కరూ భిక్షం పెట్టలేదు. కసరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుచు ఒక షావుకారు యింటికి వెళ్ళి " భిక్షాందేహి" అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండ బెట్టి భోజన పదార్దలు తెచ్చుటకులోనికి పోయిచూడగా పదార్ధములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరక నందున బలరాముడూ, విష్ణుమూర్తి ఆకలిబాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళి నారు, ఆ కొలనునిండా పద్మములు విర పూసియున్నవి" సరే వీటి తూడు కాయలను తిని ఇప్పటి ఆకలిబాధ తీర్చుకుందా" మని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండి పోయెను. యింక చేయునది లెక నిరాశతో వెళ్ళిపోయినారు. అటుల వెళ్ళగా ఒక తపః శ్మాలి కుటీరము కనబడి నది. అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. మునితాను తినుటకు వుంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము, పాలు మాయమైపోయినవి. ఇంక వారు చేయునది లేక ఇద్దరూ సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమము కనిపించిగా అచ్చటకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటులేదు. ఎవ్వరైనా ఆశ్రమములో ఎన్నిది నములుండి నను ఎంత భుజించినను అక్షయపాత్ర వలె తరగదు. కాని బలరామ జగన్నాధ స్వాములు అకడకు వెళ్ళగానే లక్ష్మీ దేవి ఏ పదార్ధమూ లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడి పోయెను. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను . అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ మరియొక భవనము చేరుకున్నారు. అది లక్ష్మిదేవి నివసిస్తున్న భవనం చాలా దినములనుండి తిండి లేక నీరసించివున్న వారిద్దరినీ లక్ష్మిదేవి చూచినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనము తయారుచేసి దాసీల చేత వారికి స్నానమునకు నీరు పెట్టించి, చెలికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపునిండా భుజించి బయటనున్న అరుగుమీద విశ్ర మించారు. కాని వారికి నిద్ర పట్టలేదు. ఆ యిల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్ని వింతగా తోచినవి ఆలోచిస్తున్నారు.అంత ఒక చెలికత్తె వచ్చి " ఓ స్వాములారా! మీదే గ్రామము? ఎందుండి ఎక్కడకు పోవుచున్నారు! మీకు భార్యా బిడ్డలు వున్నారా ! ఎలాగు ఎందుకు తిరుగుతున్నారు! అని అడుగగా - ఏమి చెప్పవలెనో తోచక వారు ఒకరి మొక మొకరు చూచుకొనుచు శ్రీ హరి ఇట్లు చెప్పినాడు. " ఈతడు నా అన్నయగు బలరాముడు. నేను శ్రీహరిని. మాతొందర పాటువలన నాయిల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెడలగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీవలన అష్ట ఐశ్వర్యములు కల్గునో, ఏ నారీ మణి కరుణా కటాక్షము వలన వంశాభి వృద్ద కలుగునో, ఏ వనితామణి ఎల్ల వేళలందు తననునమ్మి కొలిచినవారి ఇండ్లలొ మెలగుచుండునో అటువంటి లక్ష్మిదేవి మమ్ముల్ని విడిచి వెళ్ళిపోయినది అప్పటి నుండి మాకు దరిద్రమూ కష్టాలూ కలిగినవి " అని చెప్పెను. ఆ దాసీవలన ఆ యిల్లు లక్ష్మీదేవి మందిరమే అని తెలిసికొని, చాలా ఆనందించినారు.
బలరాముడు విష్ణువుతో " సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించ మని చేతులు పట్టుకొని అర్ధించుము" అని చెప్పిలోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూచి నమస్కరించి, నీళ్ళతో హరి పాదములు కడిగి ఆ నీటిని తలపై జల్లుకొని పువ్వులతో పూజించి, ఇటుల పలికెను. " నాధా! మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళ గొట్టినారు గదా! యిప్పుడెలా నాయింట భుజింనారు. ఛండాలపుదాని ఇంటికెలా వచ్చినారు? ప్రాణాలు పోసినప్పుడు జాతి, భేదములు అడ్డుకూడదా" అని నిష్టూర ములాడెను. శ్రీహరి చిరునవ్వుతో " ప్రియా! మేమిద్దరము భిక్ష మెత్తు కోవడం అంతా తెలుసుకున్నారు. నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూచినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంటము చిన్నభోయినది. నిన్నువదిలినందున మాకు అన్నీ లోపములె జరిగినవి. గాన, మా వెంటరమ్ము వైకుంటానికి పోవుదము " అని పలుకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి యింట అడుగు పెట్టగానే అన్నీ యధా ప్రకారముగా మారిన విధ నాగార మంతా ధనముతో, బంగారముతో నిండినది. వస్తు వాహనాలతో, దాసీజన ములతో భక్త కోటితె వైకుంటము కలకలలాడెను. కాన ఓ నారదా గురువారము నాడు లక్ష్మి పూజచేసి ఈ పురాణము చదివినను, లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలొ చేసిన పాపములు నశించి మోక్షము కలుగుటయేగాక లక్ష గొదానములు చేసినంత ఫలితముకలిగి అష్ట ఐశ్వర్యములతో తులతూగుదురు. ఈ లక్ష్మీ పురాణము పటనము ప్రతీ మానవుడు ముక్తి నొందుటకు మార్గ దర్శకము కాగలదు. అని, పరాశర ముని నారదునకు లక్ష్మీ పురాణమును వివరింనాడు.

మంగళ హారతి
లక్ష్మీదేవ్మ- మంగళ హారతి ఇది గో
అనురాగంబులో- నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా - ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ
వనస బత్తాయా - దానిమ్మ ఖర్జూర
తేనెలూ రేటి - తీ పైన పండ్లు
కన్నతల్లి - కమలాఫలాలు
ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ
మల్లె పుష్పాలు - మందార పూలు
తెల్ల గన్నేరు - చెంగల్ప పూలు
పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి - దయ సేయమ్మా || లక్ష్మీ
భక్తితో గొలిచేటి - నీ భక్త వరులం
నిజముగా - నిన్ను నమ్మేము నిరంతరం
శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు - చేకూర్చు మాతా || లక్ష్మీ
లక్ష్మి పురాణము సమాప్తము


No comments:

Post a Comment