భగవంతుని అనుగ్రహం పొందడానికే ఉపవాసం. ఇంకా చెప్పాలంటే శారీరక, మానసిక మాలిన్యాలను వదిలించుకోవడానికే ఉపవాస దీక్ష చేస్తారు. నిష్కామంగా ఈ దీక్షను చేయగలిగితే భగవంతుడు మన కోరికలను అడగకుండానే నేరవేరుస్తాడని ప్రతీతి.
శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడమంటేనే దైవం గురించి తెలుసుకోవడమన్నమాట.
ఉపవాస దీక్ష రోజున పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవ చింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి.
No comments:
Post a Comment