Wednesday, September 18, 2013

దేవునికి ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా....?

దేవునికి దణ్ణం పెట్టుకోవాలంటే ఆయనకు ఎదురుగా దణ్ణం పెట్టుకోకూడధన్నది నూరుపాళ్ళు నిజం.
ఈ జగత్తును పాలించే ఆ భగవంతున్ని ధర్శించాలనే ఒక ప్రక్కగా నిలబడి ఎంతో వినయంగా భక్తితో నమస్కరించాలి.అంతే తప్ప ఆ పరమేశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.

దేవాలయాల్లో కూడా ఇందుకు తగినట్లుగానే ఏర్పాటు చేయటం మీరు గమనించవచ్చు. దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించ కూడదని వేదం చెప్తోంది.


మీరు ఎప్పుడైనా విగ్రహ ప్రతిష్ట జరుగుతునప్పుడు చూసారా ?విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున విగ్రహం కనులకు మైనం పెడతారు .విగ్రహం ప్రతిష్ట జరిగాక దేవుని విగ్రహనికి పెట్టిన మైనాన్ని తొలగింహగానే స్వామి వారి ద్రుష్టి మొదట ఆవు దూడ పై పడేలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారు తన రూపం తను అద్దం లో చూసుకోనేల చేస్తారు.అటు పిమ్మట స్వామి వారికి మహహ నివేదిక ఏర్పాటు చేసి అయన ద్రుష్టి ఆహరం మీద పడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని అర్థం ఏమిటంటే గుడిలో ఉన్న స్వామి వారి ద్రుష్టి సరాసరి ధ్వజస్తంబం క్రింద ఉన్న దైవం మీద పడాలి.వారిదరి మద్య ఎవ్వరు నిలబదకూడదు.

విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే కాదు ...ఏ రోజునైన స్వామి వారికి అయన వాహనానికి మద్యన ఎవ్వరు కూడా నిలబడకూడదు.అందువలనే దేవుని ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోకుడదని అంటారు.ఒక ప్రక్కగా నిలబడి దేవునికి వినయంతో చేతులు జోడించి దణ్ణం పెట్టుకోవాలి. భక్తితో మీ మనసులోని కోరికలని విన్నవించుకోవాలి.మిగతా దేవుల్లందరికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు కాని శని దేవుణ్ణి మాత్రం ప్రక్కనుంచి చూడకూడదు.శనికి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి ప్రక్కకు వెళ్లిపోవాలి.

No comments:

Post a Comment