Saturday, September 14, 2013

గాయత్రి మంత్రాన్ని ఎవరైనా పఠించివచ్చా....?

ఈ సర్వసృష్టికి మూలమైనది శక్తిరూపం. ఆ శక్తి రూపం నుండి వచ్చిన మనము తిరిగి ఆ శక్తిని దర్శించి తరించాలి. ఆ శక్తి రూపమే గాయత్రి మాత. ఆ గాయత్రీమాత కరుణా కటాక్షాల కోసం అందించినదే గాయత్రి మంత్రం.

ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం!
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్||

ఇది గాయత్రి మంత్రం. ప్రతి ఒక్కరు పఠించిదగిన విశేషమంత్రం. గాయత్రీ బీజమంత్రం. శబ్దపరంగానూ, మంత్రోచ్చారణ చేసినవారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి.

గాయత్రి మంత్రం పురుషులే పఠించదగినదని కాని, కొన్ని వర్గాలవారికే పరిమితమైనదని కాని శాస్త్రాలలో ఎక్కడా లేదు. ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత ఉండి తీరాలి. అందుకు మినహాయింపు లేదు.

అందువలన ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించిన వారు గాయత్రీమాత కరుణా, కటాక్షాలను పొందగలరు.

No comments:

Post a Comment