Sunday, June 17, 2012

హయగ్రీవావతారం


సకల చరాచర సృష్టికి కర్త అయిన  బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే,ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహా విష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణు తత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి హయగ్రీవ కథ తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణువు దుష్టశిక, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీమహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్టికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా రాజస్తామోగుణాలకు ప్రతీకలుగా ఉన్న మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలనుధరించి మెల్లగా బ్రహ్మ దగ్గరకు చేరి, మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు. బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో అ దానవూ సముద్రంలో ప్రవేశించి, రాసాతలానికి చేరారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ, వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని, అవి లేకపోతే తానూ సృష్టిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి, వేదసంరక్షణ కోసం యోగారూపంతో ఒక దివ్య శరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించ సాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణకాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చేవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుడులుగా, సముద్రాలు కనుబోమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు  అలకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి. ఈవిధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతరాం బ్రహ్మ ముందు నుంచి అంతర్థానమై రాసాతలానికి ప్రవేశించింది.

అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధురగానవాహిని రసాతలం అంటా మారు మోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గానరస వాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు బయలుదేవి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలకి అచ్చి సముద్రంలో దివ్య తేజ కాంతిపుంజంలాగా ఉండి ఆది శేషుడి మెడ యోగనిద్రాముద్రలో ఉన్న శ్రీమహా విష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక   ఏమి తెలియనట్లు నిద్రిస్తునాదని కోపగించుకొని, శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధారణ లక్ష్యంగా అవతరించింది. వేదాలను కాపాడిన ఆ స్వామి విద్యాప్రదాత.

No comments:

Post a Comment