Sunday, June 17, 2012

శంఖాన్ని పూరించడం వల్ల వచ్చిన శబ్దాన్ని గొప్పగా ఎందుకు భావిస్తారు?

దేవాలయాలలో శంఖాన్ని ఊదడాన్ని మనం వింటాం. ఇది ఇతరమైన నాదాలతో ముఖ్యంగా ఘంటానాదంతో దేవతా పూజ చేయుచున్నప్పుడు వినబడుతుంది. విగ్రహ దైవం చుట్టూ కుడి నుండి ఎడమవైపు దీపాన్ని చూపుతున్నప్పుడు లేదా మంగళహారతి ఇస్తున్నప్పుడు కానీ మనం శంఖారావాన్ని వింటాం. ఇలా హారతుల సమయంలో శబ్ద – దృశ్య దివ్య అనుభవాన్ని భక్తులు అనుభవిస్తారు. శంఖం నుండి ఉత్పన్నమయ్యే శబ్దం మంగళకరమైన మరియు దివ్యమైన ‘ఓం’ కారంలో ధ్వనిస్తుంది. శంఖారావాన్ని బహిరంగంగా (యుద్ధాన్ని) ఏదైనా ప్రకటిస్తున్నప్పుడు వినిపించడం జరుగుతుంది. మనందరి స్మృతిలో ఉన్న పౌరానిక యుద్దమైన కురుక్షేత్రం శంఖారావంతో ప్రారంభమైంది. శంఖాన్ని బాగా తోమి కొన్ని మందులలో దాన్ని ప్రాధాన్యతతో వాడుతారు. శంఖానికి ఉన్న ఔషదీయ గుణాల కారణంగానే దాన్ని వాడడాం జరుగును. శంఖారావ శబ్దం మన మెదడులో ప్రకంపనలు సృష్టించి అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తుందని ఆధునిక శాస్త్రం తెలుసుకున్నది.

No comments:

Post a Comment