Monday, June 18, 2012

మండలదీక్ష ఏం చెబుతోంది?

ఈ కలియుగంలో మనలను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో రూపాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి! ఆ స్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి, అనంతరం ఇంట్లో పూజ చేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం, ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగదమేకాదు, ఆ పద్ధతుల్లో దీక్షలు చేపట్టి  జ్యోతి దర్శనానికి బయలుదేరుతున్నారు. ఆ వాదప్రతివాదనలను అలావుంచితే, మండలదీక్షలో ఓ గూడార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశి స్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్య జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టిలో చూసినపుడు,

నక్షత్రాలు – 27

రాశులు – 12

గ్రహాలు -  09

వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష!

No comments:

Post a Comment