Sunday, June 17, 2012

గాయత్రీ మంత్రం



గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీమంత్రం పరబ్రహ్మ స్వరూపం.   మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.

ఓం భూర్భవస్సువ: తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్

గాయత్రీమంత్రం  24 అక్షరాలలో -

1. “తత్”  -  గణేశుడు ,  
2. “స”  -  నృసిం హస్వామి,   
3. “వి”  -  విష్ణు,  
4. “తు”  -  ఈశ్వరుడు,  
5. “వ”  -  శ్రీకృష్ణ,  
6. “రే”  -  రాధాదేవి,    
7. “ణి”  -  లక్ష్మీదేవి,  
8. “యం”  -  అగ్నిదేవుడు,  
9. “భ”  – ఇంద్రుడు,  
10. “గో”  – సరస్వతీదేవి,  
11. “దే”  – దుర్గాదేవి,  
12. “వ”  -  హనుమాన్,  
13. “స్య”  -  భూదేవి,  
14.  “ధీ”  -  సూర్యభగవానుడు,  
15. “మ”  -  శ్రీరామచంద్రుడు,  
16. “హి”  -  సీతాదేవి,  
17. “ధి”  -  చంద్రుడు,  
18. “యో”  -  యమధర్మరాజు,  
19. “యో”  -  బ్రహ్మదేవుడు,  
20. “న:”  -  వరుణదేవుడు,  
21. “ప్ర”  -  నారాయణుడు,  
22. “చో”  – హయగ్రీవుడు,  
23. “ద”  -  హంసదేవత,  
24. “యత్”  -  తులసీమాత.

ఇందులో ఎవరి ఇష్టదేవతను వారు ఆ దేవత గాయత్రీ మంత్రంతో జపించి ఆ దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు.  ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చొప్పున 40 రోజులపాటు ఆ దేవతాచిత్రం ముందు కూర్చుని ధూప, నైవేద్యాలతో పూజించి, ఆ దేవత మంత్రాలను 108 సార్లు జపించితే అనుకున్న కోరికలు నెరవేతురాయి.


No comments:

Post a Comment