Monday, June 18, 2012

రామయణకాలంలో ప్రజల జీవనవిధానం

నేటికీ మనకు రామరాజ్యం ఆదర్శప్రాయం. ఆ కోదండరాముని రాజ్యంలో ప్రజా జీవస్దితిగతులు ఎలా ఉండేవన్నది ఆసస్తికరం.

అవిచ్చిన్నంగా సాగిపోతుండే భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకునేందుకు, భారత రామాయణ గ్రంధాల పఠనం అత్యంతావస్యకం. ఆనాటి భారతీయ సంప్రదాయాలు, రాజకీయ, సాంఘిక పరస్దితులు ఆ గ్రంధాలలో సజీవంగా చిత్రించబడ్డాయి. సాధారణ ప్రజల ఆచార వ్యవహారాలే ఏ సంఘ సంస్కృతినైనా ప్రతిబింబిస్తాయి. ఈ సిద్దాంతాం ఆధారంగా రామాయాణకాలంనాటి సంఘ పరిస్ధితులను పరిశీలిస్తే, ధర్మానుగుణమైన రాజ్యాంగం ద్వారా నీతినియమాలతో నియతమైన ఆ కాలంనాటి సాంఘీకవ్యవస్థలో సదాచారాలకు పెద్దపీట అన్న విషయం స్పష్టమవుతోంది. అందుకే రామాయణకాలంనాటి కొన్ని ఆచారాలు భారతీయులందరికీ నేటికీ ఆదర్శప్రాయాలు.

ఆరోజుల్లో అతిదిసత్కారానికి అత్యున్నతమైన స్థానం ఉండేది. గృహస్థ నిర్వహించాల్సిన పంచ యజ్ఞాలలో అతిథి సత్కారం కూడా చేర్చబడింది. సత్కరించే వారి శక్తిని, హోదానుబట్టి అవసరమైన మార్పులు జరిగేవి. సర్వ సామాన్య పరిస్థితులలో అర్ఘ్యపాద్యాలు, మధుపర్కం, గోవు, ఆసనం తప్పకుండా సమర్పించేవారు. అతిథులను స్వాగతించిన తరువాత కుశల ప్రశ్నలు ఉండేవి. ఉదాహరణకు తనకు స్వాగతం పలికిన సబరిని రాముడు ఇలా కుశలప్రశ్నలను వేసాడు. ‘తపస్వినీ! అన్ని విఘ్నాలను జయించావు కదూ! తపస్సు వర్దిల్లుతున్నది కదూ! కోపం, ఆహారం చెప్పుచేతల్లోనే ఉన్నట్లే కదూ! నియమాలను నిర్వహిస్తూన్నావు కదూ! మనసుకు సుఖం, శాంతి కలుగుతున్నాయి కదూ. మధురభాషిణీ! నీ గురుశుశ్రూష ఫలించింది కదూ!’

కలుసుకున్నవారు పెద్దవారైతే నమస్కరించడం, సమవయస్కులైతే కౌగలించుకోవడం, చిన్నవారైతే అభినందనలను స్వీకరించడం జరుగుతుండేది. పిల్లలు బయలుదేరేముందుపెద్దల ఆజ్ఞను తీసుకోవడం మరచిపోయేవారు కాదు, తల్లిదండ్రులు, పురోహితులు, పెద్దలు మంత్రపూర్వకంగా పిల్లలను ఆశీర్వదించే వారు. స్నేహితులపై కనబరిచే ఆత్మీయతకు అనుగుణంగా ఒకరితో ఒకరు సెలవు తీసుకునే సమయంలో తిరిగి కనిపిపిచండి, తిరిగి కలవడానికే సెలవు పుచ్చుకుమ్తున్నాం, తిరిగి రావడానికే సెలవు తీసుకొంది అనే మాటలను సంస్కృతంలో చెప్పేవారు సెలవు అనే మాటను అనాగరికంగా, అనుచితంగా భావించేవారు. ప్రజలు రాజులను ఎంత గౌరవంగా చూసుకునేవారో, అంటే గౌరవంగా రాజులు ప్రజలను కూడా చూసుకునేవారు. దశరథ మహారాజు తనకు నమస్కరించిన సభాసదులను చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసేవాడు. రావణుడు సైతం తనపాదాలను స్పృశించిన సభాసదులను సముచితరీటిన ఆదరించాడు. తన సేనాదిపతులను చేతులు జోడించి పలుకరించేవాడు.

రాజభవనంలో రాజుల దర్శనానికి వచ్చేవారేవరైనా సరే, ముందుగా ద్వారపాలకుని ద్వారా విషయం తెలియబరచడం తప్పనిసరిగా ఉండేది. వారు అనుమతించిన తరువాతే దర్శనం లభించేది. తండ్రిగారి అంత:పురంలోకి తండ్రి దర్శనానికై రాముడు కూడ వర్తమానాన్ని పంపుకోవలసి వచ్చింది. అయితే సుమంత్రుని వంటి వయోవృద్ధులకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ఆశ్రమాలలో నివసించే గురువులను దర్శించేందుకు పోయినప్పుడు కూడా వర్తమానం పంపడం ఆచారంగా ఉండేది. అంత:పుర వ్యవహారాలలో పట్టపురాణి ప్రధాన స్థానం వహించేది. ఆకాలంనాటి సంభోధనా పధ్ధతిఎంతో ఆత్మీయంగా ఉండేది.

ఆనాటి వస్త్రాభరణ అలంకారాలు

ఆనాటి ప్రజల రకరకాల వస్తాలంకరణలతో, ఆభరణ అలంకారాలతో విలసిల్లుతుండేవారు. ఆకాలంలో సైనికులు సైతం చిత్ర విచిత్రమయిన వస్త్రధారణ పట్ల అమితమయిన శ్రద్ధను చూపించేవారు. నగిషీ చేసిన వస్త్రాలను ధరించడం బాగా వాడుకలో ఉండేది. బంగారు జలతారు పట్టు పీతాంబరాలు, రత్నాలు పొదిగిన రత్నాంబ్రాలు, రామాయణంలో వర్ణించబడ్డాయి. నాటి మానవ జీవితంలోనే కాక, భావాలలో, లోకోక్తులలో వస్త్ర ప్రశంస కనుబడుతుంటుంది. కౌశేయాలు, అంటే పట్టువస్త్రములు బాగా వాడుకలో ఉండేవి. అందుకే సీతను ఎన్నో ఘట్టాలలో కౌశేయవాశిని అని పిలువడం జరిగింది.

ప్రత్తినూలుతో, జనపనారతో తయారుచేసిన వస్త్రములను గురించి తక్కువగా ప్రస్తావించబడింది. జనపనారను జనపనారను ంచ జనపనారతో తయారుచేసిన తాళ్ళు పెనువేసుకునేందుకు ఎక్కువగా ఉపయోగించేవారు. లంకలో హనుమంతుని జనుపనారతోనే బంధించారు. అయన తోకకు ప్రత్తినూలు బట్టల పాత పీలికలు చుట్టబడినాయి. సంనబట్టలకు సూక్ష్మవస్త్రములని, విలువగల వస్త్రములకు మహార్హవస్త్రములని, జలతారు, అమ్చుబట్టలకు సంవీత వస్త్రములని పేర్లుండేవి. అలాగే పంచెలను వసనము, అంశుకము, అర అనే పేర్లతో పిలిచేవారు.

తలపాగకు ఉష్ణీషం అని పేరు. విద్యార్థులు దోవాతిని ధరించేవారు. పైపంచెను ధరించేవారు కాదు. మారీచినితో ప్రప్రధమంగా రాముడు పోరాడినపుడు ఏకవస్త్రధరుడే. ఇక, గృహస్తులు పంచేకట్టుకుని, ఉత్తరీయాన్ని కూడా ధరించేవారు. ఇంచుమించు ఈనాటి కండువావంటిది. యుద్ధమో లేక కాయకష్టం చేయాల్సి వచ్చినపుడు, ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకునేవయు. సాధారణంగా స్త్రీలు పట్టుచీరలనే కట్టుకునేవారు. పురుషుల్లా ఉత్తరీయం వేసుకున్నపటికీ, ఆ వేసుకోవడం వేరుగా ఉండేది. రంగువస్త్రములను విరివిగా ధరించేవారు. అప్పుడు కుట్టు వస్త్రములు లేకపోయినప్పటికీ,కుట్టుపని తెలిసి ఉండకపోలేదు. రామాయణంలో సూదికి ‘సూచీ’ అనే పదం, దర్జీకి ‘తున్నవాయ’ అనే పదం ప్రయోగించబడింది. రాజసేవకులు ధరించిన కంచుకాలు ఇంచుమించు పోడుగుకోట్ల వంటివే.

ఆరోజుల్లో కళాశక్తి

సంగీతం ఆ నాటి ప్రజలజీవితాలలో అవిభాజ్యమైన ఒక అంశంగా ఉంది. అందరూ సంగీతాన్ని ఆదరించేవారు. పట్టణాలలో రథాల గరగర ధ్వనితోపాటు, సంగీతవాయిద్యాల శ్రావ్యసంగీతం వినిపిస్తుంది. రాజులజీవితాలు సంగీత మాధుర్యంలో మునకలు వేసేవి. దశరధుడు, రాముడు, భరతుడ, రావణుడు సూర్యోదయం కాగానే వాద్యాల మధురధ్వనులు, వందిమాగధుల స్తుతులతో మేలుకోలుపబడేవారు. రావణుడు తర దర్బారుకు సహస్త్ర శంఖ, కాహాళ, తూర్య ధ్వనులతో వచ్చేవాడు. వనవాసం నుంచి రాముడు అయోధ్యకు వేంచేసినపుడు గాయకులూ శంఖాలు,దుందుభి నాదాలతో స్వాగతం పలికారు.

ప్రాచీనకాలంలో యుద్దసమయాలలో కూడా సంగీతం ఉండేది. యద్ద సంగీతాన్ని ‘యుద్ధగాంధర్వం’ అని పిలిచేవారు. ఇక యుద్ధాలు లేనప్పుడు సేనలు వాద్య సంగీతంలో తలమునకలయ్యేవి. సైనికులకి భేరినాదం యుద్ధ ఆహ్వా సూచకంగా పరిగణింపబడేది. ఆనాటి వాద్యాలలో వీణ అత్యధిక ప్రాచుర్యాన్ని పొందింది. సంగీతంతో పాటు నృత్యం కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేది. రాముని వివాహమహోత్సవంలో అప్సరసలు నృత్యం చేయగా, గంధర్వులు మధురగీతాలను ఆలపించేవారు.

ఆయన జన్మదినం, రాజ్యాభిషేక సమయాలలో కూడా ఇలాంటి ఏర్పాట్లే జరిగాయి. పట్టణాలలో ఉద్యానవనాలు నిర్మించబడేవి. స్త్రీపురుషులు క్రీడావినోదార్ధం ఉద్యాన వనాలకు వెళ్ళేవారు. ఇక లంకలో అశోకవనం రావణునికి ప్రీతిపాత్రమైనది. ఆవనాన్ని చూసినపుడు ఇంద్రియ నిగ్రహంగల ఆంజనేయుడు కూడా ముగ్ధుడయ్యాడు. అంత:పురాలతో పాటు రాణులు విశ్రాంతి వినోదాల నిమిత్తం ఉద్యానవనాలను నిర్మించేవారు. అవి ప్రమాద వనాలని పిలువబడేవి. ఊరికి దూరంగా క్రీడాస్థలాలు నిర్మింపబడేవి.

విద్యావికాసం

సంఘంలో నిరర్క్షరాస్యతను దూరం చేసి మంచి నాగరికతను పెంపొందించడానికి ప్రాచీనకాలపు విద్య యొక్క ముఖ్యోద్దేశం. విద్యార్థులు పరిశుభ్రత, వినమ్రత, విధేయత, సత్ర్పవర్తన తదితర గుణాలపై విద్య మళ్లించేది. భారతీయ సంస్కృతికి మూలభూత సిద్ధాంతమైన  మతము, నీటి ఆనాటి విద్యలలో ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉండేవి. నాటి విద్యావ్యవస్థలో వేదవేదాంగాములు, కర్మకాండల పరిజ్ఞానం అని వార్యంగా ఉండేది.

రామయణకాలంలోని ప్రారంభ శ్లోకాలలో వాల్మీకి నారదునితో తన కావ్యనాయకుడు శరీరం, మనస్సు, ఆత్మలలో పరిష్కృత గుణాలను కలిగినవాడై ఉండాలని విన్నవించాడు. వాల్మీకి దృష్టిలో ఆదర్శపురుషుడు – గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, పరోపకారి, సత్యభాషి, ద్రుడప్రతిజ్ఞగలవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, క్రోధాన్ని జయించువాడు, భూతదయగాలవాడు, యుద్ధంలో అజేయుడై ఉండాలి. నారదుని దృష్టిలో రాముడే పై గుణాలను కలిగినవాడు. ఆ యుగంలో రాముడు సర్వోత్తమమైన విద్యలను పొందిన రాజకుమారుడు. అయినప్పటికి అన్యులను తక్కువగా భావించేవాడు కాదు. పౌరకార్యాలను నిర్వర్తిస్తూ ప్రజల సుఖదు:ఖాలలో పాలుపంచుకునేవాడు. ఆనాటి విద్యావంతలు తమ సాంఘిక కర్తవ్యాలను పాటించేందుకు ఋణానిత్రీణి అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. దీనినిబట్టి ఈలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేవఋణం, ఋషి ఋణం , పితృఋణం అనే మూడు ఋణాలను తీర్చుకోవలసి ఉంది. యజ్ఞాల అనుష్టానం, శాస్త్ర అధ్యయనం, సంతానోత్పత్తి ద్వారా మనిషి ఈ ఋణాలనుంచి విముక్తుడవుతున్నాడు.

ఒక యుగంలోని వాజ్మయం ఆనాటి సంఘానికి అద్దం వంటిది. ఆనాటి వాజ్మయానికి చరమ నిదర్శనం వాల్మీకి రామాయణమే. వాజ్మయంలో  జీవిత విశ్లేషణ, జీవితపు గొప్పదనం, జీవితపు అభివ్యక్తీకరణం ప్రతి పాదింపబడిన శ్రేష్టకావ్యం రామాయణం. వాజ్మయంలో ఒక కొత్తకోలబద్దను, నూతన ఆదర్శాలను నెలకొల్పినందు వల్లనే రామాయణం ఆదర్శ కావ్యమైంది. వేదాలలోని పురాతనవాదం, బ్రాహ్మణాలలోని రహస్యవాదం, ఉపనిషత్తులలోని అద్యాత్మవాదం, సూత్రాలలోని సంక్షేపవాదం తరువాత ప్రజలు రామాయణానికి స్వాగతం పలికారు. సరళమైన కతాప్రవాహం, భావాల మార్మిక ప్రకటీకరణం, సంగీత నాద సౌందర్యం – ఈ మూడింటి మనోహరమైన సమ్మేళనమే రామాయణ కావ్యం. రాముని జీవితాన్ని గురించి వాల్మీకి రచించిన రసమధుర మహాకావ్యం రామాయణం. ధర్మానుయాయులగు హిందూజాతి అస్తిత్వం ఒక ప్రత్యెక విలువగా ఉన్నంతకాలం రామాయణం ఎల్లప్పూడు భారతీయుల సభ్యత, గోప్పదన్నాన్ని, దాని సౌరభాన్ని నలుదిక్కులా విరజిమ్ముతుంది. ఆమధ్య, దేశంలో ఆధ్యాత్మిక విషయాశక్తి తగ్గడంలో రామకథకు మూలమయిన రామాయణ పఠనం తగ్గి, నాటి ఉదాత్త విషయాలు మరుగునపడిపోయాయి. అయితే, ప్రస్తుత యువతకు మన సాంస్కృతిక వారసత్వం పట్ల ఆసక్తి పెరుగుతుండటం ముదావహం. యువతకు మన పురాణాల పట్ల అనురక్తి కలుగుతుండటం ఒక శుభ పరిణామం. అది భవిష్యతరాలకు మన పెట్టుబడి వంటిదనేచెప్పాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment