Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 23

సాలలో ఇంత గొడవ జరుగుతున్నా, పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రిపూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద, బురదగా బాగా తడిసి ఉంది. కాపలావాళ్ళను పిలిపించి అడిగితే వాళ్ళు, ‘‘చాలా రాత్రయింది, పాలేరు నిశ్చింతగా నిద్ర తీస్తున్నాడు, మాకూ కునుకొచ్చింది. అంతలో ఏనుగు అరుపుతో కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించింది.

చెరుకంతా లాగి మేసేస్తున్నది, గానుగలాగ పిప్పంతా ఊసేస్తున్నది; మాకు చెడ్డ భ…ుమేసింది. పారిపో…ూం!'' అంటూ వాళ్ళింకా భ…ుంతో వొణికి పోతూనే చెప్పారు. భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. అలాగే వెళ్ళి పాలేరు పాదాలకు మ్రొక్కు తూన్నట్టు సాగిలపడిపో…ూడు. పాలేరు మేల్కొన్నాడు. లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మ్రొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి, ‘‘స్వామీ! ఇన్నాళ్ళకు మమ్మల్ని అనుగ్రహించావు.

ధన్యులం!'' అని అంటూ జరిగిందంతా పాలేరుకు చెప్పింది. మహాద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దివాణం క్రిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచిఉన్న చెరుకురసాన్ని తీర్థంగా సేవిస్తూ, చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకువెళ్తున్నారు. పాలేరు, భార్య పిల్లవాడితో కలిసి వినా…ుక విగ్రహానికి దణ్ణాలు పెడుతూ, ‘‘చిన్న పత్రి పిసరైనా వేసి నిన్నెన్నడూ పూజించలేదు. నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు.

నా కోసం ఎందుకింత శ్రమపడ్డావ…్యూ? ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు. నువ్వు వచ్చినప్పుడు నిద్దర పోయిన దద్దమ్మను!'' అంటూ పిల్లవాడిలాగ బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని, విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకు వెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది! విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గిరకు తీసుకొని, అభ…ుహస్తంతో అతని తల నిమురుతూ, ‘‘నా…ునా! కులాలు, జాతులు ఆచారాలు నేను పెట్టినవి కావు.

అంతా ఈ మా…ుదారి మనుషులు కల్పించుకున్నవే. నా దగ్గిర ఎక్కువ తక్కువలకు చోటు లేదు! అందుకే నీకు కనిపించాను!'' అని చెప్పి అంతర్థానమ…్యూడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలే రుతో, ‘‘నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది,'' అంటూ పదే పదే మ్రొక్కుతూ బ్రహ్మరథం పట్టారు. ‘‘ఇక్షు అంటే చెరుకు, సహస్ర-ఇక్షు, వెయ్యి చెరుకుల గణపతి; సహస్రేక్షు గణ పతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు.

చెరుకు గడ పట్టుకొన్న వినా…ుక విగ్రహం ప్రతిష్ఠింప బడి అక్కడ గొప్ప ఆల…ుం వెలిసింది,'' అని పావనమిశ్రుడు కథ ముగించాడు. ఆల…ు మంటపంలోని చిత్రాల కథలన్నీ పావనమిశ్రుడు చెప్పాడు గాని ముఖద్వారం మీద చిత్రింపబడినది మాత్రం మిగిలి ఉంది. అది చాలా పెద్ద చిత్తరువు. మంటపం లోని చిత్రాలన్నీ ఒక ఎత్తు అది ఒక్కటి ఒక ఎత్తు! చిత్రలేఖన ప్రతిభ అంతా అందులో ఉంది. ప్రతి రోజూ ఆ చిత్రాన్ని పరీక్షగా నిల్చుని చాలాసేపు తదేకంగా చూస్తూండే …ుువకుడొకడు పావనమిశ్రుడి పాదాలకు నమస్క రించి, ‘‘మహాశ…ూ!

ఈ ఆల…ు మంటపంలోని చిత్రాలను ఎవరు చిత్రించారు? ఆ మహాశిల్పి చరిత్ర ఏమైనా ఉంటే చెప్పండి! ఆ ముఖద్వారం మీద వున్న చిత్రానికి నా కళ్ళూ, మనస్సూ అంకితమైపో…ూయి. ఆ చిత్తరువు గురించిన గాథ కూడా ద…ుతో చెప్పి చిత్ర చరిత్ర సంపూర్ణం చె…్యుండి!'' అన్నాడు. పావనమిశ్రుడు ఆ …ుువకుణ్ణి సాద రంగా చూసి, ‘‘నా…ునా! చూడగా నువ్వూ చిత్రకారుడిలాగ కనిపిస్తున్నావు! ముఖ ద్వారం మీది చిత్తరువు నాకూ అభిమాన చిత్రమే.

దాని గాథ తర్వాత చెప్పి విఘ్నేశ్వర చరిత్ర సంపూర్ణం చేస్తాను! నువ్వడిగిన చిత్ర శిల్పికి చరిత్ర లేకపోలేదు, ఉంది!'' అంటూ కన్నులు మూసి ఏదో గుర్తు తెచ్చుకుంటు న్నట్లు ధ్యానించి, కాస్సేపైనాక చెప్పడం ప్రారంభించాడు: వాతాపి నగరానికి సాధువుల గుంపుతో పధ్నాలుగేళ్ళప్రా…ుంగల వాడొకడు వచ్చి వాతాపి గణపతి ఆల…ుం వదలకుండా అలాగే ఉండిపో…ూడు. అతని ఊరేదో పేరేదో అతనికే తెలి…ుదు.
అతని నుదుట పెద్ద గా…ుం మానిన గుర్తు చూసి, పాపం ఏదో దెబ్బ తగిలి స్మృతి పోగొట్టు కొన్నవాడులాగుంది, అని అంతా అనుకున్నారు. ఆ బాలుడు మూగవాడా అన్నట్లు అటే్ట మాట్లాడే వాడు కాడు. గోడల మీద బొమ్మలు గీస్తుండే వాడు. మంటపం రాతిపలకల నేలమీద సుద్దతో బొమ్మలు గీస్తూండేవాడు. గీస్తూన్నంత సేపూ అతని ముఖం పూర్ణచంద్రబింబంలాగ నవ్వుతూ వెలుగుతూండేది.

అంచేత చిత్రా నందుడు, చిత్రముఖుడు అనీ, అతడు ఎక్కు వగా విఘ్నేశ్వరుడి బొమ్మల్నే వేస్తూండడం వల్ల విఘ్నేశ్వర చిత్రకారుడు అనే పేరును లుప్తాక్ష రిగా విచిత్రుడు అని అక్కడివారు అంటూండేవారు. అప్పటికి గజాననపండితుడు చాలా వృద్ధు డ…్యూడు. రోజూ సా…ుంత్రం ఇంటి దగ్గిర పిల్లలకు విఘ్నేశ్వరుడి కథలు చెప్పుతూండే వాడు. విచిత్రుడు ఆ కథలను అతిశ్రద్ధగా అరుగుమీద చెవికోసుకొని వింటూండేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథకు సంబంధించిన చిత్రం ఏ గోడమీదనో కనిపించేది. గజానన పండితుడికి విచిత్రుడి మీద చాలా వాత్సల్యం.
ఇంటిలోపలికి పిల్చినా విచిత్రుడు గడపమీద ద్వారం వెలుపలే కూర్చుని వింటూ, ‘‘స్వామీ, ఇక్కడ కూచుని వింటేనే నాకొక్కడికే చెబుతున్నట్లు ఎంతో బాగా వినిపిస్తున్నది!'' అనేవాడు. విచిత్రుడు చిత్రించే విఘ్నేశ్వరుడి బొమ్మలు చూసి గజాననుడు మురిసిపోతూ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన అనేక కథలను ప్రత్యేకంగా అతనికి చెబుతూండేవాడు. విచిత్రుడి వెనక ఎప్పుడూ పిల్లలు గుంపులుగా ఉండేవారు. అతను బొమ్మలు వేస్తూంటే నిశ్శబ్దంగా చూసి ఆనందిస్తూ, తర్వాత చిన్న చిన్న బొమ్మలు వేస్తూండేవారు.

ఊళ్ళో పిల్లలకు చిత్రకళ అబ్బింది. విచిత్రుడు పగలంతా వీధుల్లో గోడల మీద జేగురుముక్కతోనో, సుద్దరాయితోనో బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆల…ుంలో పంచే ప్రసా దంతో గడిపి, రాత్రి ఆల…ు మంటపం మెట్ల మీద ఓ వారగానో, ఊరి చివరనున్న వాడలో ఏ పంచకిందనో ఆదమరిచి నిద్ర పోేువాడు.

ఆ వాడలో కుమ్మరులు, చర్మకారులు, పంచములు మొదలైనవారుండేవారు. విచిత్రుడంటే ప్రాణం పెటే్టవారు. ఏ అపరాత్రి వేళ విచిత్రుడు వచ్చినా అతని కోసం ఉంచిన దాన్ని పెట్టి తినిపించి మరీ విచిత్రు డికి పడక సదుపా…ుం చేసి ఆ తరువాతే నిదుర పోేువాళ్ళు. ఆ విధంగా విచిత్రుడు పెరిగి పెద్ద…్యూడు. తానెవరో తనకే తెలి…ుకుండా మరిచి పోయిన విచిత్రుడికి అన్నలూ తల్లీ తండ్రీ అందరూ ఉన్నారు!

వాతాపి నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక ఊళ్ళో మధ్యతరగతి కుటుంబంలో విచిత్రుడు పుట్టాడు. తండ్రి మూలంగా అతనికి అతి బాల్యంలోనే బొమ్మలు గీ…ుడం అబ్బింది. బొమ్మలు వె…్యుడానికే పుట్టాడా అన్నట్లు ఆ కురవ్రాడికి మరేది అబ్బలేదు. అన్నలు, వదినలు అతణ్ణి ఈసడించుకొని ఇంటినుంచి తరిమేశారు. కురవ్రాడికి విఘ్నేశ్వరుడంటే చాలా ఇష్టం. వాతాపి నగరానికి బ…ులుదేరివస్తూ, తిండీతిప్పలు లేని నీరసంతో మార్గంలో ఒక కరుకురాతి మీద పడిపో…ూడు.

దెబ్బ తగిలి తెలివితప్పి పడిఉన్న అతణ్ణి సాధువులు కొందరు కాపాడి తమ వెంట వాతాపి నగరానికి తెచ్చారు. అదీ విచిత్రుడి బాల్యచరిత్ర. ఆ ఏడాది వాతాపి నగరంలో వినా…ుక చతుర్థి ఉత్సవాలకు ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. నిలువెత్తు వినా…ుక విగ్రహాలను చిత్ర కళా ప్రతిభ కనపరుస్తూ రంగులు వేసి ప్రదర్శనలో పెట్టాలి.
అన్నిట్లో గొప్పగా ఉన్న విగ్రహాన్ని వెయ్యి బంగారు కాసులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేవారు కొంటారు. రత్నఖచిత స్వర్ణకంకణాన్ని నగరపాలకులు చిత్రకారుడికి బహూకరిస్తారు. ఆ పోటీ ప్రదర్శనకు ఆస్థాన చిత్ర కారులూ, గొప్ప గొప్ప చిత్రకళా నిపుణులూ చాలా మూల్యాన్ని వెచ్చించి దేశాంతరాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలు, రంగురంగుల మెరుపురేకులు, రంగురాళ్ల పొళ్ళు ఉపెూగించి, మెరుగుపూత పెట్టిన విఘ్నేశ్వర విగ్రహాలను ప్రదర్శనలో పెట్టారు. విచిత్రుడికి ఒక కుమ్మరి మిత్రుడున్నాడు. విచిత్రుడు దగ్గిరుండి చెప్పిన విధంగా అతడు బంకమట్టితో విఘ్నేశ్వర విగ్రహాన్ని చేశాడు.

 విచిత్రుడు సున్నము, మసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లను ఉపెూగించి విగ్రహానికి రంగులు దిద్దాడు. విచిత్రుడు రంగులు వేసిన ఆ విగ్రహాన్ని చిత్రకార ప్రముఖులు ప్రదర్శనలో పెట్టనివ్వ లేదు. విచిత్రుడు ప్రదర్శన నిర్వాహకులతో, ‘‘అ…్యూ! ద…ుతో చిట్ట చివర్న నా విగ్రహాన్ని కూడా ఉంచండ…్యూ! ఉడతాభక్తిగా నేను కూడా నాకు వచ్చినంతగా విఘ్నేశ్వరుడికి రంగులు వేశానని అనుకుంటూ, ఆ గొప్ప గొప్ప విఘ్నేశ్వరుల సరసన నా విఘ్నేశ్వరుడు కూడా ఉంటే చూసుకోవాలని ఉంద…్యూ!

అంతకు తప్ప మరే కోరికా లేదు!''అని ఎంతో ప్రాథే…ుపడ్డాడు. కానీ, ‘‘కులగోత్రాలు, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతులతో తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో త…ూరైన విగ్రహానికి వంశప్రతిష్ఠలుగల ప్రఖ్యాత మహా చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించడానికి అర్హత లేదు!''అని నొక్కి వక్కాణించారు ప్రదర్శన నిర్వాహ కులు.
విచిత్రుడు చాలా విచారపడ్డాడు. కుమ్మరి మిత్రుడు, ‘‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పో…ూరు, మనం విగ్రహాన్ని వేరేచోట పెడదాం పద!'' అని విచిత్రుడికి నచ్చజెప్పి, ప్రదర్శనశాలకు దగ్గర్లో ఉన్న ఒక అరటిచెట్టు మొదట విగ్రహాన్ని పెట్టి, విచిత్రుణ్ణి తనతోబాటు అక్కడ కూర్చుండ బెట్టుకున్నాడు.

ప్రదర్శనశాలలో పెద్దవాళ్ళు విగ్రహాలను చూస్తూ, గుంపులు గుంపులుగా చేరి, విగ్రహా లకు ఉపెూగించబడిన రంగుల విలు వల గురించి, చిత్రకారుల పదవీ కుల గోత్రాల గొప్పలూ చెప్పుకుంటూ ఉంటే, పిల్లలంతా విచిత్రుడి వినా…ుక విగ్రహం దగ్గిరికి చేరి హర్షధ్వానాలు చేస్తూ ఆసక్తితో చూస్తున్నారు. ఆ సమ…ుంలో ఆకాశం నుంచి జారిపడ్డ జంటమెరుపుల్లాగ ఉన్న ఇద్దరు తరుణులు, ప్రదర్శనశాలకు వచ్చారు.

వారు నిండుగా ధరించిన రత్నా భరణాల కాంతి మిరుమిట్లు గొల్పుతున్నది. జనం వారిని చూసి విస్తుబోతూంటే, పెద్దామె, ‘‘కళానంద నగరం మాది. మాకు నచ్చిన వినా…ుక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకుతిరుగుతున్నాం!'' అంటూ చేతనున్న బంగారు జలతారు అల్లిక సంచిని గలగల్లాడించింది. అక్కడ ఉన్న చిత్రకారులు చరచరా వారివారి విగ్రహాల దగ్గిరికి వెళ్ళి నిల్చున్నారు. ‘‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గా…ునీ మణి.
అంతేకాదు, గొప్ప తిండిపోతు. నైవేద్యపుష్ఠి, విగ్రహపుష్ఠి తర్వాతనే గాత్రపుష్ఠి. బొజ్జపెంచి పాడి చూడు, అనే గా…ుక సిద్ధాంతాలకు తార్కాణం మా అక్క ప్రసన్నవదన!'' అంటూ సుకుమారంగా సమ్మోహనాస్ర్తంలాగున్న చిన్నామె కాలి మువ్వలు ఘల్లుమనిపించింది. ‘‘మా చెల్లి మోహన గొప్ప వాగుడు కా…ు, అంతకంటె గొప్ప నర్తకీమణి! చూడ్డానికి చిన్నారి చిట్టిలాగుందే కాని, నన్నే అవలీలగా ఎత్తి తిప్పేస్తుంది!

అద్భుతమైన అంత శక్తి సామర్థ్యాలున్నాయి ఆ చిన్నదానికి. నృత్యంలో దాని చురుకుదనం చూడశక్యం కాదు!'' అని ప్రసన్న వదన చెప్పింది. ‘‘మా చేత పాడించడం, ఆడించడం, ఆ ఇంద్రుడికీ, కుబేరుడికీ సాధ్యం కాదు. అలాంటి ఆటపాటల్ని, మాకు కావలసిన విగ్రహం ముందు జరుపుతామని మొక్కు కున్నాం!'' అని మోహన చెప్పింది. వారి మాటలకు పరవశించిపోతూన్న జనం మంత్రించినట్లుగా పక్కకు తప్పుకుని విశాలంగా దారి చేశారు.     

No comments:

Post a Comment