Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 18


శతృంజ…ుుడు ఎలుకతో చళుకవర్మను దూరంగా చిన్న ఇంటికి తరిమి, ‘‘నువ్వు, మా మధ్య ఉండవలసినవాడివి కావు. నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు,ఆ వాహ నంజాతిదే నీకు తగ్గ ఇల్లాలు! నీ ఇల్లాలు అసూర్యంపశ్యగా ఎవరికీ కనపడకుండా ఉండే అంతఃపురకాంతగా ఉండడానికి ఇంటి నిండా ఎలుక బిలాలు ఉన్నవిలే!''
 
అంటూ ఎకసక్కెం చేశాడు. చళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, ‘‘తండ్రి, కుమారులందరికీ పెళ్ళిచే…ుడ మనేది చాలా గొప్ప విష…ుం! ఎవరికెవ్వరో అది ఏనాడో రాసిపెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు! అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్ఛ కదా!'' అన్నాడు. చళుకుడు ఉత్తమ గ్రంథాలను చదువుతు న్నప్పుడు చుళుక పక్కనే చేరి వింటూండేది.
 
చళుకుడు విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తూన్నప్పుడు నోటితో చిన్న చిన్న పువ్వులు అందించేది. చళుకుడు తిన్న తర్వాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూండగా వినా…ుకచవితి దగ్గిరికి వచ్చింది. అందరూ ఇళ్ళకు వెల్లవేసి ధాన్యాలు దంచుకొంటున్నారు. చుళుక రాత్రికి రాత్రి ఎలుకలన్నిటినీ పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి.
 
పళ్ళతో పైపొట్టు వొలిచి ధాన్యాన్ని మెరికల్లా బి…్యుం చేశాయి. వినా…ుకచవితి ఉద…ూన చళుకుని వదినలు స్వ…ుంగా నదీతీరానికి వెళ్ళి బంగారు బిందెలతో నదీజలాన్ని నెత్తినెత్తు కొని వస్తున్నారు. అది చూసి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు.

చుళుక వెంటనే బిందెలో దూరి దొర్లించు కుంటూ నదీతీరాన్ని చేరుకుని ఇవతలకి వచ్చి కొండంత బిందెనూ, పొంగిపొర్లి ప్రవహిస్తూన్న నదిని ఒకసారి తేరిపార చూసి ఒక్క క్షణం హతాశురాలై,‘‘బిందెనైతే దొర్లించుకొచ్చాను గాని, నీళ్ళెలా ముంచగ లను? బిందెతో ఎలా మోసుకెళ్ళగలను? అవివేకురాల్ని, పనికి మాలినదాన్ని, నేనెందుకు బ్రతికి?'' అని అనుకుంటూ వేదనతో తలను అక్కడున్న రాతికేసి బలంగా కొట్టుకోసాగింది.
 
విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, ఎలు కను చేతితో ముద్దుగా నిమిరాడు. శాప విమోచనమై ఎలుకరూపు మా…ుమై దేవ కాంత కళ్యాణకింకిణి నిజరూపంతో విఘ్నే శ్వరుడి పాదాలమీద భక్తితో ప్రణమిల్లి, అనేకవిధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు సంతోషించి కళ్యాణకింకిణిని ఆశీర్వదించి అంతర్థానమ…్యూడు. కళ్యాణకింకిణి నీళ్ళ బిందెను తలకెత్తుకొని వ…్యూరంగా నడిచి వెళ్తూంటే, దారి పొడవునా ప్రజలు బొమ్మల్లాగ నిల్చుని చూస్తూ, ‘‘ఎవరీ దేవసుందరి? ఎవరింటికి వెళ్తున్నది?'' అని విస్తుపో…ూరు.
 
చళుకవర్మ వదినలు కళ్యాణకింకిణి తమ చిన్నమరిది ఇంటిలోకి వెళ్ళడం చూసి, ముఖాలు వేలాడదీసుకున్నారు. శతృంజ…ుుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, చళుకవర్మను సతీసమేతంగా రాజ మందిరానికి తోడ్కొని వచ్చాడు. చళుకుని అన్నలు తండ్రితో, ‘‘మాకూ అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చే…ులేదు? అలా చేసిఉంటే మాకూ అప్స రసలే త…ూరై వచ్చి ఉండేవారు కదా!'' అని గద్దించి అడిగారు.
 
ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సర్వశక్తులూ ధారవోసి సామ్రా జ్యాన్ని ఆర్జించిపెట్టింది! అని శతృంజ…ుుడు విరక్తిపొంది తపస్సు చేసుకోడానికి అరణ్యా లకు వెళ్ళిపో…ూడు. చళుకవర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి …ుుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు.
 
ఆ తరవాత కొన్నాళ్ళకు ఎంత వద్దంటున్నా వినక, ప్రజలు చళుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చళుకవర్మ పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించారు. చళుకవర్మ కళ్యాణకింకిణి పేరున కళ్యాణి అనే మరొక గొప్పనగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణకింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు.

వారు చాళుక్యులుగా పిలువ బడ్డారు. ఆ విధంగా చాళుక్యరాజ వంశాలకు మూలపురుషుడైన చళుకవర్మ కాలంలో వాతాపినగరం అనేక దేవాల…ూలతో, ప్రాకా రాలతో శోభిల్లింది. కళలకు కాణాచిగా, విద్వాంసులకు పండితులకు ఆటపట్టుగా, భూతలస్వర్గం అనిపించుకుంది. నగరాధి దేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కృష్టశిల్పానికి ప్రామాణికమైన ఆల…ు మంటపశిల్పాన్ని చూడ్డానికి దేశం నలు మూలల నుంచీ రాజులు మొదలు కొని సామాన్య …ూత్రికుల వరకూ ఎల్లప్పుడూ వస్తూండేవారు.
 
చాళుక్యులు నాలుగు దిక్కులా రాజ్యాలు ఏర్పరుచుకొని పాలించారు. చాళుక్యవంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు ఏలారు. వాతాపినేలినవారు వాతాపిచాళుక్యులనీ, కళ్యాణినగరాన్ని పాలిం చినవారు కళ్యాణిచాళుక్యులనీ, వేంగినేలిన వారు వేంగీచాళుక్యులనీ, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందారు. కాలక్రమాన వాతాపిని బాదామి అని కూడా వ్యవహరించారు.
 
విఘ్నేశ్వర వినోద గాథలు వాతాపిగణపతిగా విఘ్నేశ్వరుడూ, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరమూ దేశాంతరాల పేరు మ్రోగుతున్న కాలంలో, పావనమిశ్రుడు అనే పండితుడు సా…ుంకాలాల్లో వాతాపి గణపతి ఆల…ుమంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెపుతూండేవాడు. మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్తరు వుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్ల వాడు గురువుకు చూపించి ఆ కథ చెప్ప మన్నాడు.
 
పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు: ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త. కాని అతని లోభితనానికీ, అత్యాశకూ ఊళ్ళోవారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్త రోజూ శివాల…ూనికి వెళ్ళేవారు.
 
సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్ళే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకొని వెళ్ళేవాడు. లోభగుప్తుడు గర్భాల…ుం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలిపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూండే వాడు.

ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెళ్తూండగా, లోభగుప్తుడు వస్తూన్న సమ …ుంలో నంది విఘ్నేశ్వరుడితో, ‘‘విఘ్నేశ్వరా! నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు. అతణ్ణి ఆదుకోవలసిన అవసరం లేదా?'' అన్నాడు. ‘‘ఔనోయి, నందీ! తప్పక ఆదుకుంటాను. ఈ సా…ుంకాలానికి అతనికి వెయ్యి వర హాలు అందిస్తున్నాను. సత్యశర్మ ఇంట్లో శుభ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది!'' అని విఘ్నేశ్వరుడు అన్నాడు.
 
రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని, క్షణం ఆలస్యం చే…ుకుండా పరుగు పరు గున సత్యశర్మ ఇంటికి వెళ్ళి, ‘‘శర్మా, నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది. ఐదువందల వరహాలు ఇస్తాను, తీసుకో!'' అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. సత్యశర్మ, ‘‘అ…్యూ గుప్తగారూ! నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చక పోతే ఇల్లు ఖాళీచే…ుమని చెప్పారు. ఈ అయిదువందలూ ఎలాగ తీర్చగలను?'' అన్నాడు. లోభగుప్తుడు, ‘‘అదా నీ సందేహం!
 
ఈ ఐదువందలు తీసుకుని సా…ుంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతయితే అంత నాకు ఇస్తే చాలు!'' అన్నాడు. సత్యశర్మ తటపటాయిస్తూంటే, అతని భార్య, ‘‘ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్ళివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు!''అని ప్రోత్సహించింది. సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుది రింది. వరుడి తల్లీ తండ్రీ అయిదువందల వరహాల విలువచేసే నగలు పిల్లదానికి పెట్టా లని పట్టుబట్టారు.
 
సత్యశర్మ లోభగుప్తుడితో, ‘‘అ…్యూ, సా…ుంకాలానికి నాకు లభించింది ఇవ్వడా నికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాని, అలా లభించే ఆస్కారం ఏదీ లేదు...'' అంటూ నసుగుతూంటే, లోభగుప్తుడు, ‘‘అదంతా వదిలెయ్యి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం! ఇప్పుడు నేనిస్తే తర్వాత నువ్విస్తావు. ఈ మాత్రం దానికి మొహమాటపడకు!''
 
అంటూ ఐదువందల వరహాల మూట సత్య శర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు. సా…ుంత్రం ఔతున్నదికాని సత్యశర్మకు ఏ వరహాలూ అందిన సూచన కనిపించలేదు. లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాల…ూ నికి పరుగెత్తి, విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని లాగుతూ, ‘‘ఏమ…్యూ, విఘ్నేశ్వరా!

సత్యశర్మకు వెయ్యి వరహాలు త్వరగా ఇప్పించు మరి...'' అని అంటూండగా అతని అరచేయి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొప్పితో లోభగుప్తుడు కిరకిరలాడిపో తూంటే, ‘‘సత్యశర్మకు వెయ్యి వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల!'' అని విగ్రహం నుండి గొంతు వినిపించింది. లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తీ నోరూ బాదుకుంటూ, ‘‘అన్యా…ుం దేవుడా, అన్యా …ుం!
 
ఐదు వందలు ముందే ఇస్తిని గదా!'' అని పెడబొబ్బలు పెట్టాడు. ‘‘అదా సంగతి! ఐదువందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునా…ూసంగా అయిదువందల వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట! ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రా…ుశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా ఐదు వందలూ ఇవ్వ డమేగాకుండా, అతడికిచ్చిన రుణాన్ని చెల్లు పెట్టి, అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్ళిలాగ జరిపించు!
 
అప్పుడే నీకు విడుదల!'' అని విఘ్నేశ్వర విగ్రహం నుంచి గంభీర గర్జన వినిపించింది. లోభగుప్తుడు క్షణాలమీద తనవారిని పిలిపించి, సత్యశర్మకు మిగతా ఐదువందల వరహాలూ ఇప్పించి, అతని రుణానికి చెల్లు పెట్టించి, అతని కూతురు పెళ్ళి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చేయి ఇవతలికి వచ్చింది. లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరు ఊరంతా చెప్పుకున్నారు.


లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగ వైభవంగా జరి పించాడు. అప్పట్నించి బుద్ధి తెచ్చుకొని లోభ గుణాన్ని విసర్జించి, అన్యా…ుంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినిెూగించి, విఘ్నే శ్వరుడి ద…ుకు పాత్రుడై, గొప్ప ధార్మికుడని పించుకున్నాడు. కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతాలు కొడుతూ ఇళ్ళకు పరుగెత్తారు.
 
మరొక సా…ుంత్రం ఒక బాలిక మంటపం గోడలపై గల మరో అందమైన చిత్రాన్ని చూపించి కథ చెప్పమన్నది. పావనమిశ్రుడు ప్రారంభించాడు: కళ్యాణినగరంలో కలహకంఠి అనే ధనికు రాలు, కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి పెట్టి, చివరకు నిర్దాక్షణ్యంగా వెళ్ళగొట్టింది. కలకంఠి అని నామకరణం చే…ుబడినప్ప టికీ కలహకంఠిగా పేరుపొందిన ఆ ధనికఅత్త కోడలు సౌదామిని, పుటె్టడు దుఃఖంతో పుట్టిం టికి బ…ులుదేరి దారి తప్పి అరణ్యంలో పడి, ఆకలితో అలమటించిపోతూ ఒక వెలగచెట్టు దగ్గిర పడిపోయింది.
 
తను పుట్టినింటికెళ్ళి కూడా ప్రెూజనం లేదు. తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పులపాల…్యూడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు! అనుకుంటూండగా చెట్టు నుండి ఒక వెలగ పండు రాలి దొర్లుకుంటూ, అందుకోమన్నట్లు ఆమె చేతి దగ్గిర ఆగిపోయింది. దాన్ని పట్టు కొని సౌదామిని లేచికూర్చుంటుండగా భూమి అదిరేలాగ ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచీ విఘ్నేశ్వ రుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది.
 
విఘ్నే శ్వరుణ్ణి తలచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురువెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగ పండును తొండంతో తీసుకొని నోట వేసు కొని, దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి, చేయి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గిరికి తీసుకెళ్ళింది. 

No comments:

Post a Comment