Friday, September 7, 2012

రామాయణం - అరణ్యకాండ 3


పంచవటిలో ఆశ్రమం కల్పించుకుని తమ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు. హేమంత ఋతువు వచ్చింది. ఒకనాటి తెల్లవారుఝామున వారు ముగ్గురూ స్నానం చెయ్యటానికి గోదావరి వద్దకు పోతూ ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకోవటంలో లక్ష్మణుడు భరతుణ్ణి మెచ్చుకుని, అటువంటి వాడికి తల్లి అయికూడా దుర్మార్గురాలయినందుకు కైకేయిని నిందించాడు.
 
రాముడు అడ్డం వచ్చి, ‘‘కైకేయిని తిట్టటం మానేసి భరతుణ్ణి గురించే మాట్లాడు,'' అన్నాడు. తాను భరతలక్ష్మణశత్రుఘు్నలతోనూ సీతతోనూ కలిసి ఎప్పుడు రాజ్యం చేస్తానో గదా అని రాముడు విచారించాడు. వారు ముగ్గురూ గోదావరిలో స్నానాలు చేసి, ఆశ్రమానికి తిరిగి వచ్చి, ఉదయం చేయవలసిన కర్మకాండ అంతా ముగించుకుని పర్ణశాలలో కూచుని ఉండగా అటుగా ఒక రాక్షస స్ర్తీ వచ్చింది. ఆమె రావణుడి చెల్లెలైన శూర్పణఖ.
 
దాని ముఖం వికారం. దాని కొక పెద్ద పొట్టా, ఎరన్రి జుట్టూ, భయంకరమైన గొంతూ ఉన్నాయి. వయసు మళ్ళినది. ఆ అనాకారి రాముణ్ణి చూస్తూనే మోహించింది. ఆమె రాముణ్ణి పలకరిస్తూ, ‘‘వేషం చూడబోతే మునివి. వెంట ఆయుధాలున్నాయి, భార్య ఉన్నది. నువ్వు మా రాక్షసుల దేశానికెలా వచ్చావు?'' అన్నది. రాముడు మంచిగా ఆమెకు తన వృత్తాంతం సీత సంగతి చెప్పి, ‘‘ఇంతకూ నువ్వెవరు? ఎవరి కుమార్తెవు?'' అని అడిగాడు. ‘‘నా పేరు శూర్పణఖ. కామరూపినిని. ఒంటరిగా అరణ్యమంతా తిరుగుతూంటాను.

పంచవటిలో ఆశ్రమం కల్పించుకుని తమ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు. హేమంత ఋతువు వచ్చింది. ఒకనాటి తెల్లవారుఝామున వారు ముగ్గురూ స్నానం చెయ్యటానికి గోదావరి వద్దకు పోతూ ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకోవటంలో లక్ష్మణుడు భరతుణ్ణి మెచ్చుకుని, అటువంటి వాడికి తల్లి అయికూడా దుర్మార్గురాలయినందుకు కైకేయిని నిందించాడు.
 
రాముడు అడ్డం వచ్చి, ‘‘కైకేయిని తిట్టటం మానేసి భరతుణ్ణి గురించే మాట్లాడు,'' అన్నాడు. తాను భరతలక్ష్మణశత్రుఘు్నలతోనూ సీతతోనూ కలిసి ఎప్పుడు రాజ్యం చేస్తానో గదా అని రాముడు విచారించాడు. వారు ముగ్గురూ గోదావరిలో స్నానాలు చేసి, ఆశ్రమానికి తిరిగి వచ్చి, ఉదయం చేయవలసిన కర్మకాండ అంతా ముగించుకుని పర్ణశాలలో కూచుని ఉండగా అటుగా ఒక రాక్షస స్ర్తీ వచ్చింది. ఆమె రావణుడి చెల్లెలైన శూర్పణఖ.
 
దాని ముఖం వికారం. దాని కొక పెద్ద పొట్టా, ఎరన్రి జుట్టూ, భయంకరమైన గొంతూ ఉన్నాయి. వయసు మళ్ళినది. ఆ అనాకారి రాముణ్ణి చూస్తూనే మోహించింది. ఆమె రాముణ్ణి పలకరిస్తూ, ‘‘వేషం చూడబోతే మునివి. వెంట ఆయుధాలున్నాయి, భార్య ఉన్నది. నువ్వు మా రాక్షసుల దేశానికెలా వచ్చావు?'' అన్నది. రాముడు మంచిగా ఆమెకు తన వృత్తాంతం సీత సంగతి చెప్పి, ‘‘ఇంతకూ నువ్వెవరు? ఎవరి కుమార్తెవు?'' అని అడిగాడు. ‘‘నా పేరు శూర్పణఖ. కామరూపినిని. ఒంటరిగా అరణ్యమంతా తిరుగుతూంటాను.

రాముడు లక్ష్మణుడితో, ‘‘దుష్టులతో పరిహాసం ఎంత చెడ్డదో చూశావా? సీతకు అపాయం రాకుండా చూడు. ఈ శూర్పణఖను అంగహీనగా చెయ్యి,'' అన్నాడు. లక్ష్మణుడు వెంటనే రాముడి పక్కనే ఉన్న కత్తి తీసుకుని శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసేశాడు. శూర్పణఖ బాధతో పెద్దపెట్టున అరిచి, తాను వచ్చిన దారినే మహారణ్యంలోపడి పారి పోయింది. జనస్థానంలో ఖరుడు అనేకమంది ఇతర రాక్షసులతో సహా కూచుని ఉన్న చోటికి, రక్తం కారుతూ శూర్పణఖ వచ్చి చేరి నేల మీద పడిపోయింది.
 
నెత్తురు వరదలు కారుతూ వికార రూపంలో తన చెంత వచ్చి పడిన శూర్పణఖను చూసి ఖరుడు, ‘‘నన్ను చూసి మూడు లోకాలవారూ భయపడతారు గదా, నిన్నీవిధంగా చేసి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్న వాడెవడు?'' అని అడిగాడు. శూర్పణఖ అతనితో సీతా రామ లక్ష్మణులను గురించీ, వారు తనకు చేసిన పరాభవం గురించీ చెప్పి, ‘‘నువ్వు వారి ముగ్గురినీ చంపి వారి రక్తం తెప్పిస్తే తాగేస్తాను.
 
ఇదే నా కోరిక,'' అన్నది. ఖరుడు తన అనుచరులలో పధ్నాలుగు మందిని ఏరి, ‘‘మీరు వెళ్ళి, శూర్పణఖ చెప్పే ముగ్గురినీ చంపి, వాళ్ళ రక్తం శూర్పణఖ కివ్వండి,'' అని ఆజ్ఞాపించాడు. వారు పధ్నాలుగురూ శూర్పణఖను వెంట బెట్టుకుని రాముడి పర్ణశాలకు వచ్చారు. శూర్పణఖ సీతా రామ లక్ష్మణులను వారికి చూపి, ‘‘ఆ ముగ్గుర్నీ వెంటనే చంపెయ్యండి,'' అన్నది. వారంతా ఆయుధాలతో సహా రావటం గమనించి రాముడు, లక్ష్మణుడితో, ‘‘వాళ్ళ సంగతి నేను చూస్తాను.
 
నువ్వు సీత వెంట ఉండు,'' అని చెప్పి, రాక్షసుల కెదురు వెళ్ళి, ‘‘మీరంతా ఏమని నా మీదికి దండెత్తి వచ్చారు? ఇక్కడి మునులను రాక్షస బాధ నుంచి కాపాడతానని మాట ఇచ్చి ఈ ధనుర్బాణాలు వెంటపెట్టుకుని ఉన్నాను. నా చేతిలో చావాలని లేనట్టయితే వెంటనే పారిపొండి,'' అని చెప్పాడు. రాక్షసులా మాటలు విని మండిపడి, ‘‘నువ్వు మా దొర అయిన ఖరుడికి కోపం తెప్పించావు. నిన్ను చంపి పోవటానికే వచ్చాం. మేము చాలా మందిమి; నువ్వు ఒక్కడివి.

నీకు చావు తప్పదు,'' అంటూ పధ్నాలుగు మందీ తమ చేతుల్లో ఉన్న శూలాలు రాముడి పైన విసిరారు. రాముడు పధ్నాలుగు బాణాలతో ఆ శూలాలన్నిటినీ ఖండించి, వాటినే మళ్ళీ తీసుకుని వింటితో ఎక్కుపెట్టి పధ్నాలుగు మంది రాక్షసులనూ కొట్టాడు. అందరూ పడిపోయి ప్రాణాలు వదిలారు. ఇది చూసిన శూర్పణఖ కంగారుపడి, పెద్దపెట్టున అరుస్తూ, పరిగెత్తి పోయి మళ్ళీ ఖరుడి సమీపాన కుప్పకూలిపోయింది.
 
ఖరుడామెను చూసి చిరాకు పడుతూ, ‘‘ఇంకా ఎందుకు ఏడ్చి, పొర్లిగింతలు పెడుతున్నావు? ఇప్పుడే గద నీ పని చేసుకు రమ్మని పధ్నాలుగు మంది మెరికలలాటి వాళ్ళను పంపాను? వాళ్ళు అజేయులు. ఇక ఊరడిల్లు!'' అన్నాడు. ‘‘నువ్వు పంపనూ పంపావు, వారంతా ఆ రాముడి చేత చావనూ చచ్చారు. నేను ఏడుస్తున్నానంటే, నాకు భయం ముంచుకొచ్చింది. ఆ రాముడు సామాన్యుడు కాడు.
 
అతనూ, లక్ష్మణుడూ మహా పరాక్రమవంతులు. నా పగా, చచ్చినవాళ్ళ పగా తీర్చదలిస్తే నువ్వే వచ్చి ఆ రాముణ్ణి చంపు. ఆ పని చెయ్యకపొయ్యూవో నీ శూరత్వం కేవలం దంభమే; అసలు నువ్వీ జనస్థానంలో ఉండటానికి కూడా అర్హుడవు కావన్న మాట. ఎందుకంటే ఎప్పటికైనా ఆ రాముడు వచ్చి నీ ప్రాణాలు తీసితీరుతాడు. కాదు, రాముడంతటి బలం నీకూ ఉన్నదంటావా, వెంటనే వచ్చి వాణ్ణి చంపు.
 
చంపలేకపోతే వాడి చేతిలో చావనన్నా చావు!'' అంటూ శూర్పణఖ భోరున ఏడ్చింది. శూర్పణఖ అందరు రాక్షసుల మధ్య తనను ఇలా అవమానించే సరికి ఖరుడికి పౌరుషం వచ్చింది. ‘‘రాముడి పరాక్రమం నేను లెక్కచేస్తానా? నీకు జరిగిన అవమానం తలుచుకుంటే నాకు పట్టరాని కోపం వచ్చేస్తున్నది. ఆ రాముణ్ణీ, లక్ష్మణుణ్ణీ నేనే స్వయంగా నరికేస్తాను. నువ్వు వారి రక్తం తాగు,'' అన్నాడు ఖరుడు.
 
ఖరుడి వద్ద పధ్నాలుగు వేల మందితో కూడిన రాక్షస సేన ఉన్నది. దానికి నాయకుడు దూషణుడు. దూషణుడు ఆ సేనను ఆయత్త పరిచాడు. ఖరుడు రథమెక్కి, సేనతో సహా అట్టహాసంగా రాముడిపైకి యుద్ధానికి బయలుదేరాడు. ఖరుడి వెంట పన్నెండు మంది రాక్షస ప్రముఖులూ, దూషణుడి వెంట మరి నలుగురు సేనాపతులూ ఉన్నారు.

తన పైకి ఒక పెద్ద రాక్షససేన వస్తున్నట్టు గ్రహించి, రాముడు సీతను లక్ష్మణుడి వెంట ఒక రహస్యమైన గుహకు పంపాడు. వారు వెళ్ళాక రాముడు దృఢమైన తన కవచం ధరించి విల్లంబులతో రాక్షసుల రాకను ఎదురుచూడసాగాడు. ఇంతలో కోలాహలంగా అరుస్తూ, భేరులు మోగిస్తూ, అరణ్యమంతా మారుమోతలు వస్తూండగా, రాక్షస సైన్యం రానే వచ్చింది. రాముడికి ఎటు చూసినా రాక్షసులు కాన వచ్చారు.
 
ఖరుడి రథం రాముడి వద్దకు, పర్ణశాల సమీపానికి వచ్చింది. రాక్షసులు రాముడి మీద బాణవర్షం కురిపించారు. వాటిలో కొన్నిటిని రాముడు తన బాణాలతో కొట్టేశాడు. కాని రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు కొన్ని రాముణ్ణి గాయపరిచాయి. అయినా అతను పర్వతంలాగా ఏమాత్రం చలించక నిలబడ్డాడు. అయితే, రాముడు ప్రయోగించిన తీవ్రమైన బాణాలకు రాక్షసులు చావనారంభించారు.
 
అనేకమంది రాక్షసులు రాముడి చేత చావగా కొందరు భయపడి ఖరుణ్ణి శరణు జొచ్చారు. దూషణుడు వారికి ధైర్యం చెప్పి తాను రాముడి పైకి వచ్చాడు. అలా వచ్చిన దూషణుడి పైనా, అతని వెంట వచ్చిన రాక్షసుల పైనా రాముడు గాంధర్వాస్ర్తం ప్రయోగించాడు. వేలకు వేలు బాణాలు వచ్చి రాక్షసులకు తగిలి వారి ప్రాణాలు హరించాయి. రాముడికీ దూషణుడికీ యుద్ధమయింది.

ఈ యుద్ధంలో రాముడు దూషణుడి సారథినీ, గుర్రాలనూ, చివరకు దూషణుడి రెండు చేతులనూ బాణాలతో నరికేశాడు; దూషణుడి వెంట వచ్చిన అయిదు వేల మంది రాక్షసులనూ చంపేశాడు. క్రమంగా రాముడు, తాను ఒంటరిగాడై ఉండికూడా, పధ్నాలుగు వేల మంది రాక్షసులనూ చంపేశాడు. వారిలో ఖరుడూ, త్రిశిరుడనేవాడూ మాత్రమే మిగిలారు. ఖరుడి ఆగ్రహానికి అంతు లేదు.
 
అతడు రాముడి పైకి పోతూండటం చూసి త్రిశిరుడు అడ్డుపడి, ‘‘రాముణ్ణి నేను చంపుతాను. నువ్వు చూస్తూ ఉండు. ఒకవేళ రాముడే నన్ను చంపితే తరవాత నువ్వు అతన్ని చంపవచ్చు,'' అని బతిమాలాడు. ఖరుడు సరేనన్నాడు. త్రిశిరుడికీ రాముడికీ చాలాసేపు భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో త్రిశిరుడు తన గుర్రాలనూ, సారథినీ, ధ్వజాన్నీ పోగొట్టుకుని, రొమ్మున బాణాలు తగిలి మూర్ఛపోయూడు.
 
ఆ స్థితిలో రాముడు మూడు బాణాలు వేసి త్రిశిరుడి తల నరికేశాడు. తరవాత రాముడికి ఖరుడితో యుద్ధం జరిగింది. ఖరుడు రాముడి చేతి బాణాన్ని విరగగొట్టటమే గాక, అతని కవచాన్ని ముక్కలు ముక్కలు చేసి, తన బాణాలతో ఛేదించాడు. రాముడు నిలువునా రక్తం కారుతూ, అగస్త్యుడిచ్చిన విల్లు తీసుకుని భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుణ్ణి విరధుణ్ణి చేశాడు. ఖరుడు తన గదను రాముడి పైకి విసిరివేశాడు. అది రాముడి బాణాలతో తుత్తునియలు కాగా, సమీపంలో ఉన్న చెట్టును పెరికి, దాన్ని రాముడిపై వేశాడు.
 
రాముడు దాన్ని కూడా తన బాణాలతో ఖండించి, ఖరుణ్ణి ఒక్క క్షణంలో చంపేశాడు. రాముడిలా ఖర దూషణులనూ, పధ్నాలుగు వేల మంది రాక్షసులనూ చంపెయ్యటంతో దండకారణ్యానికి రాక్షస భయం తీరిపోయింది. యుద్ధం అయిపోయినట్టు గ్రహించి, సీత గుహలో నుంచి బయటికి వచ్చి, రాముణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషం పొందింది.

No comments:

Post a Comment