Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 16


వాతాపినగర మధ్యంలో ఉన్న మహాశిల విఘ్నే శ్వర శిల్పంగా రూపొందాలనే కోరిక అగస్త్యుడికి మిగిలిపోయింది. లోపాముద్ర చిత్రకళా ప్రవీణురాలు. ఆమె అక్కడకు వచ్చి మహా శిలను జాగ్రత్తగా పరిశీలించి చూసి, అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశుని రూపరేఖా చిత్తరువును అప్పటికప్పుడే త…ూరు చేసింది. రేఖాచిత్రమైతే త…ూరైందిగాని, ఆ ప్రకా రంగా మహాశిలను మలచగల శిల్పులు, శిల్పా చార్యులు ఎంత ప్ర…ుత్నించినా లభించ లేదు.
 
అగస్త్యుడు చింతాక్రాంతుడై ఎల్లప్పుడూ మహాశిల ఎదురుగా కూర్చొని, చిత్రపటాన్నీ, శిలనూ పదే పదే చూసుకుంటూ కాలంగడుపు తున్నాడు. వచ్చిన శిల్పాచార్యులందరూ చిత్రం చూసి, ‘‘ఇలాంటి శిల్పం మలచటం దేవశిల్పి విశ్వ కర్మకో, దానవశిల్పి మ…ుుడికో తప్ప ఇతరు లకు ఏమాత్రం సాధ్యం కాదు!'' అంటూ వెనక్కు జంకారు. శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షంచి, ‘‘ఇది వజ్రపాషాణం.
 
దీన్ని చెక్కడా నికి మామూలు ఉలి అసలు పనికేరాదు. అందుకు ప్రత్యేకమైన వజ్రపు ఉలులుండాలి. దేవతలో, …ుక్షులో వచ్చి చెక్కవలసిందే కాని, మానవమాత్రుల తరం కాదు!'' అంటూ చెప్పారు. ఆ సమ…ుంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణు మానసపుత్రిక విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నది. దాంతో విశ్వకర్మ మతిస్థిరం పోగొట్టుకున్నాడు. దానవశిల్పి మ…ుుడు అతని అప్సర భార్య హేమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా, భరించరాని బెంగతో పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు.

విశ్వకర్మనో, మ…ుుణ్ణో పిలుద్దామన్నా వారి స్థితి అంత అధ్వాన్నంగా ఉంది. అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్ర హంగా రూపొందించడం సమస్యగా నిలిచి పోయింది. నిద్రాహారాలు మాని అతడు శిలకెదురుగా అలాగే దివారాత్రాలు కూర్చొని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ, ‘‘గణపతీ! నా కోరిక కోరికగానే ఉంచేశావు, ఇక నీదే భారం!'' అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షంచ సాగాడు.
 
ఒకనాటి సంధ్యాసమ…ుంలో దోరపు బొజ్జ ఊపుకుంటూ గుజ్జుగా ఉన్న ఒక బాల ప్రా…ుంవాడు అటు వస్తున్నాడు. అతని చేతిలో ఏదో ఉలిలాంటిది పిడితో ధగధగా మెరుస్తున్నది. కండలు తేరి ఉన్నాడు, శిల్పి లాగ కనిపించాడు. అగస్త్యుడు ఆశగా అతని చేతనున్న దాన్ని బాగా పరికించి చూడగా, అది ఏనుగుదంతం కొనముక్క పిడిలో బిగించినట్టుగా తెలుసు కుని ఆశ్చర్యపో…ూడు.
 
ఆ తరుణశిల్పి, అగస్త్యుణ్ణి సమీపించి, ‘‘ఏమిటో మహర్షులవారు మహాశిల ముందు మంతనాలాడుతూ కూర్చున్నారు. ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగు తున్నాను!'' అన్నాడు. అతని మాటలు అమిత మధురంగా అగస్త్యుడికి అనిర్వచనీ…ుమైన పారవశ్యాన్ని కలిగించాయి. ‘‘చిరంజీవీ! ఈ మహాశిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్విళ్ళూరుతున్నాను,'' అంటూ తన దగ్గ రున్న రేఖాచిత్రాన్ని ఆతృతగా శిల్పికి చూపించి, ‘‘ఇంతకూ నువ్వెవరు? ఏం పని చేస్తావు?'' అని అడిగాడు. ‘‘నేను చేసే పనుల్లో మొదటిది పుష్ఠిగా తినడం, తర్వాత శిల్పం చెక్కటం.
 
నన్ను బాల శిల్పాచార్యుడు అని పిలుస్తూంటారు!'' అని బాలశిల్పి చెప్పాడు. అగస్త్యుడికి అతడి మాటలతీరు మేను పులకరించే నవ్వు పుట్టించాయి. ఆ…ున అతణ్ణి సందేహంగా చూస్తూ, ‘‘మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం ఇక్కడ పడిగాపులు పడిఉన్నాను. నువ్వు శిల్పినంటున్నావు గాని, బాలశిల్పివి.
 
అలాంట ప్పుడు, మహాశిల్పాన్ని మలచగలవా అని నిన్ను ఏమని అడగ్గలను!'' అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. బాలశిల్పి నవ్వి, ‘‘బాలశిల్పినైనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు! మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు.

మన ఉలికి సాధ్యంకానిదేదీ లేదు!'' అంటూ ఉలిని తీసి చూపించాడు. అది ధగధగా వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతున్నది. అగస్త్యుడు చూస్తూండగా బాలశిల్పి దంతం ఉలిని మహాశిల మీదకి విసిరాడు. ఉలి మొన తాకిడితో పెద్ద మెరుపు, కాంతి, ఉరిమిన శబ్దమూ వెలువడ్డాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది. ‘‘అది నాభిస్థానము.
 
మూర్తి శిల్పానికి నాభిస్థానము చాలాముఖ్యమైనది; అందునా లంబోదరుడి నాభి! లంబోదరంతో శిల్పం ప్రారంభమవుతున్నదన్న మాట!'' అని బాల శిల్పి చెప్తూంటే, రాతి నుండి ‘లంబోదర లక్ష్మీ కరా...' అంటూ మాళవరాగంలో సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది. ‘‘ఇది అ…ుస్కాంత రాయి! చెక్కుతున్న ప్పడు ప్రచండమైన విద్యుత్తు వెలువడుతుంది. గనక శిల్పం చెక్కడం పూరే్త్యువరకూ, ఈ చుట్టుపక్కల పిట్ట మనిషి ఉండకూడదు.
 
గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగరవాసులు భ…ుపడి కంగారుపడనవసరం లేదు. ఓ మహర్షీ, ఇక నీవు వెళ్ళవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్ర తీయి. తెల్లవారుఝాముకి శిల్పం పూర్త వుతుంది!'' అని చెప్పాడు బాలశిల్పి. అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడేగాని, అంతకు మించి మరేమీ అతనికి తోచలేదు. అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది! కొంచెం తేరుకొని అగస్త్యుడు రేఖాచిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతుంటే, ‘‘ఇదివరకే చూపిం చావుగా, ఒక్కసారి చూస్తే చాలు.
 
పదే పదే చూసు కుంటూ చెక్కేరకం మహాశిల్పిని కాను, శిల్పం ఒక ఆటలాగ చెక్కుకొనే కేవలం బాలశిల్పిని! అంతా అ…్యూక అంత అద్భుతంగా చిత్రం గీచినవారిని వచ్చి చూసుకోమను, సరిగ్గా ఉందో లేదో! చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో గాని, నాకేమాత్రం ప్రతిఫలం ముట్టజెపుతావో చూడాలి!'' అని బాలశిల్పి అన్నాడు. చివరి మాటలు అగస్త్యుడికి దిగులు పుట్టించాయి. తన భార్య లోపాముద్ర కోరికమేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన అధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెటే్టశాడు.
 
శిల్పికి పారి తోషికంగా ఉన్న ఆ కొద్దిపాటి ధనమూ ఇచ్చి వే…ుక తప్పదు. లోపాముద్రకు ఏమని నచ్చ చెప్పడం? ఎలా అనడం? అలా అనుకుంటూ అగస్త్యుడు తిన్నగా ఇంటికి వెళ్ళాడు. అప్పుడు లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలాగ వెలిగిపోతున్నది. ఏమిటి సంగతి? అన్నట్లు భార్యవంక చూశాడు.

లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో, ‘‘అగస్త్యులవారు నన్ను మన్నించాలి! ఋషి పత్ని ఋషిపత్నిలాగే ఉండాలనీ, అదే ధర్మ మనీ నాకు తొలుత నుండీ తెలిసినదే. నగలు, మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకు రమ్మని నేను ఎందుకన్నానో, నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. ఏదో ఒక మహత్కార్యం నెర వేరడానికి అనిర్వచనీ…ుమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తున్నది. నాకు ఏ ఆభరణాలూ వద్దు. ఏ పట్టుచీరలూ వద్దు.
 
ఏ ధనసేకరణా వద్దు! నాలో అప్పుడు తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పు డిప్పుడే తొలగిపోయింది!'' అని అన్నది. ఆమె మాటలకు అగస్త్యుడు లోలోపల సంతసించాడు. ‘‘శిల్పి కుదిరాడు. శిల్పం త…ూరౌతు న్నటే్ల. తెల్లవారేసరికి పూర్తి అవుతుందట!'' అన్నాడు ఋషి. ‘‘ఏమిటేమిటీ! తెల్లారేసరికి ఆ మహాశిల, శిల్పం అవుతుందా? ఆ శిల్పి మానవుడా, దేవుడా?''అన్నది లోపాముద్ర. ‘‘మానవమాత్రుడే, బాలుడు కూడా.
 
పని పూర్తిచేశాక ప్రతిఫలం ఎలా ఇవ్వాలో, ఎంతి వ్వాలో ఏమీ తోచకుండా ఉంది,'' అన్నాడు అగస్త్యుడు. ‘‘నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా, అది చాలదా?''అన్నది లోపాముద్ర. ‘‘సరే, తెల్లవారాక ఏదో ఒకలాగ సరిపెట్ట వచ్చు,'' అన్నాడు అగస్త్యుడు. ‘‘అన్నట్టు, రేపు భాద్రపద శుద్ధచతుర్థి, వినా…ుకచవితి రోజు!
 
శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు, తిథులు మరిచినట్లున్నారు,'' అన్నది లోపాముద్ర. ‘‘ఏమిటీ! రేపు వినా…ుకచవితి, విఘ్నే శ్వర శిల్పం త…ూరవడం! చిత్రంగా ఉందే!'' అంటూ అగస్త్యుడు ఆశ్చర్యపడుతూంటే, లోపాముద్ర, ‘‘ఆ శిల్పి బాలుడూ కాడు, మానవమాత్రుడూ కాడు!'' అన్నది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది, అగస్త్యుడికి. చాలా రాత్ర యింది, నిద్ర పట్టలేదు, కుతూహలం పెరి గింది, ఏం జరుగుతున్నదో చూడాలని అగ స్త్యుడు బ…ులుదేరాడు.
 
అగస్త్యుడు మహాశిల సమీపాన్ని చేరేసరికి కనిపించిన దృశ్యానికి అతని ఒళ్ళు జలదరిం చింది. అలాగే అక్కడ చతికిలబడిపో…ూడు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నవి. రంగు రంగుల విద్యుత్కాం తులు మిరుమిట్లు గొల్పుతున్నవి. ఖణఖణ ధ్వనులతో హోరుమంటూ శబ్దం వెలువడు తున్నది.

ఉలులన్నీ ఏనుగుదంతం కొనముక్క ల్లాగ వజ్రాల్లా మెరిసిపోతున్నవి.అది స్వప్నమో నిజమో తెలి…ుని విభ్రాంతిలో మైకం కమ్మి, అగస్త్యుడు అలాగే సొమ్మసిల్లి నిద్రలో పడి పో…ూడు. అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు కొద్దికొద్దిగా తెల్లనవు తున్నది. ‘‘ఏమిటి, మహర్షీ! ఇక్కడ ఇలా నిద్రిస్తూ కలగంటున్నావు? ెూగవిద్యాపారంగతుడ వైన నీకు ఈ కలల నిద్ర ఏమిటి! శిల్పం పూర్త యింది.
 
చిత్రం గీచినవారిని వచ్చి చూసుకో మను; చిత్రించినదంతా సరిగ్గా శిల్పరూపం పొందిందో లేదో!'' అని చిన్నగా నవ్వుతూ బాలశిల్పి అంటూండగా, పళ్ళెరం నిండా కుడుములూ, జలమూ, పూలూ పట్టుకొని లోపాముద్ర అక్కడికి వచ్చింది. అగస్త్యుడు సంభ్రమాశ్చర్యాలతో స్ఫటి కంలాగ మెరిసిపోతూన్న విఘ్నేశ్వర మహా శిల్పాన్ని చూస్తూండగా, బాలశిల్పి అతనితో, ‘‘నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి,'' అన్నాడు.
 
అగస్త్యుడు మాట తడబడుతూ, ‘‘మహా శిల్పీ! నీకు ఏమిచ్చినా చాలదు. అయినా చంద్రుడికోనూలుపోగన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను. కొంచెం ఆగు. ఇప్పుడే వెళ్ళి తెస్తాను!'' అన్నాడు. బాలశిల్పి, ‘‘సరే, ఇంతకూ రేఖాచిత్ర రచన చేసినందుకు ఏమిచ్చావో అది చెప్పు ముందు? శిల్పం చెక్కడం శ్రమ మాత్రమేగాని అసలు గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన అత్యద్భుత రేఖాచిత్రానిదే.

 చిత్రణ ఊహా సంపన్నమైన మేధస్సుతో కూడిన అద్భుత కళ!'' అన్నాడు. ‘‘అ…్యూ, బాలశిల్పాచార్యా! చిత్రించిన వారికి వేరే ఏమీ ఇవ్వనవసరం లేదు. ఆ చిత్రం త…ూరుచేసినది నా భార్యే!'' అంటూ లోపా ముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర ఏదో తన్మ…ూవస్థలో మునిగి ఉన్నది. ‘‘ఏమిమాట మహర్షీ! నేనే అయితే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని చిత్రణకు ఇచ్చి ఉందును, అంత గొప్ప రేఖా చిత్రమది!
 
ఆ ధనం ఆ…ుమ్మకే చెందు తుంది!'' అన్నాడు బాలశిల్పి. అగస్త్యుడు, ‘‘అసలు ఆ ధనాన్ని కొన్నాళ్ళ క్రితం ఆమెకోసమనే తీసి ఉంచాను!'' అని నోరుజారి అన్నాడు. బాలశిల్పి ఆశ్చర్యంగా, ‘‘ఏమిటీ! ఇంతకూ అది స్ర్తీధనమన్నమాట! చెప్పావుగనక సరి పోయింది. నువ్విచ్చినా, నేను పుచ్చుకున్నా ఎంత అన్యా…ుం మూటగట్టుకొనేవారమో కదా! అందులోది చిల్లిగవ్వకూడ నాకు అఖ్ఖర లేదు,'' అంటూ లోపాముద్ర వంక చూసి, ‘‘అమ్మా, నీ చేత్తో ఒక్క బిళ్ళకుడుము నాకు పెట్టు. నాకదే చాలు!
 
చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ, శిల్పుల నుదుట ఎప్పుడో రాసిపెటే్టశాడు!'' అని అన్నాడు. ఆ మాటలు వినడంతోనే లోపాముద్ర కుడుముల పళ్ళెరాన్ని అతని ముందు పెట్టి, సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని, ‘‘విఘ్నేశా! నీ అనుగ్రహంతో, మా జన్మలు తరించాయి!'' అన్నది. బాలశిల్పి అదృశ్యమ…్యూడు. అగస్త్యుణ్ణి ఆవరించిన మా…ు విడిపో యింది. విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి, ‘‘విఘ్నేశ్వరా!
 
నేనెంతో గొప్ప ెూగబలం గలవాడిననీ, తపశ్శాలిననీ గర్వ పడుతూండేవాడిని. కాని, నీ ముందు వఠ్ఠి అజ్ఞానినైపో…ూను. ఎంతటివాడైనా, నీ మా…ుకు అతీతుడు కాడు!'' అంటూ నమ స్కారాలు చేస్తూ లెంపలేసుకుంటూంటే, శిల్పంలోని దేవతావిగ్రహాలన్నీ పాడుతూ న్నట్లుగా, ‘వాతాపిగణపతి భజేహం!...' అనే కీర్తన హంసధ్వని రాగంలో మారుమ్రోగుతూ 

No comments:

Post a Comment