Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు -13


కృష్ణుడి మాటలకు పెద్దగా నవ్వి, మృదంగ కేసరి, ‘‘అలాగని తప్పించుకోబోతున్నావా? వీల్లేదు! నీ మురళీగానం గొప్పదో, నా మృదంగ వాయిద్యం గొప్పదో ఇక్కడే, ఇప్పుడే తేలిపోవాలి!'' అన్నాడు. కృష్ణుడు గడగడలాడుతూ, ఊదడానికి మురళీ తీశాడు. మృదంగకేసరి మఠం వేసి మద్దెల వాయించ మొదలు పెట్టాడు.
 
కృష్ణుడు …ుమునా కళ్యాణి రాగాన్ని వాయిస్తూ, మృదంగకేసరిని తికమకపెట్టి ఠక్కున హంసధ్వని రాగాన్ని అందుకొని అద్భుతంగా వాయిస్తూంటే, మృదంగకేసరి పరవశించి మైమరిచి మద్దెల విడిచి నృత్యం చే…ుడం మొదలుపెట్టాడు. కృష్ణుడు హంసధ్వని రాగాన్ని చిత్ర విచిత్ర గతులతో స్వరాలు మరింత దురితంలో పలికిస్తూంటే, మృదంగకేసరి రూపు విడిచి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడై తొండమెత్తి, బొజ్జ ఊపుకొంటూ అమితోత్సాహంతో ఆనంద తాండవం చేశాడు.
 
మద్దెల మా…ుమై ఎలుక గంతులు వేసింది. విఘ్నేశ్వరుడు తనకు ప్రి…ుతమమైన హంసధ్వని రాగానికి పులకరించిపోతూ, తాండ వంచేస్తూ, అలసిపోతూంటే కృష్ణుడు ఠక్కున మురళి వాయించటం ఆపి, ముందుకు పోయి విఘ్నేశ్వరుడు పడిపోకుండా ఒడిసి పట్టు కొని,‘‘పార్వతీనందనా!
 
మళ్లీ బోర్లాపడ్డా వంటే, మీ అమ్మ మురళీగానాన్ని వినకూడ దని శపించి పోతుందేమోనన్న భ…ుంతో, నిన్ను కింద పడిపోకుండా పట్టుకున్నాను. మరేం అనుకోకు, లంబోదరా!'' అన్నాడు చిన్నగా నవ్వుతూ.

విఘ్నేశ్వరుడు,‘‘కృష్ణా,నీ మురళీగానాన్ని వినాలనే ఇలా వచ్చాను. మన కృష్ణవినా…ు కీ…ుం నిజంగా సుందరకాండే!'' అన్నాడు అమితానందంతో. కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ‘‘విఘ్నేశా! పాపం, నీ వాహనం మద్దెలదరువులు బాగా తిన్నదే!'' అని అంటూ ఎలుకను ముద్దుగా నిమిరాడు.
 
విఘ్నేశ్వరుడు, ‘‘కృష్ణా! కంసుడికి అంత్య కాలం సమీపించింది. ధనుర్యాగం సాకుతో నిన్ను తీసుకురమ్మని, అక్రూరుణ్ణి పంపు తాడు, వెళ్ళు! విజెూస్తు!'' అని చెప్పాడు. కృష్ణుడు, ‘‘అంతా నీ ద…ు, స్వామీ!'' అని చేతులు మోడ్చి మ్రొక్కాడు. విఘ్నేశ్వరుడు, ‘‘అవతారమూర్తివి! నా ద…ుకాదు, నీ లీల! అన్నట్టు అర్క కుబ్జ రూపంతో నీ కోసం ఎదురు చూస్తూంటుంది, అనుగ్రహించు!'' అని చెప్పి ఎలుక వాహనం ఎక్కి, ఆకాశానికి రివ్వున వెళ్ళి అంతర్థాన మ…్యూడు.
 
మరికొన్నాళ్ళకు అక్రూరుడు వచ్చి కృష్ణ బలరాములను మధురాపురానికి రథం మీద తీసుకువెళ్ళాడు. అష్టవంకరలతో ఉన్న కుబ్జ కృష్ణుడికి ఎదురొచ్చి, పాదాలకు మ్రొక్కి చందనం పూసింది. కృష్ణ బలరాములకు పూలమాలలు వేసింది. కృష్ణుడు ఆప్యా…ుంగా కుబ్జను రెండు చేతులతో లేవనెత్తాడు. కుబ్జరూపం పోయి అప్సరసరూపంతో అర్క దేవలోకం చేరుకుంది. కంసుడు తనను చంపాలని చేసిన రక రకాల కపటోపా…ూలన్నిటినీ చిత్తుచేసి, కృష్ణుడు, కంసుణ్ణి పట్టుకుని సింహాసనం నుంచి ఈడ్చి లాగి కింద పడతోశాడు.
 
కంసుడు మరణించాడు. దేవకీ వసుదేవులను కారాగార విముక్తు లనుచేసి, కృష్ణుడు ఉగ్రసేనుడిని కూడా కారాగారం నుండి విడిపించి, అతని సింహా సనం అతని పరం చేశాడు. కృష్ణబలరాములు పెద్దవాళ్ళ…్యూరు. కృష్ణుడు అనేకమంది దుర్మార్గులను, రాక్షసు లను నిర్మూలించాడు.
 
సముద్రంలోకి చొచ్చు కొని దుర్భేద్యంగా ఉండేలాగ ద్వారకా నగ రాన్ని నిర్మాణం చేయించి, అన్న బలరాముణ్ణి …ూదవులకు పెద్దగా చేసి రాజరికాన్ని నెల కొల్పాడు. కృష్ణుడు రుక్మిణిని తెచ్చుకొని వివాహం చేసుకొన్నాడు. సర్వసంపదలతో తులతూగుతున్నా, కృష్ణుడు ఎప్పటివలెనే ఆవులను కాస్తూ, పాలు పితుకుతూ గోపాలకృష్ణుడుగానే ద్వారకలో ఉంటున్నాడు.

ద్వారకానగరం పక్కనే సత్రాజిత్తు అనే ప్రముఖుడు రాజువలె సంస్థానం ఏర్పరచు కొని భోగభాగ్యాలతో తులతూగుతున్నాడు. తాను సూర్యవంశ క్షత్రి…ుుడనని సగర్వంగా చెప్పుకుంటూ, సూర్యోపాసకుడై గొప్ప తపస్సు చేశాడు. సూర్యుడు ప్రసన్నుడై శమంతకమణి అనే పెద్ద వజ్రాన్ని అతనికి ప్రసాదించాడు. శమంతకమణి నుండి వెలువడే అద్భుతమైన కాంతికిరణాలు బంగారు కణికలై ప్రతిరోజూ అతనికి అంతులేని బంగారం సమకూరు తూండేది.
 
సత్రాజిత్తు ప్రముఖులనిపించుకుంటున్న వారికి ఆహ్వానాలు పంపి మరీ వచ్చిన వారంద రికీ మణిని చూపించి, మణి ప్రభావాన్ని వర్ణిస్తూ మురిసిపోతూండేవాడు. కృష్ణుడికి కూడా ఆహ్వానం పంపించాడుగాని కృష్ణుడు రాలేదు. ఎప్పుడో వీలుచూసుకొని వస్తానని తిరుగుకబురు పంపించాడు. ఆ కారణంగా గరి్విష్టి అయిన సత్రాజిత్తు కృష్ణుడిపై ద్వేషం పెట్టుకున్నాడు. కృష్ణుడి గురించి ఎన్నో విశే షాలు విన్నా, ఒక …ూదవ ప్రముఖుడిగా తప్పితే కృష్ణుడిపై అతనికి పెద్ద అభిప్రా…ుం ఏర్పడలేదు.
 
సత్రాజిత్తుకు సత్యభామ అనే అసమాన సౌందర్యవతిెున కుమార్తె ఉన్నది. శమం తకమణితోబాటు సత్యభామ సౌందర్యం కూడా విఖ్యాతికెక్కింది. జరాసంధుడిలాంటి రాజాధిరాజులు సైతం సత్యభామను చేబట్టా లని కాచుకొని ఉన్నారు. సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తి విశ్వాసాలున్నవి. ఆమె ప్రతి వినా…ుక చవితికీ విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి కృష్ణుణ్ణి తన అధీనుడిగా చే…ువలెనని కోరు కుంటూండేది.
 
కృష్ణుడు ఆ దారిన వచ్చినప్పు డల్లా సౌధాగ్రం మీద నిల్చుని చూసి చూసి, ఒకసారైనా అతడు తల పైకెత్తి తన్ను చూడలేదు కదా అని నిరాశతో విఘ్నేశ్వరుడి మ్రోల మోక రిల్లి, తన ఆశ ఫలింపజే…ుమని మరీ మరీ ధ్యానిస్తూండేది. సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలి…ునటే్ట ఉండేవాడు.
 
ఒకనాడు సత్యభామ విఘ్నేశ్వరుడి ముందు భక్తితో మోకరిల్లి ఉండగా చూసి, ‘‘ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడి అనుగ్రహం మనపై ఉండగా, ఇలాంటి మ్రొక్కుబడులు దేనికమ్మా?'' అన్నాడు. సత్యభామ చివాలున లేచి, ‘‘అలా అన కూడదు, నాన్నా! మనోవాంఛితాన్ని సఫలం చే…ుగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే!'' అన్నది.

‘‘ఏమిటి నీ మనోవాంఛితం? రుక్మిణితో పాలుపంచుకోవడమేనా?''అన్నాడు సత్రాజిత్తు కాస్త మందలింపుగా. ‘‘పాలు పంచుకోవడమేమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకొంటాను!'' అన్నది సత్యభామ. సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రా జిత్తుకు తెలి…ునిది కాదు; అయినా వఠ్ఠి బేల అని తనకు తాను సరిపెట్టుకొంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. మర్నాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరికి వచ్చాడు.
 
రాకరాక తమ గృహానికి వచ్చిన కృష్ణుడి కళ్ళ పడాలని సత్య తెగ సంబర పడుతూ ముస్తాబు సవరించుకొని సభా మందిరానికి వెళ్ళేసరికి కృష్ణుడు అప్పుడే వెళ్ళిపో…ూడు. సత్రాజిత్తు శమంతకమణిని గుప్పెట్లో భద్రంగా పట్టుకొని ఉగ్రంగా కృష్ణుడు వెళ్ళిన వేపే చూస్తూ ఎంతో దిగులుగా నిల్చున్నాడు. సత్యభామ తండ్రితో, ‘‘ఏమిటి నాన్నా అలాగ ఉన్నారు? వచ్చిన మహానుభావుడు నీ కుమార్తెనైన నన్ను తనకు ఇమ్మని అడగ లేదుగద!'' అన్నది.
 
‘‘అలా అడిగినా నేనంతగా పట్టించుకోను గాని, ఏమడిగాడో తెలుసా? శమంతకమణిని ఇమ్మన్నాడు. తనలాంటివాడి దగ్గిర ఉంటే, ప్రజలందరి శ్రే…ుస్సుకీ ఎన్నోవిధాల ఉప ెూగపడుతుందని కూడా అన్నాడు!'' అని సత్రాజిత్తు చెప్పాడు. సత్యభామ చిరుకోపంతో, ‘‘ఇంతకూ, నా కంటే శమంతకమణే నీకు ఎక్కువైనది కదూ?'' అంటూ చరచర వెళ్ళబోతూంటే సత్రాజిత్తు ఆమెను ఆపి బుజ్జగింపుగా, ‘‘అలా అనుకో వద్దమ్మా!
 
ఆ కృష్ణుడి పేరాసకు విస్తుబోతు న్నాను, అంతే!'' అంటూ నసిగాడు. ‘‘అతడు మణి ఇచ్చే బంగారాన్ని తనవద్దే దాచుకుంటానని అనలేదు గదా, అతనిది పేరాస ఎలా అవుతుంది, నాన్నా? కృష్ణు డంతటి వాడు అడిగినప్పుడు సంతోషంతో ఇచ్చి వేస్తే ఎంత బాగుండేది, నాన్నా!'' అన్నది సత్యభామ.
 
సత్రాజిత్తు కంపించిపోతూ,‘‘ఇవ్వను, ప్రాణా లతో ఉండగా నా దగ్గిర్నుంచి మణిని ఎవ్వరూ తీసుకోలేరు! మణి నా ప్రాణం, నా సర్వస్వం!'' అంటూ ఆగ్రహంతో గట్టిగా అరిచాడు. సత్యభామ ముఖం జేవురించుకొని, ‘‘ఔను! మణి నీకు అంత గొప్పది! నా కంటే గొప్పది! ఆ శమంతకమణి గొప్పదో, నేను గొప్పో, ఆ కృష్ణుడే రుజువుచె…్యూలి!'' అంటూ చరచరా వెళ్ళింది.

కొద్ది రోజుల తరవాత వినా…ుకచవితి వచ్చింది. సత్యభామ …ుధావిధిగా విఘ్నే శ్వరుణ్ణి అమిత భక్తిశ్రద్ధలతో అర్చించి, ఆ సా…ుంత్రం పల్లకీలో ద్వారకానగరానికి బ…ులుదేరి వెళ్ళింది. ఆ సా…ుంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతున్నది. కృష్ణుడు ఆవు పాలు పితుకుతున్నాడు.
 
ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలల్లో తళు క్కున ప్రతిబింబించి కృష్ణుడికి కనిపించి క్షణంలో మబ్బు క్రమ్మి మా…ుమైంది. వినా…ుకచవితినాడు చంద్రుడు కంట బడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ, పూజా మందిరంలోకి వెళ్ళి అక్షతలు తలమీద చల్లు కొని, విఘ్నేశ్వరుని ముందు కూర్చుని కన్నులు మూసి, ‘‘దేవా!
 
ప్రతిబింబమే అయినా చూశాను, అంతా నీ ద…ు!'' అని ధ్యానించాడు. అతను అలా ధ్యానిస్తున్నప్పుడు, ‘‘కృష్ణా! నీవు చూడాలని చూడలేదుగా! నీలాపనింద పడినా మబ్బు విడిపోయినటే్ల విడిపోతుంది! ఇదీ ఒక లాభానికే అనుకోవ…్యూ!'' అంటూ విఘ్నేశ్వర ప్రతిమలోంచి వెలువడినట్లుగా మాటలు వినిపించాయి.
 
కృష్ణుడు కన్నులు తెరిచి, ‘‘స్వామీ! అంతా నీ లీల!'' అన్నాడు. అదే సమ…ుంలో రుక్మిణి పూజామందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరుని ముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూసి, ‘‘శ్రీవారు విఘ్నేశ్వరులవారితో ఏదో మంత నాలు జరుపుతున్నట్లున్నదే!'' అన్నది. కృష్ణుడు, ‘‘ఇదేవేళ ఒకానొక వినా…ుక చవితినాడు నన్ను పెంచిన …ుశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తుకొచ్చాయి, అంతే!'' అన్నాడు.

‘‘ ఆ ముద్దుమాటలేమిటో నాకు కూడా వినిపించవా, స్వామీ!'' అన్నది రుక్మిణి చిన్నగా నవ్వుతూ. కృష్ణుడు, ‘‘…ుశోదమ్మ పితుకుతున్న పాలలో చవితిచంద్రుడి బింబం చూసి కేరిం తాలు కొట్టాను. ఎన్ని నిందలు పడతావో కదా, అని …ుశోదమ్మ నొచ్చుకున్నది. పెద్ద…్యూక అయినా నింద తప్పదన్నది. దానికి నేను, అమ్మా, అప్పుడు మళ్ళా చూడాలి కదూ అని అన్నాను,'' అని చెప్పాడు.
 
రుక్మిణి, ‘‘మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది? ఎలాంటి నింద పడ్డారు?'' అనడిగింది. ‘‘మన్ను తింటున్నానని అన్న…్యు చెప్పనే చెప్పాడు!'' అన్నాడు కృష్ణుడు. రుక్మిణి, ‘‘మళ్ళీ ఇప్పుడు చంద్రుణ్ణి చూడ లేదు కద! చూడాలన్నా కనిపించడులెండి. బాగా మబ్బు పట్టి ఉంది!''అని ఏదో చెప్పబో తున్నట్లు చూసింది. ‘‘రుక్మిణీ! ఏదో చెప్పవచ్చినట్టున్నావే, ఆగావెందుకు? ఏమిటి విశేషం?'' అని అడిగాడు కృష్ణుడు. ‘‘విశేషమే!
 
సత్రాజిత్తులవారి ఇంటి మణి మన ఇంటికి విచ్చేసింది!'' అన్నది రుక్మిణి. కృష్ణుడు, ‘‘శమంతకమణి మన ఇంటికి రావడమేమిటి?'' అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘ఆ మణి కాదు, సత్రాజిత్తులవారి కన్యకా మణి--సత్యభామామణి వచ్చింది. చాలా సేపుగా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. తమ రాకకోసం చూసిచూసి ఇప్పుడే పల్లకీలో వెళ్ళింది.
 
ఆమెను సాగనంపి ఇలా వచ్చాను. మీరు కనిపించారు!''అన్నది రుక్మిణి. కృష్ణుడు తల పంకించి, ‘‘అలాగా! మన ఇంటి విఘ్నేశ్వర దేవుణ్ణి కూడా చూడాలని వచ్చి ఉంటుంది, చూసింది కదా!'' అన్నాడు. రుక్మిణి, ‘‘విఘ్నేశ్వర దేవుణ్ణి చూడాలని వచ్చిందో, మీ కన్నుల్లో పడాలని వచ్చిందో మరి!
 
ఇక్కడ ఉన్నంతసేపూ ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికి వెతికి వేసారా…ుని మాత్రం నాకు రూఢిగా తెలుసు!'' అన్నది మందహాసం చేస్తూ. ‘‘ఏమిటీ వింత! మాటలు రావనుకున్న రుక్మిణీదేవి, ఈ రోజు చతురంగా మాట్లాడు తున్నదే!'' అని కృష్ణుడు అన్నాడు.

No comments:

Post a Comment