Tuesday, July 17, 2012

సప్తమాతృకలు

సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.

పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.


1. బ్రహ్మాణి: ఈ మాతృమూతి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.
2. మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.
3. కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.
4. వైష్ణవి: విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహన్నని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.
5. వారాహి: హరి అవరారమైన యజ్ఞవరహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.
6. నారసిమ్హి: విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.
7. ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.

– ఇవీ సప్తమాతృకలు. అంటే స్ర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.

ఇలా ‘సర్వంశక్తిమయం’ అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.

No comments:

Post a Comment