Tuesday, July 17, 2012

బ్రహ్మ కడిగిన పాదము

అన్నమాచార్య విరచితమైన ‘బ్రహ్మ కడిగిన పాదమూ సంకీర్తనంలోని, ‘బ్రహ్మ కడిగిన పాదమూ వెనుక ఓ అసక్తికరమైన పురాణోదంతం ఉంది.

   హిమవంతుని కుమార్తె గంగ. ఆమైను బ్రహ్మదేవుడు దత్త పుత్రికగా స్వీకరించి శివునికిచ్చి వివాహం జరిపిస్తాడు. శివుని వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ పుత్రికావాత్సల్యంతో దు:ఖితుడైనాడు. తండ్రిని ఓదార్చిన గంగ జలరూపంలో బ్రహ్మ కమండలంలోపలికి, స్త్రీ రూపంలో శివుని వెంట వెళ్ళింది.


   కొంతకాలం తర్వాత శ్రీమన్నారాయణుడు వామనునిగా అవతరించాడు. బలి దగ్గర మూడడుగుల నేలను దానమడిగి, ముల్లోకాలను అక్రమించి, ఒక పాదంతో సత్యలోకాన్ని ఆక్రమించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరి పాదాన్ని భక్తి పారవశ్యంతో తన కమండలంలోని గంగాజలంలో కడిగాడు. అలా పరమపావన విష్ణుపాదాన్ని చేరుకున్న గంగ. అక్కడే భగీరధుడు తన తపశ్శక్తితో భూమికి రప్పించాడు. అందుకే గంగను ‘విష్ణుపాదోద్భవా మని అన్నారు. ఈ ఉదంతాన్నే అన్నమయ్య ‘బ్రహ్మ కడిగిన పాదమూ అనే సంకీర్తనంలో ఉదహరించారు.

No comments:

Post a Comment