Friday, January 2, 2015

శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసము- దక్షిణ కాశి అంటారు.

ఈశ్వరుని అజ్ఞా చేత బ్రహ్మ దేవుడు కైలాసమున గల శిఖరములో ముఖ్యమైన శివానందైక నిలయమును,శిఖరమును శ్రీ కాళహస్తి క్షేత్రంలో స్తాపించి,శివుని పూజించి ధన్యుడాయేను.దీని వలన శ్రీ కాళహస్తిలో వెలసిన పర్వతమునకు దక్షిణ కైలాసము అని పేరు వచ్చెను.

శ్రీకాళహస్తిశ్వరాలయం అనుకోని సువర్ణముఖినది ఉత్తర వాహినిగా,ఆలయమునకు అనుకోని ప్రవహించుచున్నది. పక్షిమ భాగమున,తిరుమంజన గోపురమున్ కేదురగానున్న నదిస్నాన ఘట్టమునకు,మణికర్ణిక ఘట్టము అని పేరు. కాశి వాలే ఇచ్చట ఉత్తరవాహిని నదియు,మణికర్ణికా స్నానఘట్టమును నుండుటచే దీనికి దక్షిణకాశియని పేరు గలిగినది.ఇక్కడ కుడా శివుడు జీవులకు తారక మంత్రోపదేశంగా గావించుచున్నాడట.

ఆలయ నిర్మాణ పద్ధతి
భారత దేశమందలి ఆలయముల వాలేగాక శ్రీ కాళహస్తిశ్వరుని ఆలయ నిర్మాణంలోనొకవిసిస్థతగలదు.ఇచ్చటవినాయకుడు,శ్రీకాళహస్తిశ్వరుడు,దక్షిణామూర్తి,అమ్మవార్లు, ఒక్కకరు దిక్కునకు వెలసియున్నారు.దీనిని బట్టి జీవులు తరింప బడుటకు మూల మగు ధర్మార్ధకామ మోక్షములను చతుర్విద పురుషార్ధక సూచనమే ఈ దేవాలయముఅని మనస్సుకు తోచుచున్నాదని పెద్దల నమ్మిక.మొదటి దైవ ధర్మము,ఆత్మధర్మమూగ ఉత్తరాభి ముఖ్యమైన శ్రీ పాతాళ గణపతి ఉనికిలో తెలియనగును.రెండొవది అర్ధము.ఆత్మజ్ఞానోపదేశానార్ధముగా ఉమా దేవి స్వరూపమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంభిక దేవి తుర్ఫుముఖముగా నిలిచి ముముక్షవులకు బోధించుచుండెను.ముడోవడైన కామము ,దక్షిణ ముఖముగా నుండి(మహాద్వారముకు ఎదురుగా) సత్సశిసుందర దక్షిణామూర్తిత్వం,గురుస్వరూపంలో జీవులకు ఇహ పర కార్యంబులు సిద్దించుట తధ్యమని తెలియనగును.

తుదిగా మోక్షము మోక్షదికారియైన పరమశివుని స్వరూపమగు శ్రీ కాళహస్తిశ్వరుడు పశ్చిమాభిముకముగా నిలిచి అస్తమయ సూర్యుని మూలమున జీవునకు మరణము తధ్యం అని తెలుప బడింది.అప్పటికప్పుడే శివ సాయుజ్య[ప్రాప్తికి ప్రయత్నం జేయవలయును సుక్ష్మ సందేశము అందించు చున్నాడు. ఇట్లు మనవోజ్జివన సాధనములు అయిన ధర్మార్ధకామమోక్షములను నొక ప్రతికయే శ్రీ కాళహస్తిశ్వరాలయం.

స్వర్ణముఖినది
అగస్త్య మహాముని తన శిష్య గణంబులతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను.అప్పుడు వారికీ నీరు లబింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరించెను.బ్రహ్మ ప్రతక్ష్యమైన తపమునకు మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధంగా ఆకాశగంగను ప్రసాదించెను.గంగాదేవి సువర్ణముఖి స్రవంతి రూపమున అగస్త్య పర్వతంలో అవతరించి ,శ్రీ కాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తుర్ఫు సముద్రమున కలిగియున్నది.ఈ నాటి నదిలో అనేక తీర్ధరాజములు విలసితములై దక్షిణ కైలాసం నానుకొని ప్రవహించుచున్నది.

వేయి లింగాల కోన
ఇది ఒక ప్రకృతి రమణీయమైన స్టల రాజము.ఈ కొనలో యక్చేశ్వరలింగం కలదు. ఇందు యక్ష రూపంన పరమేశ్వరుడు దేవతలకు దర్శనమెచ్చును. ఉమాదేవి అను జ్ఞాన ప్రసూనాంభదేవి దేవేంద్రులకు జ్ఞానోపదేశం చేసినదిఇచ్చట.అనేక మహర్షులు ,శిష్యులకు తత్వోచోపదేసం చేసిన చోటు ఇచ్చటనే.సహస్రలింగ తిర్డరాజము కలదు.

భరద్వాజ తీర్ధం
దేనిని `లోబావి అని అందురు.ఇందు భరద్వాజముని ఒకప్పుడు తప్పస్సు చెసినట.ఇచ్చట చతురస్రాకారంగా నొక పద్మ సరోవరం కలదు. భైరవునికోన, మర్కేండేయ తీర్ధములు ప్రకృతి సంపదకు పుట్టినిల్లు.


పాతాళగంగ-మూక తీర్ధం
దేవాలయంలోని మూక తీర్ధం నత్తి ముగాలను పోగొట్టి వాక్చాతుర్యంను కలిగించును.

No comments:

Post a Comment