Tuesday, June 23, 2015

కల్పం అంటే 72 మహాయుగాలు.

మహాయుగం అంటే కృత, త్రేతా ద్వాపర, కలియుగాలు..
4,32,000
సంవత్సరాలు కలియుగం. దీనిని రెండుతో హెచ్చవేస్తే
4,32,000 X 2 = 8,64,000, ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే
4,32,000 X 3 = 12,96,000 త్రేతాయుగం.

కలియుగాన్ని 4తో గుణిస్తే
4,32,000 X 4 = 17,28,000 సత్య లేక కృతయుగం అంటారు..
ఈ యుగాలు అన్ని గుణిస్తే 43,20,000 సంవత్సరాలు కలిపి ఒక మహాయుగం..
ఇలాంటి మహాయుగాలు 72 కలిస్తే ఒక కల్పం అవుతుంది.
311040000
సంవత్సరాలు ఒక కల్పం. ఇది బ్రహ్మ గారికి ఒక
పగలు. ఇంతే సమయం ఒక రాత్రి.
మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అవతారాలు ఒక మహాయుగంలో వచ్చినవి కావు. ఇప్పటి వరకు వచ్చిన అవతారాలు 28 మహాయుగాలలో వచ్చాయి. మత్స్యావతారం కల్పం చివరి నుండి కల్పం మొదలయ్యేవరకు
ప్రళయకాలంలో సాగింది.
దీని తరువాత వరాహ అవతారం ఇది మొదటి
మహాయుగంలో జరిగింది. మత్స్యావతారం 3వ మహాయుగంలో జరిగింది.
రామావతారం 24వ మహాయుగంలో
జరిగింది. రామసేతువు వయస్సు ఇప్పటికి 4 మహాయుగాలు దాటింది. అంటే
సుమారుగా చెప్పాలంటే
43,20 000 X 4 = 1,72,80,000
సంవత్సరాలు గడిచింది.
దీనికి 8,64,000 ద్వాపరయుగం + 5116
సంవత్సరాలు కలియుగం కూడా కలుపుకుంటే ఇంచుమించుగా వస్తుంది. అంటే రామసేతు
నిర్మించి 1,81,49116 సంవత్సరాలు గడిచింది.
త్రేతాయుగంలో ఎప్పుడు కట్టారో మనకి తెలియదు కనుక సరిగ్గా చెప్పలేం. మరలా శ్రీకృష్ణుల వారు 28వ ద్వాపర కలియుగాల సంధి కాలంలో అవతరించారు.
ప్రస్తుతం మనం28 వ మహాయుగంలో ఉన్న కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం. ప్రతి
మహాయుగానికి ఒక ఇంద్రుడు మారతాడు. అలాగే ఒక కల్పానికి 7గురు మనువులు ఉంటారు.
ప్రస్తుతం సూర్యుడి పుత్రుడు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఇతని తదనంతరం సూర్యుడి రెండో భార్య చ్ఛాయాదేవి కుమారుడు
మనువు అవుతాడు.

No comments:

Post a Comment