Sunday, August 2, 2015

తొలి ఏకాదశి

తొలి ఏకాదశి ఆషాడ శుద్ధఏకాదశి నాడు ఆచరిస్తారు. ఆషాడమాసము లోనే ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది.ఈ పండుగ దాదాపు దక్షిణాయనము ప్రారంభము అయిన తరువాత మొదటి పండుగని తొలి ఏకాదశి గా ప్రజలు చేస్తారు.ఈ పండుగ పూర్వ కాలములో ఏరువాక వేడుకల్లో భాగముగా చేసేవారు.
తొలి ఏకాదశి వైష్ణవం లో ముఖ్యమైన పండుగ. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు అందుకని తోలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు.దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువు ను పూజించి సేవిస్తారు.
ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన శేషశయన ఏకాదశి అని పిలుస్తారు.అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు.విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే.
ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వార ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణం లో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని వున్నది.
సూర్య వంశం లో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు,సత్యసంధుడు. అతని రాజ్యం లో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి

2 comments:

  1. hello sir, my name is sambamurthy. I read your article about Tirumala Tirupati Balagi is very nice. thank your sir.

    ReplyDelete