Sunday, August 2, 2015

ఈ ఆలయంలో నాలుగు వందల ఏళ్లుగా ఆరని దీపం....

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సీతారామచంద్రస్వామి
మానేరు నదీతీరం మధ్య ఉన్న ఆ గ్రామానిది ప్రత్యేకత..
అచంచెలమైన భక్తి విశ్వాసం ఆ గ్రామస్థుల నిత్యపూజలకు
నిదర్శనం.. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో
నందాదీపం తరతరాలుగా వెలుగుతోంది.
పూర్వీకులు వెలిగించిన ఆ దీపాన్ని గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో కాపాడుతున్నారు. జ్యోతి వెలిగితేనే ఆవునూరు సిరిసంపదలతో
తులతూగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం..
సిరిసిల్ల/ఆవునూరు: ముస్తాబాద్ మండలం ఆవునూరులోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతోంది. ఈ దీపానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని ప్రతీతి. నిత్యం
దీపధూప నైవేద్యాలతో సీతారామచంద్రస్వామిని పూజిస్తూ అచంచెల భక్తిభావాన్ని చాటుకుంటున్నారు గ్రామస్థులు.
జ్యోతి వెలిగినంతకాలం తమ గ్రామంలో సిరిసంపదలకు
లోటు ఉండదనేది ఇక్కడి ప్రజల నమ్మకం. నందాదీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు నాలుగు వందల ఏళ్ల చరిత్రకు ఆధారాలు
లేకపోయినా దీపం నిత్యం వెలుగుతూనే ఉందని నాలుగు తరాలకు చెందిన గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆలయంలో కొలువుదీరిన
సీతారామచంద్రస్వామి భక్తుల కొంగుబంగారమై కోరినకోరికలు తీరుస్తున్నాడు. పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం మానేరు నదీతీరంలోని
పచ్చని పొలాల మధ్య ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణ కనిపిస్తుంది. మరోవైపు ఆలయ అభివృద్ధిపై కమిటీ ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తుంది.

No comments:

Post a Comment