Wednesday, September 18, 2013

జీవాత్మ – పరమాత్మ – మోక్షం అనగానేమి?

ప్రతి మానవుడి (జీవాత్మ ) అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే. పరమాత్మ యొక్క తేజస్సుసృష్టి ప్రారంభమగునపుడు. ప్రకృతి యెక్క ప్రబావంతో అనేకానేకములైన ఆత్మలుగా ప్రతిబింబించను. ఇలా అనేకములుగా ఉన్న ఆత్మలనే జీవాత్మలని అంటాం. వాస్తవానికి పరమాత్మ యెక్క ప్రతిబింబమే అలా పధార్థంతో ఏకమైన జీవాత్మ తన నిజమైన ఉనికిని మరచి, పదార్థాన్నే (దేహాన్నే ) తానని భ్రమించి, పుట్టచూ గిట్టుచూ (దేహాలను మార్చుకుంటూ) గమ్యాన్ని మరిచి తిరుగును. ఇలా జీవాత్మ గతి తప్పి తిరగడాన్నే ‘ సంసారం ’ అని అంటారు. అలాంటి జీవాత్మ మానవ జన్మ ఎత్తి తన నిజతత్వాన్ని గురువుల బోధనలతో అర్థం చేసుకొని, బౌతికమైన మరియు మానసికమైన బంధాలనుండి తపోసాధనలతో తెంచుకొని పరమాత్మలో తన ఉనికిని స్థిరం చేసుకోవడాన్నే మోక్షం అని అంటారు. ఇలా మోక్షము పొందడము కేవలము వివేకవంతుడైన మనిషికి మాత్రమే సాధ్యం. ఎప్పుడూ ఉనికి కలిగి వుండి తన తత్వమైన పరమ ఆనందాన్ని పొందుతూ ప్రకృతికి అతీతంగా ఉండునదే పరమాత్మ. కావున ప్రకృతికి అతీతమైన స్థితిని చేరిన ముక్తిపొందిన ఆత్మ తిరిగి జన్మంచదు. కష్టాలపాలు కాదు, నిత్యానందాన్ని శాశ్వతంగా అనుభవిస్తుంది. సర్వవిధ భగవత్ సాధనల పరమ లక్ష్యం జీవాత్మ తన నిజస్థితియైన పరమాత్మ స్థానాన్ని పొందడమే.

No comments:

Post a Comment