Monday, September 16, 2013

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి...ఫలితం ఏంటి?

నిత్యం తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తుండే భక్తులలో కొంతమంది ఏడు వారాలలో ఒక్కొక్క దేవునికి మొక్కుకుంటూ ఉంటారు.

ఇలా ఏడు రోజులపాటు పూజలు చేస్తే శివుని కరుణాకటాక్షాలు లభిస్తాయన్నది శాస్త్రవచనం. ఆ పూజా విధానాన్ని
అనుసరించి.....

ఆదివారం : సూర్య భగవానుని పూజించాలి. ఆదివారం నాడు సూర్యుని ఆరాధించడం వల్ల తలనొప్పులు, కంటిజబ్బులు నయమవుతాయి. కుష్ఠురోగం తగ్గుముఖం పడుతుంది.

సోమవారం : లక్ష్మీదేవిని పూజిస్తే సంపదవృద్ధి జరుగుతుంది.

మంగళవారం : కాళికామాతను పూజిస్తే రోగాల నుండి బయటపడవచ్చు.

బుధవారం : విష్ణుపూజ చేయాలి. ఈ రోజున విష్ణుపూజ చేయడం వలన బంధుమిత్రులకు మంచి జరుగుతుంది.

గురువారం : ఇష్టదేవతను పూజించాలి. ఈ రోజున తమ ఇష్టదేవతలను పూజించుకున్న వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది.

శుక్రవారం : ఈ రోజున ఇష్టదేవతాపూజ చేయడంవలన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యసిద్ధి.

శనివారం : ఈ రోజున రుద్రాదిదేవతలను పూజించుకున్నవారికి ప్రమాదాలనుంచి రక్షణతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఈ విధంగా ఆయా వారాలలో ఆయా దేవతల పూజలను చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

No comments:

Post a Comment