Thursday, August 29, 2013

తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం,

తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ వరాహస్వామివారికే అందుతాయి. ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు. హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరివేస్తాడు. ఆ భూమాతను రక్షించడానికి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి కోపం తెచ్చుకోకుండా ఆవేశ పడకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకొని సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు.
ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే నని ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా వరాహస్వామి దర్శనం అవుతుందని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు.

No comments:

Post a Comment