Saturday, August 31, 2013

కాకులు పితృదేవతలు

కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.

సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.

కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.

ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment