Thursday, August 15, 2013

సంధ్యా వందనం చేయనివానికి వచ్చే దోషాలు..

ప్రతిరోజూ మూడు పూటలా సంధ్యావందనం చెయ్యనివాడు ఎన్నిపూజలు చెసినా ఫలితం ఉండదు. అలా మూడు సంధ్యలలో సంధ్యావందనము చేసినవాని పాదధూళి వల్ల కనుచూపంతా పవిత్రతతో పులకిస్తుంది. సంధ్యావందనం చెయ్యకుండా దేవతలకు నైవేద్యాన్ని పెడితే స్వీకరించరు. అట్లే విష్ణుమంత్రాన్ని పఠించనివాడూ, దైవప్రసాధాన్ని స్వీకరించక వద్దనేవాడూ, కన్యలను అమ్మినవాడూ, వడ్డీ వ్యాపారీ, సూర్యోదయ సమయంలో నిద్రించేవానికి ఏ పూజలు చేసినా పుణ్యం రాదని సూర్యదేవుని గ్రంథంలో వివరించబడింది

No comments:

Post a Comment